Delhi Blast Case: ఢిల్లీ బ్లాస్ట్ కేసులో I-20 కారు యజమాని అరెస్ట్..
- ఉమర్ ఉన్ నబీ కలిసి దాడికి ప్లాన్
- కారు కొనుగోలు చేసిన అమీర్ రషీద్ అలీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Delhi Blast Case: ఢిల్లీ ఎర్రకోట ప్రాంతంలో జరిగిన కార్ బాంబు పేలుడు కేసులో NIA (జాతీయ దర్యాప్తు సంస్థ) ఒక పెద్ద పురోగతిని సాధించింది. ఆత్మాహుతి దాడికి కుట్ర పన్నిన వ్యక్తిని ఈ ఏజెన్సీ అరెస్టు చేసింది. NIA అరెస్ట్ చేసిన నిందితుడి పేరు అమీర్ రషీద్ అలీ. ఈ పేలుడుకు ఉపయోగించిన కారు అతని పేరు మీద రిజిస్టర్ అయ్యింది. NIA అతన్ని ఢిల్లీలో అరెస్టు చేసింది. ఈ పేలుడుపై మొదట ఢిల్లీ పోలీసులు దర్యాప్తు చేయగా, తర్వాత కేసును NIAకి అప్పగించారు. కేసును స్వాధీనం చేసుకున్న తర్వాత NIA సర్చ్ ఆపరేషన్ ప్రారంభించి అమీర్ను అరెస్టు చేసింది.
READ ALSO: Tej Pratap Yadav: ఎన్డీఏకు మద్దతు ప్రకటించిన లాలూ యాదవ్ కొడుకు!
Also Read
- Vaibhav's Father: ‘నేల తల్లిని తాకట్టు పెట్టి... నెత్తురు పంచుకుపుట్టిన బిడ్డను క్రికెట్ శిఖరాలకు చేర్చిన నాన్న’..
- Pentagon Lockdown: పెంటగాన్లో హై అలర్ట్.. ప్రమాదకర పదార్థాల హెచ్చరికతో లాక్డౌన్.. తరలింపు
- CM Chandrababu: వికసిత్ భారత్తో స్వర్ణాంధ్ర 2047 విజన్ అనుసంధానం..
- UK: ప్రధాని కీర్ స్టార్మర్తో వాగ్వాదం.. రక్షణ మంత్రి జాన్ హీలీ రాజీనామా
అమీర్ అరెస్ట్..
జమ్మూ కాశ్మీర్లోని పాంపోర్లోని సంబురాకు చెందిన వ్యక్తి అమీర్. ఆయన పుల్వామాకు చెందిన ఉమర్ ఉన్ నబీ అనే వ్యక్తితో కలిసి ఈ దాడికి ప్రణాళిక వేసినట్లు ఎన్ఐఏ దర్యాప్తులో తేలింది. దాడికి ఉపయోగించిన కారును కొనుగోలు చేయడంలో సహాయం చేయడానికి అమీర్ ఢిల్లీకి వచ్చాడు, తరువాత దానిని పేలుడు కోసం IED (బాంబు తయారీ పరికరం)గా ఉపయోగించారని ఎన్ఐఏ తెలిపింది. ఫోరెన్సిక్ దర్యాప్తుల ద్వారా, పేలుడు జరిగిన సమయంలో కారులో ఉన్న డ్రైవర్ను NIA గుర్తించింది. అతన్ని ఉమర్ ఉన్ నబీగా వెల్లడించింది. పుల్వామా నివాసి అయిన ఉమర్, హర్యానాలోని ఫరీదాబాద్లోని అల్-ఫలాహ్ విశ్వవిద్యాలయంలో జనరల్ మెడిసిన్ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేశాడు.
కొనసాగుతున్న ముమ్మర దర్యాప్తు ..
ఒమర్ ఉన్ నబీకి చెందిన మరో వాహనాన్ని కూడా NIA స్వాధీనం చేసుకుంది. మరిన్ని ఆధారాలను సేకరించడానికి ఆ వాహనాన్ని ఇప్పుడు పరిశీలిస్తున్నట్లు అధికారులు తెలిపారు. నవంబర్ 10న ఢిల్లీలో జరిగిన పేలుడులో గాయపడిన వారితో సహా ఇప్పటివరకు 73 మంది సాక్షులను ఈ ఏజెన్సీ ప్రశ్నించింది. ఢిల్లీ , జమ్మూ కాశ్మీర్, హర్యానా, ఉత్తరప్రదేశ్ పోలీసులు, ఇతర ఏజెన్సీల సహకారంతో NIA ఈ కేసును దర్యాప్తు చేస్తోంది. పేలుడులో పాల్గొన్న వ్యక్తులు, సంస్థలను, వారి కుట్రలను గుర్తించడానికి దర్యాప్తు సంస్థ ఇప్పుడు ముమ్మర దర్యాప్తు చేస్తుంది. కేసును కేసు నంబర్ RC-21/2025/NIA/DLI కింద నమోదు చేశారు. ఇప్పుడు ఈ కేసు దర్యాప్తు రాష్ట్రం నుంచి రాష్ట్రానికి విస్తరిస్తుంది.
READ ALSO: Varanasi : వామ్మో.. వారణాసి ఈవెంట్ కు అన్ని కోట్లు పెట్టారా..?
తాజావార్తలు
-
Vaibhav’s Father: ‘నేల తల్లిని తాకట్టు పెట్టి… నెత్తురు పంచుకుపుట్టిన బిడ్డను క్రికెట్ శిఖరాలకు చేర్చిన నాన్న’..
-
Pentagon Lockdown: పెంటగాన్లో హై అలర్ట్.. ప్రమాదకర పదార్థాల హెచ్చరికతో లాక్డౌన్.. తరలింపు
-
CM Chandrababu: వికసిత్ భారత్తో స్వర్ణాంధ్ర 2047 విజన్ అనుసంధానం..
-
UK: ప్రధాని కీర్ స్టార్మర్తో వాగ్వాదం.. రక్షణ మంత్రి జాన్ హీలీ రాజీనామా
-
Shreyas Iyer: ఇంటి అద్దె రూ. 7.14 కోట్లు.. ముంబైలో హాట్ టాపిక్గా మారిన శ్రేయస్ అయ్యర్ కొత్త నివాసం..
ట్రెండింగ్
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?
-
Mohammed Siraj Wedding: హీరోయిన్తో మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్లోనే ముహూర్తం!
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్లైన్ మ్యాప్స్తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్లో లాంచ్..!