Rajnath Singh : బ్రిటన్ ప్రధాని సునక్ తో రాజ్నాథ్ సింగ్ భేటీ.. రక్షణ, వాణిజ్యం సహా పలు అంశాలపై చర్చ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rajnath Singh : భారత రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ బ్రిటన్లో పర్యటిస్తున్నారు. ఈ సమయంలో రక్షణ మంత్రి బుధవారం 10 డౌనింగ్ స్ట్రీట్లో బ్రిటిష్ ప్రధాని రిషి సునక్ను కలిశారు. ఈ భేటీలో ఇరువురు నేతలు పలు ద్వైపాక్షిక అంశాలపై చర్చించారు. చర్చల ఎజెండాలో రక్షణ, వాణిజ్యం, ప్రాంతీయ అంశాలు ఉన్నాయి. దీంతోపాటు స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్టీఏ)కు సంబంధించి కొనసాగుతున్న చర్చల పురోగతిపై కూడా మాట్లాడుకున్నారు. ప్రధాని సునక్తో పాటు, రాజ్నాథ్ సింగ్ విదేశాంగ మంత్రి డేవిడ్ కామెరాన్ను కూడా కలిశారు. బ్రిటన్ విదేశాంగ మంత్రి డేవిడ్ కామెరూన్తో భారత్-యుకె సంబంధాలను పెంపొందించడం, ఇరు దేశాల మధ్య సహకారాన్ని మరింతగా బలోపేతం చేయడంపై ఆచరణాత్మక చర్చలు జరిగాయని రాజ్నాథ్ సింగ్ సోషల్ మీడియాలో రాశారు.
Read Also:Jagananna Thodu: గుడ్న్యూస్ చెప్పిన సీఎం.. వడ్డీ లేకుండా రుణం.. నేడే వారి ఖాతాల్లో నగదు జమ
Also Read
- Iran-US Ceasefire: గుడ్న్యూస్.. కాల్పుల విరమణకు అమెరికా-ఇరాన్ అంగీకారం?
- Islamabad: ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం.. అగ్నికి ఆహుతైన 15 మంది నవజాత శిశువులు
- WhatsApp: వాట్సాప్ వినియోగదారులకు మైండ్ బ్లోయింగ్ అప్డేట్.. ఇక మీ అకౌంట్కు డబుల్ ప్రొటెక్షన్!
- Fake Cancer Drugs: క్యాన్సర్ బాధితుల ప్రాణాలతో చెలగాటం.. నీళ్లతో నింపిన నకిలీ ఇంజెక్షన్ల విక్రయం గుట్టురట్టు
రెండు అత్యున్నత స్థాయి సమావేశాల తర్వాత, రాజ్నాథ్ సింగ్ తన కౌంటర్ గ్రాంట్ షాప్స్తో కలిసి UK-ఇండియా డిఫెన్స్ ఇండస్ట్రీ సీఈఓల రౌండ్టేబుల్కు సహ-అధ్యక్షుడిగా వ్యవహరించారు. సహ-ఉత్పత్తిపై దృష్టి సారించిన బ్రిటన్తో సుసంపన్నమైన రక్షణ భాగస్వామ్యాన్ని భారత్ ఊహించుకుంటోందని ఆయన అన్నారు. రౌండ్టేబుల్కు UK రక్షణ పరిశ్రమకు చెందిన పలువురు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లు (CEOలు), UK రక్షణ మంత్రిత్వ శాఖ (MOD), UK-ఇండియా బిజినెస్ కౌన్సిల్ (UKIBC), కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (CII) ప్రతినిధులు హాజరయ్యారు.
Read Also:Kadiyam Srihari: కడియం ఆసక్తికర వ్యాఖ్యలు.. బీఆర్ఎస్ ను తిరిగి టీఆర్ఎస్ గా మార్చండి..!
భారత్తో పాటు మరే దేశంలోనూ డిజిటల్ లావాదేవీల్లో 80 కోట్ల మంది ఇంటర్నెట్ వినియోగదారులు లేరని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. ప్రపంచం మొత్తం మా UPI యాప్ని ఆమోదించింది. యూపీఐ ద్వారా దాదాపు 130 లక్షల కోట్ల లావాదేవీలు జరిగాయన్నారు. చైనా మౌత్ పీస్ అయిన గ్లోబల్ టైమ్స్ రచయిత రాసిన కథనంలో భారత్ పట్ల చైనా వైఖరిలో భారీ మార్పు వచ్చిందని రక్షణ మంత్రి అన్నారు. భారతదేశంలో ఆర్థిక, వ్యూహాత్మక మార్పుల కారణంగా భారతదేశ ఆర్థిక వ్యవస్థ వ్యూహాత్మక శక్తిగా మారిందని చైనా ప్రభుత్వం కూడా విశ్వసిస్తోంది. మేము ఎవరినీ శత్రువులుగా భావించడం లేదు కానీ భారతదేశం, చైనా మధ్య సంబంధాలు బాగా లేవని ప్రపంచానికి తెలుసు. అందరితోనూ సంబంధాలను మెరుగుపరుచుకోవాలనుకుంటున్నామన్నారు.
తాజావార్తలు
-
Lurk OTT Release: ఆ అడవిలో అసలు భయం మనుషులే.. ఓటీటీలోకి మలయాళం సర్వైవల్ థ్రిల్లర్.. 8.8 ఐఎండీబీ రేటింగ్
-
Iran-US Ceasefire: గుడ్న్యూస్.. కాల్పుల విరమణకు అమెరికా-ఇరాన్ అంగీకారం?
-
Islamabad: ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం.. అగ్నికి ఆహుతైన 15 మంది నవజాత శిశువులు
-
US Visa Interview Pause: అమెరికా వీసా కోసం ఎదురుచూస్తున్నవారికి షాక్.. ప్రపంచవ్యాప్తంగా ఇంటర్వ్యూలు వాయిదా, కారణం ఇదే!
-
Ravi Teja-Irumudi: బాక్సాఫీస్ను షేక్ చేస్తున్న ‘ఇరుముడి’.. రవితేజ @ 100 కోట్ల సినిమాల లిస్ట్ ఇదే!
ట్రెండింగ్
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్చేస్తే..
-
144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!