Rajnath Singh: ముప్పు వాటిల్లితే తగ్గేదేలే.. శత్రు దేశాలకు భారత్ హెచ్చరిక?
- ముప్పు వాటిల్లితే తగ్గేదేలే
- శత్రు దేశాలకు భారీ హెచ్చరిక
- సుక్నా మిలటరీ స్టేషన్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాజ్నాథ్ సింగ్ ప్రసంగం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భద్రత విషయంలో భారత్ రాజీపడదని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ దసరా సందర్భంగా అన్నారు. ఏ దేశమైనా భారత్ ప్రయోజనాలను దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తే కఠిన చర్యలు తీసుకునేందుకు భారత్ వెనకాడబోదని అన్నారు. పశ్చిమ బెంగాల్లోని సుక్నా మిలటరీ స్టేషన్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాజ్నాథ్ సింగ్ ప్రసంగించారు. భారతదేశం ఏ దేశంపైనా ద్వేషపూరిత భావంతో, ద్వేషపూరితంగా దాడి చేయలేదన్నారు. ఎవరైనా మమ్మల్ని అవమానించినప్పుడు లేదా మన సమగ్రత, సార్వభౌమత్వాన్ని దెబ్బతీసేందుకు ప్రయత్నించినప్పుడు మాత్రమే పోరాడుతామన్నారు. మన ప్రయోజనాలకు ముప్పు కలిగితే, పెద్ద అడుగు వేసేందుకు సిద్ధంగా ఉన్నామని శత్రు దేశాలను హెచ్చరించారు.
READ MORE: Kurnoool: లక్ష్మీ నరసింహ స్వామి రథోత్సవంలో అపశృతి.. జనంపై పడిన రథం
Also Read
- Donald Trump: ఓ వైపు డీల్, మరోవైపు ఇజ్రాయిల్ దాడులు.. ట్రంప్ తీవ్ర అసంతృప్తి..
- TMC Crisis: బెంగాల్ రాజకీయాల్లో సంచలనం.. ‘‘నేషనలిస్ట్ సిటిజన్స్ పార్టీ’’లో టీఎంసీ ఎంపీలు విలీనం..
- INDW Vs PAKW: రీచా ఘోష్ మెరుపు ఇన్నింగ్స్.. పాకిస్థాన్ ముందు భారత్ టార్గెట్ ఎంతంటే..
- Harmanpreet Kaur: రోహిత్ శర్మ రికార్డును బద్దలు కొట్టిన హర్మన్ప్రీత్ కౌర్.. దేశ చరిత్రలోనే తొలి ప్లేయర్గా..
భారీ ప్రాజెక్ట్..
ఇదిలా ఉండగా.. బీఆర్ఓ నిర్మించిన ఈ 75 ప్రాజెక్టులలో 22 రోడ్లు, 51 వంతెనలు, రెండు ఇతర ప్రాజెక్టులు ఉన్నాయి. వీటిలో జమ్మూ కాశ్మీర్లో 19, అరుణాచల్ ప్రదేశ్లో 18, లడఖ్లో 11, ఉత్తరాఖండ్లో 9, సిక్కింలో 6, హిమాచల్ ప్రదేశ్లో 5.. బెంగాల్, రాజస్థాన్, నాగాలాండ్, మిజోరాం, అండమాన్ నికోబార్ దీవుల్లో ఒక్కొక్కటి ఉన్నాయి. ఈ 75 ప్రాజెక్టులతో బీఆర్ఓ ఈ ఏడాది మొత్తం 111 మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను పూర్తి చేసింది. వాటి మొత్తం ఖర్చు రూ.3,751 కోట్లు.
READ MORE:Hamas: ఇరాన్ , హిజ్బుల్లా మద్దతు కోసం అక్టోబర్ 07 దాడి ఆలస్యం.. 9/11 తరహా దాడులకు ముందుగా ప్లాన్..
ఈశాన్య రాష్ట్రాలను బలోపేతం చేసేందుకు ప్రాజెక్టులు
శనివారం ప్రారంభించబడిన ప్రధాన ప్రాజెక్టులలో ఒకటి సిక్కింలో వ్యూహాత్మకంగా ముఖ్యమైన కుపుప్-షెర్తాంగ్ రహదారి. ఈ రహదారి జవహర్ లాల్ నెహ్రూ మార్గ్, జులుక్ యాక్సిస్ మధ్య ఒక ముఖ్యమైన లింక్గా పనిచేస్తుంది. ఇది ఆర్మీ సిబ్బంది, పరికరాల తరలింపు కోసం ప్రత్యామ్నాయ మార్గాన్ని అందిస్తుంది. వ్యూహాత్మక కారణాలతో సరిహద్దు మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడంతోపాటు ఈ ప్రాంతాలు, ముఖ్యంగా ఈశాన్య ప్రాంతాల సామాజిక-ఆర్థిక అభివృద్ధిని నిర్ధారించేందుకు ప్రభుత్వం ‘అచంచలమైన సంకల్పం’కు ఈ ప్రాజెక్టులు నిదర్శనం.
తాజావార్తలు
-
Women’s T20 World Cup 2026 : పాకిస్తాన్ను చిత్తు చేసిన భారత్.. దీప్తి శర్మ ఐదు వికెట్ల సునామీ.!
-
Donald Trump: ఓ వైపు డీల్, మరోవైపు ఇజ్రాయిల్ దాడులు.. ట్రంప్ తీవ్ర అసంతృప్తి..
-
CM Chandrababu : కృష్ణానది పడవ ప్రమాదంపై సీఎం చంద్రబాబు తీవ్ర విచారం.. మృతుల కుటుంబాలకు ఎక్స్గ్రేషియా ప్రకటన
-
Nag Ashwin: ‘మాయాబజార్’ సెట్స్ చూసిన మహానుభావుడితో సినిమా.. ఎమోషనల్ అయిన స్టార్ ప్రొడ్యూసర్!
-
TMC Crisis: బెంగాల్ రాజకీయాల్లో సంచలనం.. ‘‘నేషనలిస్ట్ సిటిజన్స్ పార్టీ’’లో టీఎంసీ ఎంపీలు విలీనం..
ట్రెండింగ్
-
Kitchen Hacks : నాన్-స్టిక్ అవసరమే లేదు.. ఈ ట్రిక్తో స్టీల్ పాత్రలే సూపర్.!
-
Child Safety Tips : స్కూల్స్ స్టార్ట్ అవుతున్నాయి.. పిల్లలకు ఈ 5 ‘అబద్ధాలు’ నేర్పించండి..!
-
Cleaning Hacks : పరుపు, దిండు నుంచి వాసన వస్తోందా.? ఈ ఒక్క చిట్కాతో నిమిషాల్లో ఫ్రెష్.!
-
Kitchen Tips : బియ్యాన్ని ఇలా కడగకపోతే అన్నం రుచి, ఆరోగ్యం రెండూ దెబ్బే.!
-
Rahamathullah Gurbaj: నా సెంచరీకి కారణం గౌతమ్ గంభీర్.. అఫ్గాన్ ఓపెనర్ ఆసక్తికర వ్యాఖ్యలు!