Delhi : రాజధానిలో దారుణ హత్య.. దుకాణం పైకప్పుపై మృతదేహం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Delhi : ఢిల్లీలో నేరాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఉత్తర ఢిల్లీలోని కొత్వాలి ప్రాంతంలో ఓ యువకుడిని రాయి, కత్తితో పొడిచి హత్య చేసిన ఘటన సంచలనం సృష్టించింది. శనివారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో దుకాణం పైకప్పుపై యువకుడి మృతదేహాన్ని చూసిన కార్మికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. మృతదేహంపై సమాచారం అందుకున్న క్రైం, ఎఫ్ఎస్ఎల్ టీమ్తో పాటు స్థానిక పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు.
ఈ ఘటనతో ఆ ప్రాంతంలో భయాందోళన నెలకొంది. పోలీసులు విచారణలో మృతదేహం దగ్గర మద్యం సీసా, రెండు గ్లాసులు లభ్యమయ్యాయి. మద్యం సేవిస్తూ వచ్చిన వివాదంలో యువకుడు హత్యకు గురైనట్లు అనుమానిస్తున్నారు. మృతి చెందిన యువకుడి ఆచూకీ ఇంకా తెలియరాలేదు. మృతదేహం పరిస్థితి మరీ విషమంగా ఉంది. రాయి, కత్తి దెబ్బలకు ముఖం మొత్తం చిధ్రమైంది.
Also Read
- Kudankulam Nuclear Plant: కుడంకుళం అణు కేంద్రంలో డేటా లీక్?.. డార్క్ వెబ్లో బ్లూప్రింట్లు
- Modi Cabinet Decisions: 7 ప్రతిపాదనలకు గ్రీన్సిగ్నల్.. కేంద్ర కేబినెట్ నిర్ణయాలు ఇవే..!
- Shubman Gill: కోహ్లీ, రోహిత్ శర్మను వెనక్కి నెట్టేసిన శుభ్మన్ గిల్.. ఒక్క విజయంతో మరింత ముందుకు..
- Sai Krishna Lockup Death Case: సాయి కృష్ణ కేసులో కీలక మలుపు.. సీబీఐ దర్యాప్తు విషయంలో హైకోర్టు కీలక ఆదేశాలు
Read Also:Surya Stotram: ఆదివారం సూర్య స్తోత్ర పారాయణం చేస్తే మీ జన్మధన్యం అవుతుంది
దుకాణం పైకప్పుపై మృతదేహం
లాంఛనాలు పూర్తి చేసిన పోలీసులు యువకుడి మృతదేహాన్ని తమ కస్టడీలోకి తీసుకుని పోస్టుమార్టం నిమిత్తం సబ్జీ మండి మార్చురీకి తరలించి, మృతుడిని గుర్తించేందుకు కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. పోలీసులు సమీపంలోని ప్రదేశాలను స్కానింగ్ చేస్తున్నారు. సమీపంలో అమర్చిన సీసీ కెమెరాలను కూడా తనిఖీ చేస్తున్నారు. ఓల్డ్ లజ్పత్ రాయ్ మార్కెట్, చాందినీ చౌక్లోని ఓ దుకాణం టెర్రస్పై మధ్యాహ్నం 12:15 గంటల ప్రాంతంలో యువకుడి మృతదేహం పడి ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందిందని ఉత్తర జిల్లా డీసీపీ మనోజ్ కుమార్ మీనా తెలిపారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసు ఉన్నతాధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.
మృతదేహం దగ్గర రక్తపు మరకలున్న రాయి
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. యువకుడి ముఖం, తలపై రాయితో కొట్టి దారుణంగా హత్య చేశారు. మృతదేహం దగ్గర రక్తంతో కూడిన రాయి కూడా కనిపించింది. మృతుడి ఆచూకీ కోసం చాలా ప్రయత్నాలు జరుగుతున్నా ప్రస్తుతం ఆచూకీ తెలియలేదు. యువకుడు దుకాణంలో పని చేస్తున్నాడని పోలీసులు అనుమానిస్తున్నారని, అందువల్ల యువకుడిని గుర్తించడంలో సహకరించాలని మార్కెట్లోని దుకాణదారులను కోరారు. సమీపంలోని సీసీటీవీ కెమెరాల ఫుటేజీ ఆధారంగా పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Read Also:Durga Stotram: ఆదివారం ఈ స్తోత్రం వింటే అభీష్టాలు నెరవేరుతాయి
తాజావార్తలు
-
Kudankulam Nuclear Plant: కుడంకుళం అణు కేంద్రంలో డేటా లీక్?.. డార్క్ వెబ్లో బ్లూప్రింట్లు
-
Modi Cabinet Decisions: 7 ప్రతిపాదనలకు గ్రీన్సిగ్నల్.. కేంద్ర కేబినెట్ నిర్ణయాలు ఇవే..!
-
Kiran Abbavaram: నన్ను తిట్టారు.. కొట్టారు.. తన్నారు! కిరణ్ అబ్బవరం ఎమోషనల్ కామెంట్స్!
-
#BanTheCensor: ఆర్జీవీ సంచలన పోస్ట్.. “ప్రేక్షకులను చిన్నపిల్లల్లా చూడొద్దు.. సెన్సార్ బోర్డును రద్దు చేయాలి”
-
Shubman Gill: కోహ్లీ, రోహిత్ శర్మను వెనక్కి నెట్టేసిన శుభ్మన్ గిల్.. ఒక్క విజయంతో మరింత ముందుకు..
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!