Delhi : రాజధానిలో దారుణ హత్య.. దుకాణం పైకప్పుపై మృతదేహం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Delhi : ఢిల్లీలో నేరాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఉత్తర ఢిల్లీలోని కొత్వాలి ప్రాంతంలో ఓ యువకుడిని రాయి, కత్తితో పొడిచి హత్య చేసిన ఘటన సంచలనం సృష్టించింది. శనివారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో దుకాణం పైకప్పుపై యువకుడి మృతదేహాన్ని చూసిన కార్మికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. మృతదేహంపై సమాచారం అందుకున్న క్రైం, ఎఫ్ఎస్ఎల్ టీమ్తో పాటు స్థానిక పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు.
ఈ ఘటనతో ఆ ప్రాంతంలో భయాందోళన నెలకొంది. పోలీసులు విచారణలో మృతదేహం దగ్గర మద్యం సీసా, రెండు గ్లాసులు లభ్యమయ్యాయి. మద్యం సేవిస్తూ వచ్చిన వివాదంలో యువకుడు హత్యకు గురైనట్లు అనుమానిస్తున్నారు. మృతి చెందిన యువకుడి ఆచూకీ ఇంకా తెలియరాలేదు. మృతదేహం పరిస్థితి మరీ విషమంగా ఉంది. రాయి, కత్తి దెబ్బలకు ముఖం మొత్తం చిధ్రమైంది.
Also Read
- Modi-Trump: మరోసారి మోడీపై ట్రంప్ ప్రశంసల జల్లు.. ఈసారి ఏమన్నారంటే..!
- Meloni-Trump: ఇటలీ ఎప్పుడూ అలా చేయదు.. ట్రంప్పై మెలోని తీవ్ర ఆగ్రహం
- Sai Krishna Missing Case: సాయి కృష్ణ కుటుంబానికి అండగా ప్రభుత్వం.. సీఎం భరోసాతో సంతృప్తి వ్యక్తం చేసిన తల్లి
- Sunil Gavaskar: గిల్ కెప్టెన్సీ ఇన్నింగ్స్పై గవాస్కర్ ప్రశంసలు.. ఆ 'గట్ ఫీల్' గురించే అంటూ వ్యాఖ్యలు..
Read Also:Surya Stotram: ఆదివారం సూర్య స్తోత్ర పారాయణం చేస్తే మీ జన్మధన్యం అవుతుంది
దుకాణం పైకప్పుపై మృతదేహం
లాంఛనాలు పూర్తి చేసిన పోలీసులు యువకుడి మృతదేహాన్ని తమ కస్టడీలోకి తీసుకుని పోస్టుమార్టం నిమిత్తం సబ్జీ మండి మార్చురీకి తరలించి, మృతుడిని గుర్తించేందుకు కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. పోలీసులు సమీపంలోని ప్రదేశాలను స్కానింగ్ చేస్తున్నారు. సమీపంలో అమర్చిన సీసీ కెమెరాలను కూడా తనిఖీ చేస్తున్నారు. ఓల్డ్ లజ్పత్ రాయ్ మార్కెట్, చాందినీ చౌక్లోని ఓ దుకాణం టెర్రస్పై మధ్యాహ్నం 12:15 గంటల ప్రాంతంలో యువకుడి మృతదేహం పడి ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందిందని ఉత్తర జిల్లా డీసీపీ మనోజ్ కుమార్ మీనా తెలిపారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసు ఉన్నతాధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.
మృతదేహం దగ్గర రక్తపు మరకలున్న రాయి
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. యువకుడి ముఖం, తలపై రాయితో కొట్టి దారుణంగా హత్య చేశారు. మృతదేహం దగ్గర రక్తంతో కూడిన రాయి కూడా కనిపించింది. మృతుడి ఆచూకీ కోసం చాలా ప్రయత్నాలు జరుగుతున్నా ప్రస్తుతం ఆచూకీ తెలియలేదు. యువకుడు దుకాణంలో పని చేస్తున్నాడని పోలీసులు అనుమానిస్తున్నారని, అందువల్ల యువకుడిని గుర్తించడంలో సహకరించాలని మార్కెట్లోని దుకాణదారులను కోరారు. సమీపంలోని సీసీటీవీ కెమెరాల ఫుటేజీ ఆధారంగా పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Read Also:Durga Stotram: ఆదివారం ఈ స్తోత్రం వింటే అభీష్టాలు నెరవేరుతాయి
తాజావార్తలు
-
Modi-Trump: మరోసారి మోడీపై ట్రంప్ ప్రశంసల జల్లు.. ఈసారి ఏమన్నారంటే..!
-
Hyderabad : కేబీఆర్ పార్క్ దగ్గర ట్రాఫిక్ ఆంక్షలు.. ప్రత్యామ్నాయ మార్గాలు ఇవే.!
-
Ragi Bellam Cake: చిన్న గిన్నెల్లోనే ఎగ్లెస్ రాగి బెల్లం కప్ కేక్స్.. హెల్తీ అండ్ టేస్టీగా ఇలా చేసుకోండి!
-
Meloni-Trump: ఇటలీ ఎప్పుడూ అలా చేయదు.. ట్రంప్పై మెలోని తీవ్ర ఆగ్రహం
-
Sai Krishna Missing Case: సాయి కృష్ణ కుటుంబానికి అండగా ప్రభుత్వం.. సీఎం భరోసాతో సంతృప్తి వ్యక్తం చేసిన తల్లి
ట్రెండింగ్
-
Virat Kohli Retirement: విరాట్ కోహ్లీ రిటైర్మెంట్పై టెన్షన్ అక్కర్లేదు.. మరో నాలుగేళ్లు ఆడుతాడు!
-
Rs 20 Note Viral: స్వామీ మా అత్త త్వరగా చనిపోయేలా చూడు.. దేవుడికి 20 రూపాయల నోటుపై వినతి!
-
T20 World Cup 2026: జోష్ మీదున్న భారత్కు భారీ షాక్.. ప్రపంచ కప్కు మ్యాచ్ విన్నర్ దూరం!
-
Sreesanth: టీమిండియాకు గౌతమ్ గంభీర్ అవసరమా?.. శ్రీశాంత్ సంచలన వ్యాఖ్యలు
-
144Hz రిఫ్రెష్ రేట్తో Hisense E8S ULED Mini-LED టీవీలు భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?