Delhi : రాజధానిలో దారుణ హత్య.. దుకాణం పైకప్పుపై మృతదేహం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Delhi : ఢిల్లీలో నేరాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఉత్తర ఢిల్లీలోని కొత్వాలి ప్రాంతంలో ఓ యువకుడిని రాయి, కత్తితో పొడిచి హత్య చేసిన ఘటన సంచలనం సృష్టించింది. శనివారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో దుకాణం పైకప్పుపై యువకుడి మృతదేహాన్ని చూసిన కార్మికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. మృతదేహంపై సమాచారం అందుకున్న క్రైం, ఎఫ్ఎస్ఎల్ టీమ్తో పాటు స్థానిక పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు.
ఈ ఘటనతో ఆ ప్రాంతంలో భయాందోళన నెలకొంది. పోలీసులు విచారణలో మృతదేహం దగ్గర మద్యం సీసా, రెండు గ్లాసులు లభ్యమయ్యాయి. మద్యం సేవిస్తూ వచ్చిన వివాదంలో యువకుడు హత్యకు గురైనట్లు అనుమానిస్తున్నారు. మృతి చెందిన యువకుడి ఆచూకీ ఇంకా తెలియరాలేదు. మృతదేహం పరిస్థితి మరీ విషమంగా ఉంది. రాయి, కత్తి దెబ్బలకు ముఖం మొత్తం చిధ్రమైంది.
Also Read
- Hockey World Cup 2026: భారత్కు షాక్.. చివరి 15 నిమిషాల్లో కథ మారింది.. నెదర్లాండ్స్ చేతిలో ఓటమి
- IMD Weather Alert: రేపు దేశవ్యాప్తంగా దంచికొట్టనున్న వానలు.. ఈ రాష్ట్రాలకు ఐఎండీ అలర్ట్
- Off The Record: జగన్కు బీఆర్ఎస్ నేతలు ఘన స్వాగతం.. కారణం ఇదేనా...!
- Pawan Kalyan Ayurvedic Treatment: కుడి భుజానికి ప్రత్యేక ఆయుర్వేద థెరపీ.. కేరళం చేరుకున్న పవన్ కల్యాణ్..
Read Also:Surya Stotram: ఆదివారం సూర్య స్తోత్ర పారాయణం చేస్తే మీ జన్మధన్యం అవుతుంది
దుకాణం పైకప్పుపై మృతదేహం
లాంఛనాలు పూర్తి చేసిన పోలీసులు యువకుడి మృతదేహాన్ని తమ కస్టడీలోకి తీసుకుని పోస్టుమార్టం నిమిత్తం సబ్జీ మండి మార్చురీకి తరలించి, మృతుడిని గుర్తించేందుకు కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. పోలీసులు సమీపంలోని ప్రదేశాలను స్కానింగ్ చేస్తున్నారు. సమీపంలో అమర్చిన సీసీ కెమెరాలను కూడా తనిఖీ చేస్తున్నారు. ఓల్డ్ లజ్పత్ రాయ్ మార్కెట్, చాందినీ చౌక్లోని ఓ దుకాణం టెర్రస్పై మధ్యాహ్నం 12:15 గంటల ప్రాంతంలో యువకుడి మృతదేహం పడి ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందిందని ఉత్తర జిల్లా డీసీపీ మనోజ్ కుమార్ మీనా తెలిపారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసు ఉన్నతాధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.
మృతదేహం దగ్గర రక్తపు మరకలున్న రాయి
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. యువకుడి ముఖం, తలపై రాయితో కొట్టి దారుణంగా హత్య చేశారు. మృతదేహం దగ్గర రక్తంతో కూడిన రాయి కూడా కనిపించింది. మృతుడి ఆచూకీ కోసం చాలా ప్రయత్నాలు జరుగుతున్నా ప్రస్తుతం ఆచూకీ తెలియలేదు. యువకుడు దుకాణంలో పని చేస్తున్నాడని పోలీసులు అనుమానిస్తున్నారని, అందువల్ల యువకుడిని గుర్తించడంలో సహకరించాలని మార్కెట్లోని దుకాణదారులను కోరారు. సమీపంలోని సీసీటీవీ కెమెరాల ఫుటేజీ ఆధారంగా పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Read Also:Durga Stotram: ఆదివారం ఈ స్తోత్రం వింటే అభీష్టాలు నెరవేరుతాయి
తాజావార్తలు
-
Hockey World Cup 2026: భారత్కు షాక్.. చివరి 15 నిమిషాల్లో కథ మారింది.. నెదర్లాండ్స్ చేతిలో ఓటమి
-
Huma Qureshi: ‘టాక్సిక్’ తర్వాత టాలీవుడ్లోకి హ్యూమా.. దిల్ రాజు ముందే మాట ఇచ్చేసిందా?
-
Rukmini Vasanth: యశ్తో పనిచేయడం బకెట్ లిస్ట్ మూమెంట్.. ‘టాక్సిక్’ హీరోయిన్ కామెంట్స్ వైరల్!
-
IMD Weather Alert: రేపు దేశవ్యాప్తంగా దంచికొట్టనున్న వానలు.. ఈ రాష్ట్రాలకు ఐఎండీ అలర్ట్
-
Off The Record: జగన్కు బీఆర్ఎస్ నేతలు ఘన స్వాగతం.. కారణం ఇదేనా…!
ట్రెండింగ్
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!
-
64MP కెమెరా, 5,700mAh బ్యాటరీతో వచ్చేసిన Philips S7221 5G ఫోన్.. ధర ఎంతంటే?
-
Crispy Veggie Fingers: బయట క్రిస్పీ.. లోపల సాఫ్ట్.! నోరూరించే ‘క్రిస్పీ వెజ్జీ ఫింగర్స్’ సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ చేసేయండి ఇలా.!
-
7 సీటర్కు బదులు 6 సీటర్.. క్యాప్టెన్ సీట్లతో Mahindra XEV 9S కొత్త వేరియంట్..!