Delhi : రాజధానిలో దారుణ హత్య.. దుకాణం పైకప్పుపై మృతదేహం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Delhi : ఢిల్లీలో నేరాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఉత్తర ఢిల్లీలోని కొత్వాలి ప్రాంతంలో ఓ యువకుడిని రాయి, కత్తితో పొడిచి హత్య చేసిన ఘటన సంచలనం సృష్టించింది. శనివారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో దుకాణం పైకప్పుపై యువకుడి మృతదేహాన్ని చూసిన కార్మికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. మృతదేహంపై సమాచారం అందుకున్న క్రైం, ఎఫ్ఎస్ఎల్ టీమ్తో పాటు స్థానిక పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు.
ఈ ఘటనతో ఆ ప్రాంతంలో భయాందోళన నెలకొంది. పోలీసులు విచారణలో మృతదేహం దగ్గర మద్యం సీసా, రెండు గ్లాసులు లభ్యమయ్యాయి. మద్యం సేవిస్తూ వచ్చిన వివాదంలో యువకుడు హత్యకు గురైనట్లు అనుమానిస్తున్నారు. మృతి చెందిన యువకుడి ఆచూకీ ఇంకా తెలియరాలేదు. మృతదేహం పరిస్థితి మరీ విషమంగా ఉంది. రాయి, కత్తి దెబ్బలకు ముఖం మొత్తం చిధ్రమైంది.
Also Read
- Abhishek Sharma: కాటేరమ్మ కొడుకా మజాకా.. బంతి వేయడమే ఆలస్యం కొట్టుడే కొట్టుడు.. చరిత్ర స్పష్టించిన అభిషేక్..
- Bangladesh: ‘‘ప్రతీసారి భారత్ గురించి ఆలోచించం, హసీనా మాదిరి ఉండదు’’.. బంగ్లాదేశ్ పొగరు మాటలు..
- IND Vs SL: మహిళల ఆసియా కప్ ఫైనల్.. శ్రీలంక బౌలర్లపై విరుచుకుపడిన షఫాలీ వర్మ, స్మృతి మంధాన..
- IAF Report: ఆపరేషన్ సిందూర్పై IAF సంచలన రిపోర్ట్.. పాక్ F-16లు, రాడార్లు ధ్వంసం..
Read Also:Surya Stotram: ఆదివారం సూర్య స్తోత్ర పారాయణం చేస్తే మీ జన్మధన్యం అవుతుంది
దుకాణం పైకప్పుపై మృతదేహం
లాంఛనాలు పూర్తి చేసిన పోలీసులు యువకుడి మృతదేహాన్ని తమ కస్టడీలోకి తీసుకుని పోస్టుమార్టం నిమిత్తం సబ్జీ మండి మార్చురీకి తరలించి, మృతుడిని గుర్తించేందుకు కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. పోలీసులు సమీపంలోని ప్రదేశాలను స్కానింగ్ చేస్తున్నారు. సమీపంలో అమర్చిన సీసీ కెమెరాలను కూడా తనిఖీ చేస్తున్నారు. ఓల్డ్ లజ్పత్ రాయ్ మార్కెట్, చాందినీ చౌక్లోని ఓ దుకాణం టెర్రస్పై మధ్యాహ్నం 12:15 గంటల ప్రాంతంలో యువకుడి మృతదేహం పడి ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందిందని ఉత్తర జిల్లా డీసీపీ మనోజ్ కుమార్ మీనా తెలిపారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసు ఉన్నతాధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.
మృతదేహం దగ్గర రక్తపు మరకలున్న రాయి
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. యువకుడి ముఖం, తలపై రాయితో కొట్టి దారుణంగా హత్య చేశారు. మృతదేహం దగ్గర రక్తంతో కూడిన రాయి కూడా కనిపించింది. మృతుడి ఆచూకీ కోసం చాలా ప్రయత్నాలు జరుగుతున్నా ప్రస్తుతం ఆచూకీ తెలియలేదు. యువకుడు దుకాణంలో పని చేస్తున్నాడని పోలీసులు అనుమానిస్తున్నారని, అందువల్ల యువకుడిని గుర్తించడంలో సహకరించాలని మార్కెట్లోని దుకాణదారులను కోరారు. సమీపంలోని సీసీటీవీ కెమెరాల ఫుటేజీ ఆధారంగా పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Read Also:Durga Stotram: ఆదివారం ఈ స్తోత్రం వింటే అభీష్టాలు నెరవేరుతాయి
తాజావార్తలు
-
Abhishek Sharma: కాటేరమ్మ కొడుకా మజాకా.. బంతి వేయడమే ఆలస్యం కొట్టుడే కొట్టుడు.. చరిత్ర స్పష్టించిన అభిషేక్..
-
Bangladesh: ‘‘ప్రతీసారి భారత్ గురించి ఆలోచించం, హసీనా మాదిరి ఉండదు’’.. బంగ్లాదేశ్ పొగరు మాటలు..
-
IND Vs SL: మహిళల ఆసియా కప్ ఫైనల్.. శ్రీలంక బౌలర్లపై విరుచుకుపడిన షఫాలీ వర్మ, స్మృతి మంధాన..
-
IAF Report: ఆపరేషన్ సిందూర్పై IAF సంచలన రిపోర్ట్.. పాక్ F-16లు, రాడార్లు ధ్వంసం..
-
Prithviraj Sukumaran: ‘వారణాసి’ చేస్తూనే 9 సినిమాలు.. మాలీవుడ్ స్టార్ స్పీడ్ చూసి జక్కన్న షాక్!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Tears: వైభవ్ సూర్యవంశీ కంటతడి.. వీడియో, ఫొటోస్ వైరల్!
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!
-
Head Coach: హెడ్ కోచ్గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్గా యువరాజ్ సింగ్!
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!