NTV Telugu Site icon

PKL 11: యుముంబాపై దబాంగ్ ఢిల్లీ గెలుపు..

Dabang Delhi

Dabang Delhi

ప్రో కబడ్డీ సీజన్ 11లో భాగంగా.. ఈరోజు రెండో మ్యాచ్ జరిగింది. హైదరాబాద్ లోని గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో యుముంబా, దబాంగ్ ఢిల్లీ తలపడ్డాయి. ఈ పోరులో దబాంగ్ ఢిల్లీ విజయం సాధించింది. 36-28 పాయింట్ల తేడాతో గెలుపొందింది. దీంతో.. సీజన్ రెండో మ్యాచ్‌లో దబాంగ్ ఢిల్లీ విజయం సాధించింది.

Read Also: US: అవయవ దాత గుండె తీస్తుండగా ఊహించని ఘటన

యుముంబా జట్టులోఅత్యధికంగా అమీర్ మహ్మద్ జఫర్దానేష్ 11 పాయింట్లతో చెలరేగాడు. అతనికి తోడు అజిత్ చావన్ 10 పాయింట్లు సాధించాడు. ఢిల్లీ జట్టులో అశు మాలిక్ అత్యధికంగా 10 పాయింట్లు సాధించాడు. ఆశిశ్ 4 పాయింట్స్, ఆశిశ్ మాలిక్ 3 పాయింట్లు సాధించాడు. దబాంగ్ ఢిల్లీ జట్లులో టాకిల్ పాయింట్లు ఎక్కువగా ఉండటంతో విజయం సాధించింది. అలాగే.. ఎక్స్ ట్రా పాయింట్లు కూడా తోడవ్వడంతో ఢిల్లీ గెలుపొందింది. కాగా.. రేపు రాత్రి 8 గంటలకు తమిళ్ తలైవాస్‌తో టైటాన్స్ రెండో మ్యాచ్ ఆడనుంది.

Read Also: PKL 11: మొదటి మ్యాచ్‌లో తెలుగు టైటాన్స్ బోణీ.. బెంగళూరు బుల్స్‌పై గెలుపు