Kishan Reddy: బీఆర్ఎస్, కాంగ్రెస్ వల్ల తెలంగాణ ఆర్థిక పరిస్థితి దివాలా తీసింది..
- కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేయడం లేదు
- రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి నిరుద్యోగులకు హామీ ఇచ్చారు
- ఇప్పటి వరకూ జాబ్ క్యాలెండర్ గురించి పట్టించుకోవడం లేదు
- కేంద్ర మంత్రి కిషన్రెడ్డి వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కాంగ్రెస్ ఇచ్చిన అన్ని హామీలు మోసమేనా అన్న అనుమానాలు కలుగుతున్నాయని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి అన్నారు. మెదక్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. “అశోక్ నగర్ లో రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి నిరుద్యోగులకు హామీ ఇచ్చారు. 14 నెలలు అయినా వారి గురించి కానీ జాబ్ క్యాలెండర్ గురించి పట్టించుకోవడం లేదు. తెలంగాణ ఆర్థిక పరిస్థితి దివాలా తీసింది. ఉద్యోగులకు జీతాలు, రిటైర్మెంట్ బెనిఫిట్స్, DA లు ఇవ్వలేని పరిస్థితి ఉంది. మిగులు బడ్జెట్ గా ఉన్న రాష్ట్రాన్ని బీఆర్ఎస్ అప్పుల కుప్పగా మార్చింది. మారింది కాంగ్రెస్ పార్టీ, ముఖ్యమంత్రి కానీ తెలంగాణ పరిస్థితి మారలేదు. బంగారు తెలంగాణ అంటూ కేసీఆర్ ఆయన కుటుంబాన్ని బంగారు కుటుంబంగా మార్చుకున్నారు. నేడు రేవంత్ కూడా కేసీఆర్ లానే వ్యవహరిస్తున్నారు.” అని కేంద్ర మంత్రి విమర్శించారు.
READ MORE: Toilet Usage Management Rule: ఉద్యోగులు టాయిలెట్స్ వినియోగంపై వింత రూల్స్!
Also Read
- Story Board: మహా సంక్షోభం ఎవరి చేతుల్లో లేదా? ప్రజలు జాగ్రత్తలు పాటించాల్సిందేనా?
- Tawa Paneer Tikka Recipe: ఇంట్లోనే ఈజీగా రెస్టారెంట్ స్టైల్ 'తవా పనీర్ టిక్కా'.. సీక్రెట్ రెసిపీ మీకోసం!
- CM Revanth Reddy: పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై రేవంత్ ఫైర్.. కేంద్రంపై తీవ్ర విమర్శలు
- Telangana Temples Revenue: ఆధ్యాత్మికతతో పాటు ఆర్థిక రికార్డులు.. 2025-26లో రూ.556 కోట్ల ఆదాయం
“అభివృద్ధి పనులు అన్ని కుంటుపడ్డాయి. సీఎం మాటలు కోటలు దాటుతున్నాయి.. ప్రకటనలు ముందు పేజీలో ఉన్నాయి పనులు మాత్రం లేవు. కాంగ్రెస్ మంత్రుల మధ్య సమన్వయం లేదు. శాసనమండలి ఎన్నికల్లో బీజేపీ గెలుపు ఖాయం. కాంగ్రెస్ పాలిత రాష్టాల్లో అవినీతి బాగా పెరిగింది. హిమాచల్ ప్రదేశ్ లో కరెంట్ బిల్లులు కట్టలేక, ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఉంది. కర్ణాటకలో ఐదు గ్యారెంటీలు అమలు కావడం లేదు. బీజేపీపాలిత రాష్టాల్లో డబుల్ ఇంజన్ సర్కార్ సమర్థవంతంగా పని చేస్తూంది. తెలంగాణలోనూ డబుల్ ఇంజన్ సర్కార్ రావాలని ప్రజలు కోరుకుంటున్నారు. రాబోయే రోజుల్లో తెలంగాణలో ప్రజా పోరాటాలకు సిద్ధమవుతాం.” అని కిషన్రెడ్డి వెల్లడించారు.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో అన్ని స్థానాల్లో పోటీ చేస్తున్న ఏకైక పార్టీ బీజేపీ అని కిషన్రెడ్డి అన్నారు.. “బీఆర్ఎస్ పార్టీ ఈ ఎన్నికల్లో చేతులెత్తేసింది. ఈ ఎన్నికలు తెలంగాణకి దశ దిశ నిర్దేశిస్తాయి. కేసీఆర్ పాలనలో తెలంగాణ అప్పుల రాష్ట్రం అయ్యింది.. అహంకారం పెరిగిందని కాంగ్రెస్ నేతలు చెప్పి అధికారంలో వచ్చారు. ఆరు గ్యారెంటీలు, జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ 14 నెలలు కావస్తున్నా ఏ పనులు చేయట్లేదు. కాంగ్రెస్ పార్టీపై ప్రజల్లో వ్యతిరేకత మొదలైంది. ఇచ్చిన ఏ హామీ కూడా కాంగ్రెస్ నెరవేర్చలేదు. ఉద్యోగాలు ఇస్తామని యువతకు నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి మాట తప్పింది.” అని కేంద్ర మంత్రి వ్యాఖ్యానించారు.
తాజావార్తలు
-
Story Board: మహా సంక్షోభం ఎవరి చేతుల్లో లేదా? ప్రజలు జాగ్రత్తలు పాటించాల్సిందేనా?
-
Tollywood: పర్సంటేజ్ సిస్టమ్ నుండి మినహాయింపు కోరిన 17 సినిమాల జాబితా..
-
Tawa Paneer Tikka Recipe: ఇంట్లోనే ఈజీగా రెస్టారెంట్ స్టైల్ ‘తవా పనీర్ టిక్కా’.. సీక్రెట్ రెసిపీ మీకోసం!
-
CM Revanth Reddy: పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై రేవంత్ ఫైర్.. కేంద్రంపై తీవ్ర విమర్శలు
-
Telangana Temples Revenue: ఆధ్యాత్మికతతో పాటు ఆర్థిక రికార్డులు.. 2025-26లో రూ.556 కోట్ల ఆదాయం
ట్రెండింగ్
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..