Nirav Modi Extradition: నీరవ్ మోడీకి భారీ షాక్.. భారత్కు అప్పగింతకు గ్రీన్ సిగ్నల్
- నీరవ్ మోడీకి భారీ షాక్
- రూ. 13,000 కోట్ల పంజాబ్ నేషనల్ బ్యాంక్ కుంభకోణంలో నీరవ్ మోడీ ప్రధాన నిందితుడు
- అతను 2019 మార్చి 19 నుంచి లండన్ జైలులో ఉన్నాడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నీరవ్ మోడీ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. యునైటెడ్ కింగ్డమ్లోని హైకోర్ట్ ఆఫ్ జస్టీస్ తాజాగా నీరవ్ మోడీకి పెద్ద షాక్ ఇచ్చింది. పరారీలో ఉన్న వ్యాపారవేత్త నీరవ్ మోడీని బ్రిటన్ నుంచి భారత్కు అప్పగించేందుకు మార్గం దాదాపు సుగమమైంది. భారత్కు అప్పగించడాన్ని వ్యతిరేకిస్తూ తన కేసును తిరిగి తెరవాలని కోరుతూ పరారీలో ఉన్న వజ్రాల వ్యాపారి నీరవ్ మోడీ దాఖలు చేసిన పిటిషన్ను లండన్ హైకోర్టు కొట్టివేసింది. రూ. 13,000 కోట్ల పంజాబ్ నేషనల్ బ్యాంక్ కుంభకోణంలో నీరవ్ మోడీ ప్రధాన నిందితుడు. అతను 2019 మార్చి 19 నుంచి లండన్ జైలులో ఉన్నాడు. మోడీ హైకోర్టు, కింగ్స్ బెంచ్ డివిజన్లో ఒక పిటిషన్ను దాఖలు చేశారు.
Also Read:AP Petrol Shortage: ఏపీలో పెట్రోల్ కొరత.. సమస్యపై నేడు వీడియో కాన్ఫరెన్స్
Also Read
- EPFO New Portal: PF డబ్బులు ఎక్కడున్నాయో ఇక ఈజీగా తెలుసుకోండి.. EPFO కీలక మార్పులు
- AP Government: వారసత్వ భూములపై గుడ్న్యూస్.. ఏపీ సర్కార్ కీలక నిర్ణయం..
- Melania Trump: మెలానియా ట్రంప్కు హత్యా బెదిరింపులు.. ఇరాన్ వీడియో కలకలం
- Off The Record: మంత్రులకు ఎమ్మెల్యేల షాక్? చిత్తూరు, అన్నమయ్య జిల్లాల్లో ఆధిపత్య పోరు
క్రౌన్ ప్రాసిక్యూషన్ సర్వీస్ తరఫు న్యాయవాది, సీబీఐ బృందం సహాయంతో, అతని అప్పీలుకు వ్యతిరేకంగా బలమైన వాదనలు వినిపించారు. విచారణ నిమిత్తం సీబీఐ దర్యాప్తు అధికారులతో కూడిన ఒక బృందం లండన్కు వెళ్లింది. కేసును తిరిగి తెరవాలన్న పిటిషన్, దానికి సంబంధించిన పరిస్థితులు పునఃపరిశీలన చేయాల్సినంత అసాధారణమైనవి కావని హైకోర్టు తన తీర్పులో పేర్కొంది.
Also Read:Gold &Silver Rates: బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. 10 గ్రాముల గోల్డ్ ధర ఎంత? నేటి లేటెస్ట్ అప్డేట్
“ఆయుధాల వ్యాపారి సంజయ్ భండారీ కేసులోని తీర్పు ఆధారంగా ఈ సమీక్ష పిటిషన్ను దాఖలు చేసినప్పటికీ, సీబీఐ నిరంతర, సమన్వయ ప్రయత్నాల వల్ల ఈ సవాలును విజయవంతంగా అధిగమించగలిగాం,” అని ఇక్కడ జారీ చేసిన ఒక ప్రకటనలో సీబీఐ ప్రతినిధి తెలిపారు. పీఎన్బీ కుంభకోణంలో నీరవ్ మోడీని అప్పగించాలని సీబీఐ 2018 నుంచి కోరుతోంది. పరారీలో ఉన్న ఆర్థిక నేరస్థుడైన నీరవ్ మోడీ, తన మామ మెహుల్ చోక్సీతో కలిసి పీఎన్బీని వేల కోట్ల రూపాయల మేర మోసం చేసిన కేసులో భారతదేశంలో విచారణను ఎదుర్కొంటున్నారు. మోడీ ఒక్కరే రూ. 6,498.20 కోట్ల మొత్తాన్ని దుర్వినియోగం చేశారని సీబీఐ ప్రతినిధి తెలిపారు.
తాజావార్తలు
-
HYDRAA : హైడ్రా తీరుపై హైకోర్టు మరోసారి ఆగ్రహం
-
EPFO New Portal: PF డబ్బులు ఎక్కడున్నాయో ఇక ఈజీగా తెలుసుకోండి.. EPFO కీలక మార్పులు
-
AP Government: వారసత్వ భూములపై గుడ్న్యూస్.. ఏపీ సర్కార్ కీలక నిర్ణయం..
-
Melania Trump: మెలానియా ట్రంప్కు హత్యా బెదిరింపులు.. ఇరాన్ వీడియో కలకలం
-
Off The Record: మంత్రులకు ఎమ్మెల్యేల షాక్? చిత్తూరు, అన్నమయ్య జిల్లాల్లో ఆధిపత్య పోరు
ట్రెండింగ్
-
Kitchen Hacks : వంటగది స్విచ్బోర్డులపై జిడ్డు, నూనె మరకలా? ఈ చిట్కాలతో 5 నిమిషాల్లో క్లీన్..!
-
Cashew Nuts Price : రూ. 1,000 జీడిపప్పు.. రూ. 300కే ఎక్కడ దొరుకుతుందో తెలుసా.?
-
Home Cleaning Hacks : టీ, కాఫీ కప్పుల మొండి మరకలా.? ఈ టిప్స్తో సులభంగా 5 నిమిషాల్లో క్లీన్ చేయండి.!
-
Clean Fridge Door Rubber: ఫ్రిజ్ డోర్ రబ్బర్కు మరకలా..? ఈ ట్రిక్తో 10 నిమిషాల్లో తలతల మెరిసిపోవాల్సిందే..!
-
రూ.5,499కే 120 అంగుళాల స్క్రీన్.. Zebronics Zeb-PixaPlay 72 Plus స్మార్ట్ ప్రొజెక్టర్ లాంచ్.!