Nirav Modi Extradition: నీరవ్ మోడీకి భారీ షాక్.. భారత్కు అప్పగింతకు గ్రీన్ సిగ్నల్
- నీరవ్ మోడీకి భారీ షాక్
- రూ. 13,000 కోట్ల పంజాబ్ నేషనల్ బ్యాంక్ కుంభకోణంలో నీరవ్ మోడీ ప్రధాన నిందితుడు
- అతను 2019 మార్చి 19 నుంచి లండన్ జైలులో ఉన్నాడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నీరవ్ మోడీ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. యునైటెడ్ కింగ్డమ్లోని హైకోర్ట్ ఆఫ్ జస్టీస్ తాజాగా నీరవ్ మోడీకి పెద్ద షాక్ ఇచ్చింది. పరారీలో ఉన్న వ్యాపారవేత్త నీరవ్ మోడీని బ్రిటన్ నుంచి భారత్కు అప్పగించేందుకు మార్గం దాదాపు సుగమమైంది. భారత్కు అప్పగించడాన్ని వ్యతిరేకిస్తూ తన కేసును తిరిగి తెరవాలని కోరుతూ పరారీలో ఉన్న వజ్రాల వ్యాపారి నీరవ్ మోడీ దాఖలు చేసిన పిటిషన్ను లండన్ హైకోర్టు కొట్టివేసింది. రూ. 13,000 కోట్ల పంజాబ్ నేషనల్ బ్యాంక్ కుంభకోణంలో నీరవ్ మోడీ ప్రధాన నిందితుడు. అతను 2019 మార్చి 19 నుంచి లండన్ జైలులో ఉన్నాడు. మోడీ హైకోర్టు, కింగ్స్ బెంచ్ డివిజన్లో ఒక పిటిషన్ను దాఖలు చేశారు.
Also Read:AP Petrol Shortage: ఏపీలో పెట్రోల్ కొరత.. సమస్యపై నేడు వీడియో కాన్ఫరెన్స్
Also Read
క్రౌన్ ప్రాసిక్యూషన్ సర్వీస్ తరఫు న్యాయవాది, సీబీఐ బృందం సహాయంతో, అతని అప్పీలుకు వ్యతిరేకంగా బలమైన వాదనలు వినిపించారు. విచారణ నిమిత్తం సీబీఐ దర్యాప్తు అధికారులతో కూడిన ఒక బృందం లండన్కు వెళ్లింది. కేసును తిరిగి తెరవాలన్న పిటిషన్, దానికి సంబంధించిన పరిస్థితులు పునఃపరిశీలన చేయాల్సినంత అసాధారణమైనవి కావని హైకోర్టు తన తీర్పులో పేర్కొంది.
Also Read:Gold &Silver Rates: బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. 10 గ్రాముల గోల్డ్ ధర ఎంత? నేటి లేటెస్ట్ అప్డేట్
“ఆయుధాల వ్యాపారి సంజయ్ భండారీ కేసులోని తీర్పు ఆధారంగా ఈ సమీక్ష పిటిషన్ను దాఖలు చేసినప్పటికీ, సీబీఐ నిరంతర, సమన్వయ ప్రయత్నాల వల్ల ఈ సవాలును విజయవంతంగా అధిగమించగలిగాం,” అని ఇక్కడ జారీ చేసిన ఒక ప్రకటనలో సీబీఐ ప్రతినిధి తెలిపారు. పీఎన్బీ కుంభకోణంలో నీరవ్ మోడీని అప్పగించాలని సీబీఐ 2018 నుంచి కోరుతోంది. పరారీలో ఉన్న ఆర్థిక నేరస్థుడైన నీరవ్ మోడీ, తన మామ మెహుల్ చోక్సీతో కలిసి పీఎన్బీని వేల కోట్ల రూపాయల మేర మోసం చేసిన కేసులో భారతదేశంలో విచారణను ఎదుర్కొంటున్నారు. మోడీ ఒక్కరే రూ. 6,498.20 కోట్ల మొత్తాన్ని దుర్వినియోగం చేశారని సీబీఐ ప్రతినిధి తెలిపారు.
తాజావార్తలు
-
OTR : గీత దాటిన గులాబీ ఎమ్మెల్సీలపై వేటేనా?
-
TSLPRB: తెలంగాణ కానిస్టేబుల్ అభ్యర్థులకు గుడ్న్యూస్.. వయోపరిమితి మరో 3 ఏళ్లు పెంపు..
-
TGTET: ముగిసిన తెలంగాణ టెట్ పరీక్ష.. 89.96 శాతం మంది హాజరు..
-
Bombay High Court: జైల్లో 21 కిలోల బరువు తగ్గిన ఖైదీ.. బెయిల్ మంజూరు
-
Health Tips: మంచం ఎక్కిన వెంటనే నిద్ర పట్టాలా.. సింపుల్గా ఇలా చేయండి!
ట్రెండింగ్
-
Sweet Atukulu Recipe: వినాయక చవితి స్పెషల్.. కరకరలాడే అటుకుల తీపి ప్రసాదం.! సులువుగా చేసుకోండి ఇలా..
-
Moringa Leaf Powder: రోగనిరోధక శక్తిని పెంచి, బెల్లీ ఫ్యాట్ తగ్గించే సూపర్ రెసిపీ.. ‘మునగాకు పొడి’.! ఇంట్లోనే సులువుగా చేసేయండి ఇలా..
-
SSC CHSL 2026: 12వ తరగతి అర్హతతో 2,536 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. రూ.92,300 వరకు జీతం..!
-
ఒక్క ఛార్జ్తో 132 కి.మీ రేంజ్..! Kinetic DX Plus 3.1kWh వేరియంట్ లాంచ్..!
-
Range Rover SVకి మరింత లగ్జరీ టచ్.. కొత్త డ్యూయల్-టోన్ పెయింట్ ఫినిష్ వచ్చేసింది.!