Uddhav Thackeray: పరువు నష్టం కేసులో ఉద్ధవ్ ఠాక్రేకు కోర్టు సమన్లు జారీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Uddhav Thackeray: ప్రత్యర్థి సేన వర్గానికి చెందిన నాయకుడు రాహుల్ షెవాలేపై శివసేన(యూబీటీ) పార్టీ మౌత్పీస్ ‘సామ్నా’ ప్రసారం చేసిన పరువు నష్టం కలిగించే కథనాలపై శివసేన (యూబీటీ) నాయకులు ఉద్ధవ్ ఠాక్రే, సంజయ్ రౌత్లకు ఇక్కడి మేజిస్ట్రేట్ కోర్టు సమన్లు జారీ చేసింది. ముంబై దక్షిణ-మధ్య నియోజక వర్గానికి చెందిన ఎంపీ షెవాలే దాఖలు చేసిన ఫిర్యాదుపై మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ (స్వీరీ కోర్టు) SB కాలే సోమవారం సమన్లు జారీ చేశారు. మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి థాకరే, రాజ్యసభ ఎంపీ సంజయ్ రౌత్లు జూలై 14న కోర్టుకు హాజరుకావాలని న్యాయస్థానం ఆదేశించింది.
Also Read: Weight Loss: బరువు తగ్గాలంటే ఇవి తినండి.. రిజల్ట్ కొద్ది రోజుల్లోనే..!
Also Read
- AIADMK MLAs Support Vijay: అన్నాడీఎంకేలో భారీ చీలిక.. విజయ్ గూటికి 30 మంది ఎమ్మెల్యేలు..
- High Court: భర్తను కత్తితో పొడిచి చంపిన భార్య.. జస్ట్ రూ.500 జరిమానా విధించి నిర్దోశిగా తేల్చిన హైకోర్టు
- Palak Paratha Recipe: హెల్దీగా, టేస్టీగా చేసే సూపర్ సాఫ్ట్ 'పాలక్ పరోటా'.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!
- CM Vijay: సీఎం విజయ్ సంచలన నిర్ణయం.. మందుబాబులకు బిగ్ షాక్!
ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన వర్గానికి చెందిన రాహుల్ షెవాలే, భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 500, 501 కింద ఇద్దరు నేతలపై చర్యలు తీసుకోవాలని కోరారు. ‘సామ్నా’ మరాఠీ, హిందీ ఎడిషన్లలో అతనికి వ్యతిరేకంగా కథనాలు రావడంతో వారిపై పరువునష్టం దావా వేశారు. ఉద్ధవ్ ఠాక్రే సామ్నాకు చీఫ్ ఎడిటర్ కాగా, సంజయ్ రౌత్ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్. న్యాయవాది చిత్రా సాలుంకే ద్వారా దాఖలు చేసిన ఫిర్యాదులో, డిసెంబర్ 29, 2022న ప్రచురించబడిన ‘రాహుల్ షెవాలేకు కరాచీలో హోటల్, రియల్ ఎస్టేట్ వ్యాపారం ఉంది’ అనే శీర్షికతో వచ్చిన కథనాలపై షెవాలే అభ్యంతరం వ్యక్తం చేశారు.
ఫిర్యాదుదారు పేర్కొన్న కథనాలలో చేసిన అన్ని ఆరోపణలను గట్టిగా తిప్పికొట్టారు. ప్రజల ముందు అతని ప్రతిష్టను కించపరిచేలా తప్పుడు ఆరోపణలను మోపడం ద్వారా ఫిర్యాదుదారుడి ప్రతిష్ట, రాజకీయ జీవితాన్ని దెబ్బతీయడానికి ఇది కేవలం బలహీనమైన ప్రయత్నం అని నిర్ద్వంద్వంగా పిటిషనర్ పేర్కొన్నారు. ఈ కథనాలు కల్పిత కథనాలేనని ఫిర్యాదుదారు కోర్టులో తెలిపారు.
తాజావార్తలు
-
AIADMK MLAs Support Vijay: అన్నాడీఎంకేలో భారీ చీలిక.. విజయ్ గూటికి 30 మంది ఎమ్మెల్యేలు..
-
Madhav Tiwari: నేను 4 ఓవర్లు బౌలింగ్ చేశా, ఇప్పటికీ నమ్మలేకపోతున్నా.. డీసీ ప్లేయర్ ఆనందం!
-
High Court: భర్తను కత్తితో పొడిచి చంపిన భార్య.. జస్ట్ రూ.500 జరిమానా విధించి నిర్దోశిగా తేల్చిన హైకోర్టు
-
Cannes 2026: కేన్స్ ఫెస్టివల్లో దేశీ గ్లామర్ షో.. ఖర్చులు చూసి షాక్ అవుతున్న నెటిజన్లు!
-
Palak Paratha Recipe: హెల్దీగా, టేస్టీగా చేసే సూపర్ సాఫ్ట్ ‘పాలక్ పరోటా’.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!
ట్రెండింగ్
-
Samsung: సర్టిఫైడ్ రీ-న్యూడ్ ప్రోగ్రామ్ తో రిఫర్బిష్డ్ గెలాక్సీ S25, గెలాక్సీ A56 మోడళ్లను తీసుకొచ్చిన శాంసంగ్..!
-
204HP పవర్, ADAS ఫీచర్లతో 2026 Skoda Kodiaq భారత్ లో లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా..
-
Ginger Candy: తాటి బెల్లం + అల్లం: గొంతు నొప్పి నుండి జీర్ణ సమస్యలకు.. చెక్ పెట్టే అద్భుత ఔషధం ‘అల్లం మురబ్బా’ ఇంట్లోనే చేసుకోండి ఇలా..
-
8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, యాక్టివ్ కూలింగ్తో గేమింగ్ మాన్స్టర్.. REDMAGIC 11S Pro రాక!
-
PM Modi: ఆడంబరాలు వద్దు.. పొదుపు ముద్దు.! దేశాభివృద్ధి కోసం ప్రధాని 10 కీలక సూచనలు..