Corona: దేశంలో 3000 దాటిన కరోనా కేసులు.. తమిళనాడులో యువకుడు మృతి
- దేశంలో 3000 దాటిన కరోనా కేసులు
- తమిళనాడులో యువకుడు మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశవ్యాప్తంగా కరోనా కేసులు మళ్లీ పెరగడం పెరుగుతున్నాయి. గత వారం రోజుల్లో 2000 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పుడు ఈ సంఖ్య 3000 కు పైగా పెరిగింది. కేరళలో అత్యధికంగా 1,336 కేసులు నమోదయ్యాయి. తరువాత మహారాష్ట్ర, ఢిల్లీ ఉన్నాయి. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం, శనివారం కరోనా కేసుల సంఖ్య 3,000 మార్కును దాటి 3,395 కు పెరిగింది. రెండేళ్ల తర్వాత భారత్ లో యాక్టివ్ కోవిడ్ కేసుల సంఖ్య 3,000 దాటడం బహుశా ఇదే మొదటిసారి కావచ్చు.
Also Read:Vivo T4 Ultra: 100X జూమ్, ఫ్లాగ్షిప్ ఫీచర్లతో భారత్ లో లాంచ్ కి సిద్దమైన వివో T4 అల్ట్రా..!
Also Read
- Story Board : అయోధ్య ఆలయంలో అసలేం జరిగింది..? రాముడి సాక్షిగా నిధులు దారిమళ్లాయా..?
- IPL Player: బిగ్షాక్.. మహిళతో శారీరక సంబంధం.. ఢిల్లీ క్యాపిటల్స్ స్టార్ ప్లేయర్పై పోలీస్ కేసు..
- Modi-Mammoott: మోడీని కలిసిన మమ్ముట్టి ఫ్యామిలీ.. ఫొటోలు వైరల్
- Hardik And Yashasvi: KKR కెప్టెన్గా హార్దిక్ పాండ్యా..? ముంబయ్ ఇండియన్స్లోకి యశస్వి జైస్వాల్..?
శనివారం విడుదల చేసిన గణాంకాల ప్రకారం, గత 24 గంటల్లో దేశంలో నాలుగురు మృతిచెందారు. ఢిల్లీ, కేరళ, కర్ణాటక, ఉత్తరప్రదేశ్లలో ఒక్కొక్కటి చొప్పున. మహారాష్ట్రలో 467, ఢిల్లీ 375, గుజరాత్ 265, కర్ణాటక 234, పశ్చిమ బెంగాల్ 205, తమిళనాడు 185, ఉత్తరప్రదేశ్ 117 కేసులు నమోదయ్యాయి. మే 22 నాటికి దేశంలో 257 యాక్టివ్ కేసులు ఉన్నాయి. మే 26 నాటికి ఈ సంఖ్య 1,010కి పెరిగి శనివారం 3,395కి చేరుకుంది. గత 24 గంటల్లో 685 కొత్త కేసులు నమోదయ్యాయని, నలుగురు మరణించారని డేటా తెలిపింది.
Also Read:IPL 2025: క్రికెట్ లవర్స్ కు పండగే.. కాకినాడలో ప్యాన్ పార్క్ ఏర్పాటు.. ఎంట్రీ ఫ్రీ
కోవిడ్ తో తమిళనాడులో యువకుడు మృతి చెందాడు. సేలం జిల్లాలో మేట్టూరులోని తీవ్ర జ్వరంతో ఆసుపత్రిలో చేరిన యువకుడికి కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న యువకుడు నిన్న రాత్రి మృతి చెందాడు. కోవిడ్ కారణంగా మూత్రపిండాలు ఊపిరితిత్తులు ఇన్ఫెక్షన్లు గురికావడం ఇతర అనారోగ్య సమస్యలు ఉండడంతో మృతి చెందాడు.
ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లాలో మరో కోవిడ్ కేసు నమోదైంది. పల్నాడు జిల్లా సత్తెనపల్లికి చెందిన బాలింతకు జ్వరం రావడంతో పరీక్షలు చేయగా కోవిడ్ గా నిర్ధారించారు వైద్యులు.
తాజావార్తలు
ట్రెండింగ్
-
Toilet Cleaning : టాయిలెట్ క్లీనింగ్ చేస్తున్నారా..? అయితే ఈ 5 ఘోరమైన పొరపాట్లు అస్సలు చేయకండి.!
-
Cockroach Control : ఫ్రిజ్లో బొద్దింకల బెడదా.? ఈ సింపుల్ ట్రిక్తో చెక్ పెట్టండి..!
-
Ragi Biscuits : హెల్తీ రాగి బిస్కెట్లు ఎయిర్ ఫ్రైయర్లో 10 నిమిషాల్లో ఇలా చేసుకోండి.!
-
Kitchen Tips : నల్లబడిన వెండి ఆభరణాలు, వస్తువులు కొత్త వాటిలా మెరవాలా..? ఈ కిచెన్ ట్రిక్ సూపర్!
-
మళ్లీ అందుబాటులోకి Telegram.. కానీ వారికీ మాత్రం.!