Site icon NTV Telugu

భారీగా తగ్గిన యాక్టివ్ కేసులు.. 106 రోజుల్లో తొలిసారి..

దేశంలో కరోనా యాక్టివ్ కేసులు భారీగా తగ్గాయి. కరోనా విజృంభణ మొదలైనప్పటి నుంచి కోవిడ్ కేసులు భారీగా పెరిగాయి. లక్షల మంది ప్రజలు దీనిని బలయ్యారు. అయితే రికవరీ రేటు పెరుగుతుండడంతో యాక్టివ్ కేసుల సంఖ్య రోజురోజుకూ తగ్గుతూ వచ్చింది. ప్రస్తుతం 5 లక్షలకంటే తక్కువగా కరోనా యాక్టివ్ కేసులున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. గత 106 రోజుల్లో ఇదే అత్యల్పమని తెలిపింది. తాజాగా నమోదైన 44,281 కొత్త కేసులతో కలుపుకొని దేశ వ్యాప్తంగా ఇప్పటివరకు 8 లక్షల 36 వేల 11 మంది కరోనా బారిన పడగా.. వారిలో 80, 13, 7వందల 83 మంది కోలుకున్నారని, లక్షా 27వేల 5వందల 71మంది మరణించారని ప్రభుత్వం తెలిపింది. కాగా 4లక్షల, 94 వేల 6 వందల 57 మంది ఇంకా కరోనా చికిత్స పొందుతున్నారని వెల్లడించింది.

Exit mobile version