దేశంలో కరోనా యాక్టివ్ కేసులు భారీగా తగ్గాయి. కరోనా విజృంభణ మొదలైనప్పటి నుంచి కోవిడ్ కేసులు భారీగా పెరిగాయి. లక్షల మంది ప్రజలు దీనిని బలయ్యారు. అయితే రికవరీ రేటు పెరుగుతుండడంతో యాక్టివ్ కేసుల సంఖ్య రోజురోజుకూ తగ్గుతూ వచ్చింది. ప్రస్తుతం 5 లక్షలకంటే తక్కువగా కరోనా యాక్టివ్ కేసులున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. గత 106 రోజుల్లో ఇదే అత్యల్పమని తెలిపింది. తాజాగా నమోదైన 44,281 కొత్త కేసులతో కలుపుకొని దేశ వ్యాప్తంగా ఇప్పటివరకు 8 లక్షల 36 వేల 11 మంది కరోనా బారిన పడగా.. వారిలో 80, 13, 7వందల 83 మంది కోలుకున్నారని, లక్షా 27వేల 5వందల 71మంది మరణించారని ప్రభుత్వం తెలిపింది. కాగా 4లక్షల, 94 వేల 6 వందల 57 మంది ఇంకా కరోనా చికిత్స పొందుతున్నారని వెల్లడించింది.