రేప్ కేస్పై గోవా సీఎం ప్రమోద్ సావంత్ వివాదాస్పద వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రేప్ కేసు విషయంలో గోవా సీఎం ప్రమోద్ సావంత్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అర్థరాత్రి ఆడపిల్లలకు బీచ్లో ఏం పని అంటూ అసెంబ్లీలోనే ప్రశ్నించారు. అర్థరాత్రి పిల్లలు బయటకు వెళ్లారంటే.. తల్లిదండ్రులకు బాధ్యత లేదా అని నిలదీశారు. బాధ్యతారాహిత్యం అంటూ ప్రభుత్వం, పోలీసులను తప్పుబట్టడం సరికాదంటూ సీఎం ప్రమోద్ సావంత్ తీవ్రంగా స్పందించారు. ఆర్థరాత్రి వేళ పిల్లలు బయటకు వెళ్లడంపై తల్లిదండ్రులు ఆత్మపరిశీలన చేసుకోవాలన్నారు గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్. ఇటీవల గోవాలో ఇద్దరు మైనర్ బాలికలపై అత్యాచారం జరిగింది.
read also : సెప్టెంబర్ 12న ‘మా’ ఎన్నికలు.. !
Also Read
దీనిపై గోవా అసెంబ్లీలో చర్చ జరిగింది. ఈ సందర్బంగా మాట్లాడిన సీఎం సావంత్.. బీచ్ పార్టీకి వెళ్లిన వారిలో రేప్ జరిగిన బాలికలు తప్ప.. మిగతా వారు తిరిగివచ్చారని చెప్పారు. పిల్లలు తల్లిదండ్రుల మాట వినకపోతే.. ఆ బాధ్యతను పోలీసులపై వదిలేయలేమన్నారాయన. మరోవైపు గోవా ముఖ్యమంత్రి వ్యాఖ్యలపై ప్రతిపక్షాలు తీవ్రంగా మండిపడుతున్నాయి. ఆయన వ్యాఖ్యలు అడపిల్లలను అవమానించేలా ఉన్నాయని.. సీఎం వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నాయి. బాధ్యతాయుతమైన పదవిలో ఉండి ఇలానేనా మాట్లాడేది అంటూ ప్రశ్నిస్తున్నారు.
తాజావార్తలు
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..