Congress: ఉత్తరాఖండ్లో స్టార్ క్యాంపెయినర్లు వీరే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వచ్చే లోక్సభ ఎన్నికల కోసం కాంగ్రెస్ సన్నద్ధమవుతోంది. ఇప్పటికే ఆయా రాష్ట్రాల్లో అభ్యర్థులను ప్రకటించింది. అభ్యర్థులు కూడా ప్రచారంలో దూసుకుపోతున్నారు. తాజాగా రానున్న లోక్సభ ఎన్నికల కోసం ఉత్తరాఖండ్లో 40 మంది స్టార్ క్యాంపెయినర్ల జాబితాను కాంగ్రెస్ విడుదల చేసింది. ప్రచారంలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ సహా నేతలు పాల్గొననున్నారు. ఈ మేరకు స్టార్ క్యాంపెయినర్ల లిస్టును విడుదల చేసింది. ఇక శుక్రవారం కాంగ్రెస్ బిగ్ మేనిఫెస్టోను విడుదల చేసింది.
Also Read
- Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
- Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
- OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
- UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..

సార్వత్రిక ఎన్నికల మేనిఫెస్టోను కాంగ్రెస్ పార్టీ విడుదల చేసింది. ‘న్యాయ్ పత్ర’ పేరుతో మేనిఫెస్టోను శుక్రవారం ఉదయం ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గే రిలీజ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, అగ్రనేత రాహుల్ గాంధీ, పీ చిదంబరం, కేసీ వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు. శనివారం జైపూర్, హైదరాబాద్లలో జరిగే బహిరంగ సభల్లో కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోను ప్రజల ముందు ప్రకటించనుంది.
48 పేజీల మేనిఫెస్టోలో 5 న్యాయ పథకాలు, 25 గ్యారంటీలను కాంగ్రెస్ పార్టీ పొందుపరిచింది. సామాజిక న్యాయం, రైతు న్యాయం , కార్మిక న్యాయం, యువ న్యాయం, మహిళా న్యాయం పేరుతో ప్రజలకు హస్తం పార్టీ హామీ ఇచ్చింది. ముఖ్యంగా నిరుద్యోగంపై ప్రత్యేక దృష్టి పెట్టింది. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే.. దేశవ్యాప్తంగా కుల గణనను నిర్వహించనున్నట్లు తెలిపింది. పేద కుటుంబాల మహిళలకు సంవత్సరానికి రూ. 1 లక్ష, రైతులకు కనీస మద్దతు ధర, పెట్రోల్-డీజిల్ ధరల తగ్గింపు లాంటి కీలక హామీలు మేనిఫెస్టోలో ఉన్నాయి.
కాంగ్రెస్ మేనిఫెస్టోలోని కీలక హామీలు:
# కేంద్ర ప్రభుత్వంలోని వివిధ స్థాయిల్లో 30 లక్షల ఉద్యోగాల భర్తీ
# 25 లక్షల వరకు నగదు రహిత బీమా
# ఎంఎస్పీకి చట్టపరమైన హోదా
# మైనార్టీలకు వస్త్రధారణ, ఆహారం, భాష, పర్సనల్ లాను ఎంచుకొనే హక్కు
# దేశవ్యాప్తంగా కులగణన
# రిజర్వేషన్లపై 50 శాతం పరిమితిని పెంచడానికి రాజ్యాంగ సవరణ
# 21 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న ప్రతిభావంతులైన క్రీడాకారులకు నెలకు 10,000
# కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు
# పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపు
# దేశవ్యాప్తంగా 8 కోట్ల కాంగ్రెస్ గ్యారెంటీ కార్డుల పంపిణీ
# రైల్వే ఛార్జీల తగ్గింపు, వృద్ధులకు టికెట్లలో రాయితీ
# రైల్వేల ప్రైవేటీకరణ నిలిపివేత
# వ్యవసాయ పరికరాలకు జీఎస్టీ మినహాయింపు
# బస్సు ప్రయాణంలో మహిళలకు రాయితీ
# అగ్నివీర్ స్కీమ్ రద్దు
# విద్యార్థులకు లక్ష రూపాయల ఆర్థిక సాయం
# విద్యా రుణాల వడ్డీ రేటు తగ్గింపు
# పేద మహిళలకు ఏడాదికి రూ.లక్ష ఆర్థిక సాయం (మహాలక్ష్మి పథకం)
# ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా యాక్ట్
# వచ్చే పదేళ్లలో జీడీపీని రెట్టింపు చేయాలనే లక్ష్యం
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!