తమిళనాడు కాంగ్రెస్లో అంతర్గత పోరు కొనసాగుతుంది. దీంతో కాంగ్రెస్ మాజీ హోంమంత్రి, పి.చిదంబరం కుమారుడికి వ్యతిరేకంగా కాంగ్రెస్ నేతలే స్వయంగా ఉద్యమిస్తున్నారు. కార్తీ చిదంబరానికి లోక్ సభ టికెట్ ఇవ్వకూడదని శివగంగై కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఈ స్థానం నుంచి లోక్సభ ఎంపీగా కొనసాగుతున్నారు. కాగా, కార్తీ చిదంబరం తండ్రి కూడా శివగంగై నుంచి 7 సార్లు ఎంపీగా పోటీ చేశారు.
Read Also: World Defence Expo : రియాద్ వరల్డ్ డిఫెన్స్ ఎక్స్పో.. పాల్గొన్న 75 దేశాలు
అయితే, కార్తీ చిదంబరంకు టికెట్ ఇవ్వకూడదని శనివారం నాడు శివగంగైకు చెందిన కొందరు కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు. తమిళనాడులో కాంగ్రెస్, డీఎంకే( అధికార ద్రవిడ మున్నేట్ర కజగం ) మధ్య సీట్ల పంపకాలపై చర్చలు జరుగుతున్న తరుణంలో ఈ రాజకీయ పరిణామం చోటు చేసుకోవడం విశేషం. అయితే, ఈ అసంతృప్త నాయకుల సమావేశానికి కేంద్ర మాజీ మంత్రి ఈఎం సుదర్శన్ నాచియప్పన్ తో పాటు పి చిదంబరం మద్దతుదారులు కూడా పాల్గొన్నారు. ఈ భేటీలో కార్తీ చిదంబరానికి శివగంగై లోక్ సభ అభ్యర్థిత్వానికి వ్యతిరేకంగా తీర్మానం చేశారు. అయితే ఇలాంటి విభేదాలు గతంలో కూడా కొనసాగాయి. అలాగే, 2019లో కూడా కార్తీని రంగంలోకి దింపడాన్ని నాచియప్పన్ వ్యతిరేకించారు.
