Congress Manifesto: ఆకట్టుకునేలా కాంగ్రెస్ మేనిఫెస్టో.. 30 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు, కుల గణన, మహిళా రిజర్వేషన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Congress Manifesto: లోక్సభ ఎన్నికల కోసం కాంగ్రెస్ తన మేనిఫెస్టోను సిద్ధం చేసింది. ఇది కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(CWC) ఆమోదించిన తర్వాత త్వరలో విడుదల కానుంది. కాంగ్రెస్ ప్రతిపాదిత మేనిఫెస్టో బ్లూ ప్రింట్లో ఉపాధి, ద్రవ్యోల్బణం నుండి ఉపశమనం.. సామాజిక న్యాయంపై ప్రత్యేక దృష్టి పెట్టారు. చిదంబరం నేతృత్వంలోని కమిటీ ముసాయిదా మేనిఫెస్టోను కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేకు సమర్పించనుంది. ఆ తర్వాత కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో చర్చించి, ఆ తర్వాత పార్టీ మేనిఫెస్టోను విడుదల చేయనున్నారు.
Read Also:NBK 109 Teaser: నందమూరి అభిమానులకు శుభవార్త.. మార్చి 8న బాలకృష్ణ 109 టీజర్!
Also Read
- Shreyas Iyer: ఓటమికి కారణాలు ఇవే.. తప్పులను నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్ అయ్యర్..
- Harmanpreet Kaur: ఆ తప్పే మా కొంపముంచింది.. ప్రతీ సారి ఇలానే జరుగుతోంది.. భావోద్వేగానికి లోనైన కెప్టెన్..
- IND Vs IRE: ప్రపంచ ఛాంపియన్ను మట్టికరిపించిన ఐర్లాండ్.. సిరీస్ కైవసం..
- T20 World Cup: టీమిండియా ఘోర ఓటమి.. వరల్డ్ కప్ నుంచి ఔట్..
యువతను గెలిపించే వ్యూహంలో భాగంగా బుధవారం మధ్యప్రదేశ్లో రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గేలు ప్రకటించబోతున్న కేంద్ర ప్రభుత్వంలో ఖాళీగా ఉన్న 30 లక్షల ప్రభుత్వ పోస్టులను భర్తీ చేస్తామని కాంగ్రెస్ హామీ ఇవ్వబోతోందని సమాచారం. కాంగ్రెస్ మేనిఫెస్టోలో మహిళలకు నెలకు రూ.6,000, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో 33శాతం రిజర్వేషన్లు కూడా ఉన్నాయి. ఓబీసీ ఓటు బ్యాంకును నొక్కేయడానికి, కులాల వారీగా జనాభా గణనను నిర్వహిస్తామని, వెనుకబడిన కులాల రిజర్వేషన్ల పరిమితిని పెంచుతామని హామీ ఇచ్చారు. గత లోక్సభ ఎన్నికల హామీని పునరుద్ఘాటిస్తూ, కనీస ఆదాయ పథకం కింద పేదలకు ఏటా రూ.72 వేలు ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. కాంగ్రెస్ తన మేనిఫెస్టో కోసం రూపొందించిన పత్రంలో, ముస్లింలను ప్రలోభపెట్టడానికి సచార్ కమిటీ సిఫార్సులను కూడా అమలు చేయాలని పేర్కొంది. ఈ సిఫార్సులను ఎన్నికల్లో బీజేపీ పెద్ద చర్చనీయాంశం చేయగలదు.
Read Also:Mouni Roy :కైపెక్కించే చూపులతో మతిపోగొడుతున్న నాగిని బ్యూటీ ..
2024 లోక్సభ ఎన్నికల కోసం కాంగ్రెస్ 16 మంది సభ్యులతో ఒక కమిటీని ఏర్పాటు చేసింది. దీని పని మేనిఫెస్టోను సిద్ధం చేయడం. గతేడాది డిసెంబర్లో ఏర్పాటైన ఈ కమిటీకి మాజీ ఆర్థిక మంత్రి పి.చిదంబరం ఛైర్మన్గా ఉన్నారు. చిదంబరంతో పాటు, టిఎస్ సింగ్ డియో, ప్రియాంక గాంధీ వాద్రా, సిద్ధరామయ్య, జైరామ్ రమేష్, శశి థరూర్, ప్రవీణ్ చక్రవర్తి, ఇమ్రాన్ ప్రతాప్గర్హి, రంజిత్ రంజన్, ఓంకార్ సింగ్ మార్కం, జిగ్నేష్ మేవానీలు ఉన్నారు.
తాజావార్తలు
-
Shreyas Iyer: ఓటమికి కారణాలు ఇవే.. తప్పులను నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్ అయ్యర్..
-
Harmanpreet Kaur: ఆ తప్పే మా కొంపముంచింది.. ప్రతీ సారి ఇలానే జరుగుతోంది.. భావోద్వేగానికి లోనైన కెప్టెన్..
-
CM Chandrababu : ఐదు రోజుల సీఎం టూర్.. వరుసగా భారీ కార్యక్రమాలు
-
IND Vs IRE: ప్రపంచ ఛాంపియన్ను మట్టికరిపించిన ఐర్లాండ్.. సిరీస్ కైవసం..
-
Nimmala Ramanaidu : జగన్వి అన్నీ క్రెడిట్ చోరీ ముచ్చట్లే.. వెలిగొండను పూర్తి చేసేది చంద్రబాబే
ట్రెండింగ్
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!