NTV Telugu Site icon

Delhi: కాంగ్రెస్ అగ్ర నాయకురాలికి అస్వస్థత.. వైద్యుల పర్యవేక్షణలో సోనియా గాంధీ..

Soniagandhi

Soniagandhi

రాజ్యసభ సభ్యురాలు, కాంగ్రెస్‌ అగ్రనాయకురాలు సోనియా గాంధీ అస్వస్థతకు గురయ్యారు. నిన్న ఉదయం ఢిల్లీలోని గంగా రామ్ ఆసుపత్రిలో చేరారు. పొత్తికడుపు సంబంధిత సమస్యతో ఆమె గురువారం ఉదయం ఆసుపత్రిలో చేరినట్లు ఆసుపత్రివర్గాలు తెలిపాయి. ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ప్రస్తుతం వైద్యుల బృందం పర్యవేక్షణలో సోనియా గాంధీ ఉన్నారు. ప్రస్తుతం ఆరోగ్యం బాగానే ఉందని, శుక్రవారం ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయ్యే అవకాశాలు ఉన్నట్లు ఆసుపత్రి బోర్డ్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ ఛైర్మన్‌ అజయ్‌ స్వరూప్‌ తెలిపారు. గతేడాది డిసెంబరు నెలలో సోనియా 78వ పడిలో ప్రవేశించారు.

READ MORE: Jaabilamma Neeku Antha Kopama Review: జాబిలమ్మ నీకు అంత కోపమా రివ్యూ.. మేనల్లుడు హీరోగా ధనుష్ డైరెక్ట్ చేసిన సినిమా ఎలా ఉందంటే ?