Congo : కాంగో సైన్యం, తిరుగుబాటుదారుల మధ్య యుద్ధం.. పోరాటంలో 773 మంది మృతి
Congo : కాంగోలోని గోమా నగరం, పరిసర ప్రాంతాల్లో రువాండా మద్దతున్న తిరుగుబాటుదారులతో జరిగిన ఘర్షణలో కనీసం 773 మంది మరణించారని కాంగో అధికారులు ప్రకటించారు. ఈ ఘటనతో గత దశాబ్దంగా కొనసాగుతున్న ఘర్షణ మరింత తీవ్రమైంది. ప్రస్తుతం కాంగో సైన్యం కొన్ని గ్రామాలను తిరిగి స్వాధీనం చేసుకున్నప్పటికీ ఇప్పటికీ తీవ్ర ఉత్కంఠ కొనసాగుతోంది. కాంగో ప్రభుత్వ అధికార ప్రతినిధి పాట్రిక్ ముయాయా ప్రకారం.. గోమాలోని ఆసుపత్రులు, మృత్యుశాలల్లో 773 మంది మృతదేహాలను గుర్తించగా 2,880 మంది గాయపడ్డారు. మరణాల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని ఆయన వెల్లడించారు.
తిరుగుబాటుదారులు నీరు, విద్యుత్తు వంటి అవసరమైన వసతులను పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చిన తర్వాత శనివారం నాటికి ప్రజలు గోమాలో తిరిగి ప్రవేశిస్తున్నారు. “నేను విసుగు చెందినాను. ఇప్పుడు ఏ మార్గం పట్టాలో తెలియదు ” అని 25 ఏళ్ల జీన్ మార్కస్ బాధను వెల్లబోసుకున్నాడు. కాంగోలో 100కి పైగా ఆయుధ కలిగిన గుంపుల మధ్య M23 అత్యంత యాక్టీవ్ గా ఉంటుంది. రువాండా సైనికులు ఈ గ్రూపును మద్దతిస్తున్నారని ఐక్యరాజ్యసమితి నివేదికలు చెబుతున్నాయి. 2012లో కూడా గోమాపై M23 గ్రూప్ ఆక్రమణ చేయగా, అదే పరిస్థితి మళ్లీ తలెత్తింది.
Also Read
- Mamata Banerjee: 200కు పైగా సీట్లలో గెలుస్తాం, స్టాక్ మార్కెట్ కోసమే ఎగ్జిట్ పోల్స్..
- Abhishek Sharma: హనుమాన్ ఆలయంలో కాటేరమ్మ కొడుకు.. రేపు దబిడిదిబిడే..
- China-Pakistan: పాకిస్తాన్కు చైనా J-35AE ఫైటర్ జెట్.. భారత్కు ముప్పు..
- Cooking Oil Price: సామాన్యుడికి మరో బిగ్ షాక్.. భారీగా పెరిగిన వంట నూనె ధరలు..
Read Also:Komatireddy Venkat Reddy : ఒకే రోజు 118 మంది ఏఈఈ లకు డీఈఈ లుగా ప్రమోషన్
శనివారం M23 తిరుగుబాటుదారులతో భీకరంగా జరిగిన యుద్ధంలో కాంగో సైన్యం సౌత్ కివు ప్రావిన్స్లోని సాంజి, ముగుంజో, ముక్విజా గ్రామాలను తిరిగి ఆక్రమించింది. అయితే, గోమా నగరంపై తిరుగుబాటుదారుల పట్టు ఇంకా మిగిలి ఉంది. గోమాపై తిరుగుబాటుదారుల దాడితో కాంగో సైన్యం తీవ్ర నష్టాన్ని చవిచూసింది. వందలాది మంది సైనికులు మరణించగా, కొందరు తమ ఆయుధాలను వదిలేశారు. ఐక్యరాజ్యసమితి శాంతి బలగాల అధికారి జీన్-పియెర్ లాక్రోయిక్స్ ప్రకారం, M23 తిరుగుబాటుదారులు సౌత్ కివు రాజధాని బుకావూ నగరానికి 60 కిలోమీటర్ల దూరంలో ఉన్నారు.
ఐక్యరాజ్యసమితి, ఇతర సహాయ సంస్థలు తెలిపిన వివరాల ప్రకారం.. గోమాపై తిరుగుబాటు కారణంగా మానవతా సంక్షోభం మరింత తీవ్రమైంది. ఈ నగరం 6 మిలియన్ నిరాశ్రయుల కోసం ప్రధాన సహాయ కేంద్రంగా ఉంది. తిరుగుబాటుదారులు కాంగో రాజధాని కిన్షాసా వరకు నడుస్తామని ప్రకటించడంతో పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారింది. ఐక్యరాజ్యసమితి మానవహక్కుల విభాగం ప్రకారం.. M23 తిరుగుబాటుదారులు 12 మందిని బహిరంగంగా ఉరి తీయడంతో పాటు, పౌరులను బలవంతంగా నియమించుకున్నారు. వారు పాఠశాలలు, ఆసుపత్రులను ఆక్రమించి, ప్రజలను బలవంతంగా శ్రమ చేయిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఐక్యరాజ్యసమితి అధికార ప్రతినిధి జెరెమీ లారెన్స్ ప్రకారం.. కాంగో సైనికులు సౌత్ కివులో 52 మంది మహిళలపై లైంగిక దాడులు చేసినట్లు సమాచారం. ఈ ఆరోపణలపై ఐక్యరాజ్యసమితి దర్యాప్తు చేపడుతోంది.
Read Also:Vasantha Panchami 2025: వసంత పంచమి రోజు ఈ పనులు అస్సలు చేయొద్దు..
కాంగో సంక్షోభం – పరిష్కార మార్గమేమిటి?
కాంగోలో హింస మరింత భీకర రూపం దాల్చే అవకాశం ఉందని విశ్లేషకులు అంటున్నారు. బుకావూ నగరానికి ముప్పు పెరిగితే, లక్షలాది ప్రజలు మరింత ప్రమాదంలో పడే అవకాశం ఉంది. ప్రస్తుతం శాంతి చర్చలు ప్రారంభించేందుకు మద్దతుదారులు మరియు ఇతర అంతర్జాతీయ సంస్థలు ప్రయత్నిస్తున్నాయి.
తాజావార్తలు
-
JD Chakravarthy: “సాయంత్రం 7:30 దాటితే చాలు.. నాకు బయటి ప్రపంచంతో పనే లేదు”.. జేడీ చక్రవర్తి
-
Mamata Banerjee: 200కు పైగా సీట్లలో గెలుస్తాం, స్టాక్ మార్కెట్ కోసమే ఎగ్జిట్ పోల్స్..
-
Abhishek Sharma: హనుమాన్ ఆలయంలో కాటేరమ్మ కొడుకు.. రేపు దబిడిదిబిడే..
-
JD Chakravarthy: “ఆర్జీవీ నా బలం.. కంటెంట్ ఉంటేనే సినిమా కింగ్”.. జేడీ చక్రవర్తి
-
China-Pakistan: పాకిస్తాన్కు చైనా J-35AE ఫైటర్ జెట్.. భారత్కు ముప్పు..
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!