US: పాలస్తీనా నిరసనల ఎఫెక్ట్.. విద్యార్థులపై యూనివర్సిటీలు వేటు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గత కొద్ది రోజులుగా పాలస్తీనా అనుకూల నిరసనలతో అమెరికా యూనివర్సిటీలు అట్టుడుకుతున్నాయి. పెద్ద ఎత్తున క్యాంపస్ల్లో నిరసనలు, ఆందోళనలు చేపట్టడంతో విద్యార్థులపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. ఎక్కడికక్కడే విద్యార్థులను పోలీసులు అరెస్ట్ చేశారు. దాదాపు 900 మందికి పైగా విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు. తాజాగా నిరసనకారులపై ఆయా యూనివర్సిటీలు కొరడా ఝుళిపించాయి. న్యూయార్క్లోని ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయంలోని అధికారులు నిరసన శిబిరాన్ని తొలగించాలని ఆదేశించాయి. లేకుంటే విద్యార్థులపై క్రమశిక్షణా చర్యలను తీసుకోవల్సి ఉంటుందని హెచ్చరించాయి. తాజాగా ఆందోళనల్లో పాల్గొన్న విద్యార్థులను సస్పెండ్ చేశాయి.
ఇది కూడా చదవండి: Shobha Shetty : కొత్త ఇంటి గృహప్రవేశం చేసిన శోభా శెట్టి..
Also Read
- Piyush Goyal: అందరం కలిసి ముందుకెళ్లాల్సిన సమయం వచ్చింది.. పరిశ్రమలకు పీయూష్ గోయల్ హెచ్చరిక
- Story Board : ప్రధాని మోడీ స్పీచ్ దారి తప్పిందా ? ఏదో చెప్పాలని..ఇంకేదో చెప్పారా ?
- NEET Paper Leak: రూ. 10 లక్షలకు కొని, రూ. 15 లక్షలకు అమ్మకం.. నీట్ పేపర్ లీక్ కేసులో నిందితుడి అరెస్ట్..
- KCR : బీఆర్ఎస్ సభ్యత్వ నమోదులో డిజిటల్ విప్లవం.. ఎర్రవెల్లిలో కేసీఆర్ సుదీర్ఘ మంతనాలు.!
గాజాపై ఇజ్రాయెల్ సైన్యం దాడులను వ్యతిరేకిస్తూ అమెరికా విశ్వవిద్యాలయాల్లో విద్యార్థుల నిరసనలు చేపట్టారు. పాలస్తీనాకు సంఘీభావంగా ర్యాలీలు కొనసాగుతున్నాయి. న్యూయార్క్, కాలిఫోర్నియా, మిస్సోరీ, ఇండియానా, మసాచుసెట్స్, వెర్మాంట్, వర్జీనియా తదితర ప్రాంతాల్లో ఆంక్షలను సైతం లెక్కచేయకుండా విద్యార్థులు నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. యూనివర్సిటీ క్యాంపస్ల్లో శిబిరాలు వెలుస్తున్నాయి. గాజాపై దాడులు వెంటనే నిలిపివేయాలని, కాల్పుల విరమణ పాటించాలని, పాలస్తీనియన్లకు మానవతా సాయం అందించాలని నినదిస్తున్నారు. విద్యార్థుల ఆందోళనల నేపథ్యంలో కొన్ని యూనివర్సిటీల్లో పరీక్షలను కూడా వాయిదా వేశాయి.
ఇది కూడా చదవండి: Nothing phone 2a Price: ‘నథింగ్ ఫోన్ 2ఏ’ స్పెషల్ ఎడిషన్ లాంచ్.. భారత కస్టమర్ల కోసమే!
అక్టోబరు 7న ఇజ్రాయెల్పై హమాస్ మిలిటెంట్లు ఊహించని రీతిలో దాడులకు తెగబడింది. దీంతో ప్రతీకారంగా ఇజ్రాయెల్.. గాజాపై దాడులు చేసింది. దీంతో 1,1700 మంది పాలస్తీనీయులు మృతిచెందారు. ఇప్పటికీ గాజాపై ఇజ్రాయెల్ యుద్ధం కొనసాగిస్తోంది. దీంతో పరిస్థితులు ఉద్రిక్తంగానే ఉన్నాయి. మరోవైపు మానవతా సాయం అందక చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు.
ఇది కూడా చదవండి: Loksabha Elections : అమేథీ, రాయ్ బరేలీ అభ్యర్థులపై కొలిక్కి రాని కాంగ్రెస్ నిర్ణయం
తాజావార్తలు
-
SRH vs GT : గుజరాత్ ధాటికి సన్రైజర్స్ కుప్పకూలింది.. 86 పరుగులకే ఆలౌట్.!
-
Off The Record : ఆపరేషన్ ఆకర్ష్ రివర్స్? టీడీపీ నేతలపై వైసీపీ కన్ను.. ఏపీ రాజకీయాల్లో కొత్త మలుపు!
-
Piyush Goyal: అందరం కలిసి ముందుకెళ్లాల్సిన సమయం వచ్చింది.. పరిశ్రమలకు పీయూష్ గోయల్ హెచ్చరిక
-
Anjali Sardana: 23 ఏళ్ల యువతి.. రూ.1700 కోట్ల సామ్రాజ్యం!
-
Story Board : ప్రధాని మోడీ స్పీచ్ దారి తప్పిందా ? ఏదో చెప్పాలని..ఇంకేదో చెప్పారా ?
ట్రెండింగ్
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!
-
Met Gala 2026 : బంగారు కాళ్లతో మెరిసిన మోడల్.. ప్రాణాల మీదకు తెచ్చిన ఆ ఒక్క పొరపాటు.!
-
క్లచ్ లేకుండానే గేర్ మార్పులు.. ఈ-క్లచ్ టెక్నాలజీతో Honda NX500 లాంచ్..
-
స్టైలిష్ లుక్ + పవర్ ఫుల్ బ్యాటరీతో లాంచ్ కు సిద్దమైన Realme 16T 5G.!
-
TVK Floor Test: మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు.. బలపరీక్షకు ముందే టీవీకేకు కోలుకోలేని దెబ్బ!