Colder Winter: దుప్పట్లు రెడీ చేసుకోండమ్మా.. మరో 4-5 రోజుల్లో ఎముకలు కొరికేంత చలి!
- పసిఫిక్ మహాసముద్రంలో లా నినా పరిస్థితులు
- భారతదేశంలోని చాలా ప్రాంతాలలో ఎముకలు కొరికేంత చలి
- ఈ సంవత్సరం సాధారణం కంటే తక్కువ ఉష్ణోగ్రతలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈ సంవత్సరం భారతదేశంలోని చాలా ప్రాంతాలలో చలి ఎక్కువుగా ఉంటుందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఢిల్లీ, ఎన్సీఆర్ సహా ఉత్తర భారతదేశంలోని హిమాలయ ప్రాంతాలలో ఎముకలు కొరికేంత చలి ఉండనుంది. ఇందుకు కారణం ‘లా నినా’. పసిఫిక్ మహాసముద్రంలో లా నినా పరిస్థితులు అభివృద్ధి చెందుతున్నాయని వాతావరణ నిపుణులు అంటున్నారు. లా నినా కారణంగా అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు చలి ఎక్కువుగా కొనసాగే అవకాశం ఉంది. లా నినా పరిస్థితులు ప్రపంచ వాతావరణ నమూనాలను ప్రభావితం చేస్తుంది. సాధారణం కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. రాబోయే కొన్ని నెలల్లో లా నినా పరిస్థితులు ఏర్పడతాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) డైరెక్టర్ జనరల్ ఎం మోహపాత్ర చెప్పారు.
భూమధ్య రేఖ వెంబడి తూర్పు పసిఫిక్ ఉపరితల జలాలు చల్లబడినప్పుడు లా నినా సంభవిస్తాయి. గాలి, పీడనం మరియు వర్షపాత నమూనాలను ప్రభావితం చేస్తుంది. ఎల్ నినా (సముద్రాలు వేడెక్కడం) ఉష్ణమండల ప్రాంతాలలో వ్యతిరేక ప్రభావాన్ని చూపుతుంది. అక్టోబర్-డిసెంబర్లో లా నినా అభివృద్ధి చెందడానికి 71 శాతం అవకాశం ఉందని యుఎస్ నేషనల్ ఓషియానిక్ అండ్ అట్మాస్ఫియరిక్ అడ్మినిస్ట్రేషన్ గత వారం ఒక ప్రకటన విడుదల చేసింది. డిసెంబర్ 2025 నుంచి ఫిబ్రవరి 2026 వరకు 54 శాతం ఉంటుందని అంచనా వేసింది. గత సంవత్సరం డిసెంబర్లో బలహీనమైన లా నినా ఉద్భవించింది కానీ.. అది ఎక్కువ కాలం కొనసాగలేదు. తూర్పు-మధ్య మరియు మధ్య పసిఫిక్లో సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు డిసెంబర్ 2024 నుండి ఫిబ్రవరి 2025 వరకు సగటు కంటే తక్కువగా ఉన్నాయి.
Also Read
- Mustard Oil Ban in US: భారత్లో హెల్దీ.. అమెరికాలో నిషేధం.. ఆవ నూనెపై నిజాలు ఇవే..!
- iPhone 18 Launch Date: యాపిల్ ఫ్యాన్స్కు గుడ్ న్యూస్.. ఐఫోన్ 18 ప్రో లాంచ్ డేట్ లీక్..! ఫీచర్లు, ధరలు వైరల్..
- Boondi Sev Curry Recipe: ఇంట్లో కూరగాయలు లేవా..? పెరుగు, బూందీ, సేవ్తో సూపర్ టేస్టీ కూర..
- Salman Nadwi D*eath: అయోధ్య వివాదంపై చర్చలకు మద్దతిచ్చిన మౌలానా సల్మాన్ నద్వీ మృతి..
Also Read: Myanmar Earthquake: మయన్మార్లో భూకంపం.. భారతదేశంలోని పలు రాష్ట్రాల్లో ప్రకంపనలు!
ఈ ఏడాది ఉత్తర భారతదేశంలో లా నినా ప్రభావం ఎక్కువగా ఉండనుంది. వచ్చే శీతాకాలంలో సాధారణం కంటే వాతావరణం మరీ చల్లగా ఉండనుంది. ఉష్ణోగ్రతలు సాధారణం కంటే తక్కువగా ఉంటాయని స్కైమెట్ వెదర్ వైస్ ప్రెసిడెంట్ మహేష్ పలావత్ చెప్పారు. ఇటీవలి ఏళ్లలో లా నినా ప్రభావం ఉత్తర భారతదేశంలో ఎక్కువగా ఉంది. ఢిల్లీ-ఎన్సీఆర్లో కనిష్ట ఉష్ణోగ్రత సగటు 2-3 డిగ్రీల సెల్సియస్. ప్రస్తుతం,వాయువ్య భారతదేశంలోని అనేక ప్రాంతాలలో రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3-5 డిగ్రీల సెల్సియస్ ఎక్కువగా ఉన్నాయి. ఇలా అక్టోబర్ 4 వరకు కొనసాగవచ్చు. అక్టోబర్ 4 నుంచి హిమాలయ ప్రాంతాలు ప్రభావితం అయ్యే అవకాశాలు ఉన్నాయి. దీని వలన ముందస్తు వర్షం, చలి వస్తుంది. లా నినా 2025-26 శీతాకాలం ఈ దశాబ్దంలోనే అత్యంత చల్లగా ఉండనుంది. ముఖ్యంగా ఢిల్లీ, గురుగ్రామ్, నోయిడా, ఫరీదాబాద్ ప్రాంతాలలో చలి ఎక్కువగా ఉండనుంది. ఈ చలి వ్యవసాయంపై కూడా ప్రభావం చూపుతుంది.
తాజావార్తలు
-
Kakanmath Temple: ఈ ఆలయాన్ని దెయ్యాలు నిర్మించాయా? వెయ్యేళ్లుగా చెక్కుచెదరని రహస్యం ఇదేనా?
-
RaviTeja : మాస్ మహారాజా రవితేజ ‘ఇరుముడి’ ఫస్ట్ సింగిల్ ‘ఇరుముడి కట్టు’ రిలీజ్
-
Suriya : కరుప్పు బ్లాక్ బస్టర్ జోష్..నెక్ట్స్ సినిమాలో పాట పడబోతున్న సూర్య
-
Mustard Oil Ban in US: భారత్లో హెల్దీ.. అమెరికాలో నిషేధం.. ఆవ నూనెపై నిజాలు ఇవే..!
-
Harshad Chopra: 43 ఏళ్ల వయసులోనూ ఎందుకు పెళ్లి చేసుకోలేదు?.. ప్రముఖ టీవీ నటుడు ఎమోషనల్ కామెంట్స్
ట్రెండింగ్
-
Gautam Gambhir: అయ్యా బాబోయ్.. గంభీర్ మాకు కోచ్గా వద్దు.. పసికూన క్రికెట్ బోర్డు ఎద్దేవా!
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!