CMD Raghuma Reddy : సంస్థ పరిధిలో విద్యుత్ సరఫరా పునరుద్ధరణ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గత పది రోజులుగా రాష్ట్రములో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల ప్రభావంతో దెబ్బతిన్న విద్యుత్ వ్యవస్థను సరి చేసి అన్ని కేటగిరీల వినియోగదారులకు విద్యుత్ సరఫరా అందిస్తున్నామని దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణి సంస్థ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ రఘుమా రెడ్డి తెలిపారు. సంస్థ ప్రధాన కార్యాలయం నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని చీఫ్ జనరల్ మెనేజర్లతో, జిల్లాల/ సర్కిళ్ల సూపెరింటెండింగ్ ఇంజినీర్లతో, డివిషనల్ ఇంజినీర్లతో సరఫరా పరిస్థితిని సమీక్షించారు.
వర్షాల కారణంగా సంస్థ పరిధిలో 2770 స్తంభాలు, 34 ట్రాన్స్ ఫార్మర్లు, అలాగే గ్రేటర్ హైదరాబాద్ నగర పరిధిలో 605 స్తంభాలు, 7 ట్రాన్స్ ఫార్మర్లు దెబ్బతిన్నాయని, అన్నింటిని పునరుద్ధరించడం జరిగిందని తెలిపారు. వరద ప్రభావం తగ్గిన తరవాత అన్ని ప్రాంతాల్లో క్షుణ్ణంగా పెట్రోలింగ్ నిర్వహించి భవిష్యతులో మరల ఇలాంటి పరిస్థితి పునరావృతం కాకుండా తగు చర్యలు తీసుకోవాలని సూచించారు.
Also Read
- CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
- Ajit Agarkar: టీమిండియాలో షమీ భవిష్యత్తుపై సందిగ్ధం.. సెలెక్టర్ల నిర్ణయం ఇదే
- Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
- India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
ఇంకా భారీ వర్షపు ముప్పు తొలగనందున అధికారులు, సిబ్బంది అప్రమతంగా ఉండాలని క్షేత్ర స్థాయిలో సెలవు రోజుల్లో కూడా హెడ్ క్వార్టర్స్ లో అందుబాటులో ఉండి అప్రమత్తంగా ఉండాలని సీఎండీ ఆదేశించారు. సెలవు రోజుల్లో కూడా స్టోర్స్, ఆపరేషన్ సిబ్బంది విధులు నిర్వహించాలని ఆదేశించారు. సిబ్బంది అధికారులు తప్పని సరిగా ముందస్తు భద్రతా చర్యలు పాటిస్తూ ఎలాంటి ప్రాణ నష్టం కలగకుండా చూడాలని తెలిపారు.
విద్యుత్ సంబంధిత ఫిర్యాదుల స్వీకరణ కోసం, అన్ని జిల్లాల/సర్కిళ్ల హెడ్ క్వార్టర్లలో మరియు హైదరాబాద్ లోని స్కాడా కార్యాలయంలో ప్రత్యేక కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేశామని తెలిపారు. సాధారణ ప్రజలు, వినియోగదారులు విద్యుత్ పరికరాల పట్ల స్వీయ జాగ్రత్తలు పాటించాలని, ఏదైనా విద్యుత్ అత్యవసర పరిస్థితి ఎదురైనప్పుడు సమీప విద్యుత్ కార్యాలయానికి గాని, కంట్రోల్ రూమ్స్ కు గాని, సంస్థ మొబైల్ ఆప్, ట్విట్టర్, పేస్ బుక్, 1912/ 100 కు కాల్ చేసి సమస్యను తమ దృష్టికి తీసుకురావాలని సీఎండీ రఘుమా రెడ్డి సూచించారు.
తాజావార్తలు
-
CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
-
Ajit Agarkar: టీమిండియాలో షమీ భవిష్యత్తుపై సందిగ్ధం.. సెలెక్టర్ల నిర్ణయం ఇదే
-
Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
-
India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
-
Karthi: నయనతార లేదా త్రిష.. కార్తీ కొత్త సినిమాలో హీరోయిన్ ఎవరు?
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!