CMD Raghuma Reddy : సంస్థ పరిధిలో విద్యుత్ సరఫరా పునరుద్ధరణ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గత పది రోజులుగా రాష్ట్రములో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల ప్రభావంతో దెబ్బతిన్న విద్యుత్ వ్యవస్థను సరి చేసి అన్ని కేటగిరీల వినియోగదారులకు విద్యుత్ సరఫరా అందిస్తున్నామని దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణి సంస్థ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ రఘుమా రెడ్డి తెలిపారు. సంస్థ ప్రధాన కార్యాలయం నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని చీఫ్ జనరల్ మెనేజర్లతో, జిల్లాల/ సర్కిళ్ల సూపెరింటెండింగ్ ఇంజినీర్లతో, డివిషనల్ ఇంజినీర్లతో సరఫరా పరిస్థితిని సమీక్షించారు.
వర్షాల కారణంగా సంస్థ పరిధిలో 2770 స్తంభాలు, 34 ట్రాన్స్ ఫార్మర్లు, అలాగే గ్రేటర్ హైదరాబాద్ నగర పరిధిలో 605 స్తంభాలు, 7 ట్రాన్స్ ఫార్మర్లు దెబ్బతిన్నాయని, అన్నింటిని పునరుద్ధరించడం జరిగిందని తెలిపారు. వరద ప్రభావం తగ్గిన తరవాత అన్ని ప్రాంతాల్లో క్షుణ్ణంగా పెట్రోలింగ్ నిర్వహించి భవిష్యతులో మరల ఇలాంటి పరిస్థితి పునరావృతం కాకుండా తగు చర్యలు తీసుకోవాలని సూచించారు.
Also Read
- Ramchander Rao: మా మంత్రులు, ఎంపీలే అన్ని చేస్తే.. ఇక సీఎం రేవంత్ రెడ్డి ఎందుకు?
- sonam wangchuk: "మాకు మంత్రి పదవులపై ఆశ లేదు".. విద్యా వ్యవస్థ లోపాలపై సోనామ్ వాంగ్చుక్ కీలక వ్యాఖ్యలు..
- Hanamkonda: న్యాయం చేయమంటే నరకం చూపించాడు.. మహిళపై నాలుగేళ్లుగా ఎస్ఐ అత్యాచారం!
- Shubman Gill: "డోంట్ వర్రీ".. రోహిత్ రనౌట్ వివాదంపై శుభ్మన్ గిల్ ఆసక్తికర వ్యాఖ్యలు..
ఇంకా భారీ వర్షపు ముప్పు తొలగనందున అధికారులు, సిబ్బంది అప్రమతంగా ఉండాలని క్షేత్ర స్థాయిలో సెలవు రోజుల్లో కూడా హెడ్ క్వార్టర్స్ లో అందుబాటులో ఉండి అప్రమత్తంగా ఉండాలని సీఎండీ ఆదేశించారు. సెలవు రోజుల్లో కూడా స్టోర్స్, ఆపరేషన్ సిబ్బంది విధులు నిర్వహించాలని ఆదేశించారు. సిబ్బంది అధికారులు తప్పని సరిగా ముందస్తు భద్రతా చర్యలు పాటిస్తూ ఎలాంటి ప్రాణ నష్టం కలగకుండా చూడాలని తెలిపారు.
విద్యుత్ సంబంధిత ఫిర్యాదుల స్వీకరణ కోసం, అన్ని జిల్లాల/సర్కిళ్ల హెడ్ క్వార్టర్లలో మరియు హైదరాబాద్ లోని స్కాడా కార్యాలయంలో ప్రత్యేక కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేశామని తెలిపారు. సాధారణ ప్రజలు, వినియోగదారులు విద్యుత్ పరికరాల పట్ల స్వీయ జాగ్రత్తలు పాటించాలని, ఏదైనా విద్యుత్ అత్యవసర పరిస్థితి ఎదురైనప్పుడు సమీప విద్యుత్ కార్యాలయానికి గాని, కంట్రోల్ రూమ్స్ కు గాని, సంస్థ మొబైల్ ఆప్, ట్విట్టర్, పేస్ బుక్, 1912/ 100 కు కాల్ చేసి సమస్యను తమ దృష్టికి తీసుకురావాలని సీఎండీ రఘుమా రెడ్డి సూచించారు.
తాజావార్తలు
-
Rahamathullah Gurbaj: నా సెంచరీకి కారణం గౌతమ్ గంభీర్.. అఫ్గాన్ ఓపెనర్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
100% Ethanol: 100% ఇథనాల్పై ప్రభుత్వ కీలక నిర్ణయం.. E100 ఇంధనానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన కేంద్రం
-
Ramchander Rao: మా మంత్రులు, ఎంపీలే అన్ని చేస్తే.. ఇక సీఎం రేవంత్ రెడ్డి ఎందుకు?
-
Sing Geetham : ‘సింగ్ గీతం’ హీరో అయాన్ బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలుసా ?
-
Sushant Singh Rajput: సుశాంత్ సింగ్ సోదరి ఎమోషనల్ పోస్ట్.. రాముడి రూపంలో సోదరుడి చిత్రాన్ని పంచుకుంటూ నివాళి
ట్రెండింగ్
-
Rahmanullah Gurbaz Record: జట్టు ఓడిపోయినప్పటికీ రహ్మనుల్లా గుర్బాజ్ చరిత్ర.. క్రికెట్లోనే సరికొత్త మైలురాయి!
-
Nitish Kumar Reddy: అమ్మతో అట్లుంటది మరి.. ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా ఆపేసిన నితీష్ రెడ్డి.. వీడియో వైరల్!
-
Garlic for High Cholesterol: ఖాళీ కడుపుతో వెల్లుల్లి తినడం వల్ల బ్లాక్స్ తగ్గుతాయా..?
-
Home Remedies : ఇంట్లో చీమల బెడదా.? 2 పదార్థాలతో శాశ్వత పరిష్కారం.!
-
Rainy Season Tips : వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు బెడదా.? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!