CM YS Jagan: ఎన్నికలపై ఫోకస్ పెట్టిన జగన్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM YS Jagan: అసెంబ్లీ ఎన్నికలతో పాటు లోక్సభ ఎన్నికలపై ఫోకస్ పెట్టారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి.. ఇప్పటికే ‘సిద్ధం’ సభలతో ప్రచారంలో దూకుడు పెంచిన జగన్.. ఇప్పుడు పార్టీ శ్రేణులను సమాయత్తం చేసేందుకు రెడీ అవుతున్నారు.. అందులో భాగంగా రేపు వైసీపీ కీలక సమావేశం జరగనుంది. అసెంబ్లీ ఎన్నికలకు ముఖ్యనేతలను సమాయత్తం చేసేందుకు వైసీపీ ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ముఖ్యమంత్రి జగన్ అధ్యక్షతన తాడేపల్లి సీకే కన్వెన్షన్లో ఈ మీటింగ్ నిర్వహించనున్నారు.. ఈ సమావేశానికి రాష్ట్రంలోని 175 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి నేతల హాజరు కానున్నారు. సుమారు 2 వేలకు పైగా మండల స్థాయి నేతలు ఈ సమావేశంలో పాల్గొంటారని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి.. వై నాట్ 175 లక్ష్యంగా నేతలకు సీఎం జగన్ దిశానిర్దేశం చేయనున్నారు. ప్రతి నియోజకవర్గంలో ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి ఫలాలను ప్రజలకు వివరించాలని నేతలకు సూచించనున్నారు.
Read Also: Arvind Kejriwal: నేను ఈడీ విచారణకు రాలేను.. అధికారులు కాస్త ఓపికతో ఉండండి
Also Read
- Tea and Biscuits: ఖాళీ కడుపుతో టీ, బిస్కెట్లు తింటున్నారా..? ఎయిమ్స్ వైద్యుల కీలక హెచ్చరిక
- INDA Vs AFGA: ఫైనల్లోకి దూసుకెళ్లిన టీమిండియా.. ఆప్ఘనిస్థాన్పై భారీ విజయం..
- G7 Summit: ఉక్రెయిన్కు పెరిగిన సైనిక, ఇంధన మద్దతు.. రష్యాపై ఆంక్షలకు జీ7 దేశాలు గ్రీన్సిగ్నల్
- Fraud: షేర్ మార్కెట్ పెట్టుబడుల పేరుతో భారీ మోసం.. లాభాలు చూపిస్తామంటూ బురిడీ..
వైసీపీ అధినేత వైఎస్ జగన్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో.. మంత్రులు, పార్టీ జిల్లా అధ్యక్షులు, రీజినల్ కో-ఆర్డినేటర్లకు.. పార్టీ పటిష్టతకు గ్రౌండ్ లెవల్లో తీసుకోవాల్సిన చర్యలపై సూచనలు చేయనున్నారు. జిల్లాల్లో పార్టీ నేతల మధ్య విభేధాలను పరిష్కరించుకుని.. పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై కూడా మార్గనిర్దేశనం చేయనున్నారు సీఎం జగన్.. గత ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలే.. తిరిగి పార్టీని అధికారంలోకి తీసుకొస్తాయని ధీమా వ్యక్తం చేస్తున్నారు నేతలు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు చేసిన మంచిని వివరిస్తూనే.. ప్రతిపక్షాలు చేస్తోన్న తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టేలా నేతలకు సీఎం వైఎస్ జగన్ సూచనలు చేస్తారని తెలుస్తోంది. కాగా, సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గర పడుతోన్న వేళ.. ఇప్పటికే ‘సిద్ధం’ పేరుతో సభలు నిర్వహిస్తూ వస్తోంది వైసీపీ.. భారీ స్థాయిలో జనసమీకరణతో ఔరా! అనిపించేలా ఈ సభలు నిర్వహిస్తోన్న విషయం విదితమే.
తాజావార్తలు
-
Tea and Biscuits: ఖాళీ కడుపుతో టీ, బిస్కెట్లు తింటున్నారా..? ఎయిమ్స్ వైద్యుల కీలక హెచ్చరిక
-
INDA Vs AFGA: ఫైనల్లోకి దూసుకెళ్లిన టీమిండియా.. ఆప్ఘనిస్థాన్పై భారీ విజయం..
-
G7 Summit: ఉక్రెయిన్కు పెరిగిన సైనిక, ఇంధన మద్దతు.. రష్యాపై ఆంక్షలకు జీ7 దేశాలు గ్రీన్సిగ్నల్
-
Anil Ravipudi: రేపే అనిల్ రావిపూడి కొత్త సినిమా గ్రాండ్ లాంచ్!
-
Kitchen Hacks: వర్కింగ్ ఉమెన్స్ కోసం కిచెన్ సీక్రెట్స్.. ఈ చిట్కాలతో వంట పని ఇక చిటికెలోనే!
ట్రెండింగ్
-
Cleaning Hacks : బాత్రూమ్ బకెట్లు నల్లగా మారాయా.? ఈ ఒక్క చిట్కాతో కొత్తవాటిలా మెరిపించండి.!
-
Vaibhav Sooryavanshi Controversy: వైభవ్ అవుట్పై వివాదం.. థర్డ్ అంపైర్ నిర్ణయంపై అఫ్గాన్ ప్లేయర్స్ అసంతృప్తి!
-
Ragi Bun Dosa: ఆరోగ్యం, రుచి రెండూ ఒకేచోట.. స్పాంజీ లాంటి ‘రాగి బన్ దోస’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Wedding Expenses: పెళ్లి ముహూర్తాలకు వేళాయే.. తక్కువ టైమ్ ఉండటంతో తెలుగు ఇళ్లల్లో బడ్జెట్ టెన్షన్!!
-
Ayodhya Ram Mandir: రాముడికి ప్రసాదంగా ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మామిడి పండ్లు.!