NTV Telugu Site icon

CM YS Jagan: ఉత్సాహంగా సీఎం జగన్ ఎన్నికల ప్రచారం.. నేడు మూడు జిల్లాలో పర్యటన

Ys Jagan

Ys Jagan

CM YS Jagan: సీఎం జగన్ ఎన్నికల ప్రచారానికి జనం నీరాజనాలు పలుకుతున్నారు. బహిరంగ సభలకు ప్రజలు భారీగా తరలివస్తున్నారు. కూటమిపై పార్టీలపై విమర్శలు ఎక్కుపెడుతూ ప్రచారపర్వంలో ముందుకెళ్తున్నారు జగన్. నిన్న రెండో రోజున మూడు జిల్లాల్లోని మూడు నియోజకవర్గాల్లో పర్యటించారు సీఎం జగన్. మలి విడత ప్రచారంలో డోస్ పెంచేసారు సీఎం జగన్. కూటమిపై ముఖ్యంగా టీడీపీ అధినేత చంద్రబాబుపై ఘాటు విమర్శలు చేస్తున్నారు. 2014 మేనిఫెస్టోలో ఇదే కూటమి ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని ప్రజలకు గుర్తుచేస్తున్నారు. అప్పట్లో టీడీపీ ఇచ్చిన మేనిఫెస్టోను చూపిస్తూ.. అందులో ఎన్ని హామీలు అమలు కాలేదో.. ఎందుకు కాలేదో వివరిస్తున్నారు.

Read Also: Loksabha Elections : అమేథీ, రాయ్ బరేలీ అభ్యర్థులపై కొలిక్కి రాని కాంగ్రెస్ నిర్ణయం

రెండు వారాల్లో కురుక్షేత్ర మహాసంగ్రామం జరగబోతుందని సీఎం జగన్ అన్నారు. అటువైపున కౌరవ సైన్యం ఉందన్నారు. అందరిని మోసం చేసిన చరిత్ర కూటమిది అంటూ టీడీపీ, జనసేన, బీజేపీపై మండిపడ్డారు. ఈ మధ్య చంద్రబాబు తనను బచ్చా అంటున్నారని గుర్తుచేస్తూనే.. ఆ కామెంట్స్‌కు కౌంటరిచ్చారు జగన్. సిద్ధం, మేమంతా బస్సు యాత్రలతో ఇప్పటికే రాష్ట్రాన్ని చుట్టొచ్చిన జగన్‌… ఇప్పుడు మలి విడత ప్రచారం నిర్వహిస్తున్నారు. రోజుకు 3 అసెంబ్లీ నియోజకవర్గాల్లో బహిరంగ సభలు నిర్వహిస్తున్నారు. ఇవాళ ప్రకాశం జిల్లా కొండేపి నియోజకవర్గంతో పాటు మైదుకూరు, పీలేరులో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారు. టంగుటూరులో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొంటారు సీఎం జగన్‌. మొత్తానికి…ఎన్నికల ప్రచారంలో డోస్‌ పెంచిన సీఎం జగన్‌ కార్యకర్తల్లో జోష్‌ నింపుతున్నారు.

Read Also: CM Revanth Reddy: నేడు కరీంనగర్, వరంగల్, చేవెళ్లలో సీఎం రేవంత్ పర్యటన

ఇక, ఈ రోజు ప్రకాశం జిల్లాలో సీఎం జగన్ పర్యటన సాగనుంది… కొండేపి నియోజకవర్గం టంగుటూరులో ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొననున్న సీఎం జగన్.. ఉదయం 11 గంటలకు ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు.. మరోవైపు, మధ్యాహ్నం 12.30కి మైదుకూరు 4 రోడ్ల జంక్షన్‌లో జగన్‌ సభ నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు కలికిరిలో ఎన్నికల ప్రచార సభలో పాల్గొననున్నారు ఏపీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి.