NTV Telugu Site icon

CM Revanth Reddy : ప్రజా ప్రభుత్వం జర్నలిస్టులు సంక్షేమం కార్యక్రమం.. బషీర్‌బాద్‌లో 38 ఎకరాల భూమిపత్రాలు అందజేత

Cm Revanth Reddy

Cm Revanth Reddy

జర్నలిస్టుల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జవహర్‌లాల్ నెహ్రూ జర్నలిస్ట్స్ హౌసింగ్ సొసైటీకి భూ పంపిణీ కార్యక్రమం జరిగింది. సొసైటీ సభ్యులకు భూమిని కేటాయించడం, వారికి ఇళ్ల స్థలాలు కల్పించడం కోసం ఈ కార్యక్రమం నిర్వహించారు. జర్నలిస్టు సంఘాన్ని ఆదుకునేందుకు, వారి శ్రేయస్సుకు భరోసా కల్పించేందుకు ప్రభుత్వం చూపుతున్న నిబద్ధతను ఈ వేడుకలో ముఖ్యమంత్రి ఎత్తిచూపారు. సమాజంలో పాత్రికేయులు పోషిస్తున్న ముఖ్యమైన పాత్రను ఆయన గుర్తించి, వారికి తగిన వనరులు మరియు సౌకర్యాలు కల్పించాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. జర్నలిస్టుల కృషిని గుర్తించి వారి జీవన స్థితిగతులను మెరుగుపరిచే దిశగా భూ పంపిణీ కార్యక్రమం ఒక అడుగుగా పరిగణించబడుతుంది. మీడియా మరియు ప్రభుత్వ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు, మీడియా నిపుణుల కోసం గృహనిర్మాణాన్ని మెరుగుపరచడానికి రాష్ట్రం చేస్తున్న ప్రయత్నాలలో ఒక మైలురాయిని సూచిస్తుంది.

New Virus: చైనాలో మరో భయంకరమైన వైరస్.. మెదడుపై తీవ్ర ప్రభావం..

ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ… కొంతమంది జర్నలిస్ట్‌లు రాజకీయ పార్టీలకు కార్యకర్తలుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. జర్నలిస్ట్‌లు హద్దులు దాటి వ్యవహారించకూడదని వ్యాఖ్యానించారు, కొన్ని పత్రికలు చాలా చిల్లర రాతలు రాస్తున్నాయని విమర్శలు చేశారు. ‘‘కొంతమంది జర్నలిస్టులు చీఫ్ మినిస్టర్‌ను చీప్ మినిస్టర్ అంటూ కుర్చీకు ఉన్న గౌరవం పొగొడుతున్నారు. వ్యక్తి నచ్చక పోవచ్చు వ్యవస్థలో గౌరవప్రదమైన పదవికి విలువ ఇవ్వాలి. ఎదుటి వారు విలువలు దాటితే మేము దాటుతాం. అక్రిడిటేషన్ విషయంలో ఈసారి కచ్చితంగా నిబంధనలు ఉంటాయి. జర్నలిస్ట్‌లకు పార్లమెంటరీ పార్టీ వ్యవస్థలో చాలా గౌరవ మర్యాదలు ఉంటాయి. ఇక్కడ ఉన్న వారు ఎలా ఉన్నారో ఆలోచన చేయాలి. కొన్ని సందర్భాల్లో చిట్‌చాట్‌లను సైతం ఇంకొకలాగా రాస్తున్నారు. గతంలో గాంధీ భవన్‌లో సన్నిహితంగా మాట్లాడిన మాటాలను రికార్డు చేసిన సందర్భలు ఉన్నాయి. అందుకోసమే జర్నలిస్ట్‌ల పట్ల జాగ్రత్తగా ఉండాల్సి వస్తోంది. ఆరోగ్య శ్రీ కార్డుల విషయంలో ఎవరికి ఎలాంటి అపోహాలు అవసరం లేదు’’ అని సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు.

Alluri District: ఏపీలో తప్పిన పెను ప్రమాదం.. వాగులోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు, 20 మంది సేఫ్