Site icon NTV Telugu

CM Revanth Reddy : వికారాబాద్-కృష్ణా రైల్వే లైన్ అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించండి

Revanthreddy Cm

Revanthreddy Cm

వికారాబాద్-కృష్ణా రైల్వే లైన్ అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించాలని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. మంగళవారం సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిగారిని అరుణ్ కుమార్ జైన్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న రైల్వే లైన్ల అభివృద్ధి, కొత్త రైల్వే లైన్ల ఏర్పాటుకు సంబంధించి చర్చించుకున్నారు. గతంలో ప్రతిపాదించిన వికారాబాద్- కృష్ణా రైల్వే లైన్ అభివృద్ధిపైనా సమావేశంలో చర్చ జరిగింది. ఎంతో కాలంగా నిర్లక్ష్యానికి గురైన ఈ మార్గాన్ని పూర్తి చేయాల్సిన అవసరం ఉందని సీఎం సూచించారు. ఈ మార్గాన్ని పూర్తి చేస్తే పరిసర ప్రాంతాల అభివృద్ధి మరింత వేగవంతమవుతుందని సీఎం అభిప్రాయపడ్డారు.

 

సమీప ప్రాంతాల్లో పరిశ్రమలను నెలకొల్పేందుకు వీలుంటుందన్నారు. రైల్వే లైన్ అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించాలన్నారు.ఈ సమావేశంలో R&B,రవాణా శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీనివాస రాజు, ఇతర అధికారులు పాల్గొన్నారు. చాలా కాలంగా నిర్లక్ష్యానికి గురైన ప్రతిపాదిత రైలు మార్గాన్ని పూర్తి చేయాలని ముఖ్యమంత్రి అరుణ్ కుమార్ జైన్‌కు సూచించారు. రైల్వే లైన్‌ పూర్తయితే పరిసర ప్రాంతాలు వేగంగా అభివృద్ధి చెందుతాయని, సమీప ప్రాంతాల్లో కొత్త పరిశ్రమలు కూడా వస్తాయని రేవంత్ అభిప్రాయపడ్డారు. సమావేశంలో ఆర్ అండ్ బి, రవాణా శాఖ కార్యదర్శి శ్రీనివాసరాజు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Exit mobile version