CM Chandrababu Naidu: రాయలసీమకు స్వర్ణ యుగం ప్రారంభమైంది అన్నారు సీఎం చంద్రబాబు. విధ్వంస పాలనతో నష్టపోయిన రాష్ట్రానికి మళ్లీ ప్రాణం పోస్తున్నామని తెలిపారు. పరిశ్రమలు పెట్టుబడులు ఉద్యోగాలతో రాయలసీమ బిజీగా మారింది. రాళ్ల సీమ కాదు.. రతనాల సీమ అని చూపిస్తున్నామన్నారు సీఎం. రాయలసీమలో ప్లాంట్ ఏర్పాటు చేస్తామని ముందే మాటఇచ్చామని గుర్తు చేశారు.
రెండు స్టేజీల్లో 2 మిలియన్ టన్నుల ఉత్పత్తి జరగనుంది. జేఎస్డబ్ల్యూ (JSW) రాయలసీమ ప్లాంట్ తో ఏపీ ఉక్కు రాష్ట్రంగా తయారవుతుంది. విశాఖ మాత్రమే కాదు.. రాయలసీమ కూడా ఉక్కుకు కేంద్రం అవుతుందన్నారు. సీఎం కడప జిల్లా జమ్మలమడుగు మండలం సున్నపురాళ్లపల్లెలో 16,350 కోట్ల రూపాయల భారీ వ్యయంతో నిర్మించనున్న ప్రతిష్టాత్మక జేఎస్డబ్ల్యూ రాయలసీమ ఉక్కు కర్మాగార పనులను చంద్రబాబు ప్రారంభించారు.
రాయలసీమ అంటే కరువు నేల కాదు, రాయల సీమను రత్నాల సీమగా మారుస్తున్నామన్నా సీఎం.. వైసీపీ హయాంలో కనీసం పులివెందులలో ఒక్క ఎకరానికి కూడా నీళ్లు ఇవ్వలేదని మండిపడ్డారు. చివరికి పులివెందులలోని ఎర్రబల్లె చెరువుకు తామే నీళ్లు ఇచ్చామని గుర్తు చేశారు సీఎం చంద్రబాబు. చీనీ తోటలను బతికిచ్చాం. పైడిపాలెం చిత్రావతి లిఫ్ట్లు పూర్చేసి రైతుల కష్టాలు తీర్చామని.. ఇంకా పులివెందల మండలంలో ఎర్రబల్లి చెరువు కూడా మేమే నీళ్ళ ఇచ్చామని ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలని.. రాయలసీమ ముఖ చిత్రం మారబోతుందని ఆయన అన్నారు.

