NTV Telugu Site icon

TTD : శ్రీవారి ఆలయంలోని అన్నప్రసాదాల తయారీలో మార్పుపై క్లారిటీ

Ttd

Ttd

తిరుమల ఆలయంలో అన్నప్రసాదాల తయారీకి ఆర్గానిక్‌ బియ్యాన్ని ఉపయోగిం చాలని టీటీడీ నిర్ణయించినట్లు సోషల్‌ మీడియాలో వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) తేల్చి చెప్పింది. సాధారణ బియ్యంతో పాత పద్ధతిని మార్చే ప్రతిపాదన లేదని బుధవారం టీటీడీ ప్రతినిధి స్పష్టం చేశారు , ఈ అంశంపై సోషల్ మీడియాలో వచ్చిన కథనాలు “పూర్తిగా నిజం కాదు” అని అన్నారు. టీటీడీ ఈవో జె.శ్యామలరావు మరుసటి రోజు అర్చకులు, ఆలయ అధికారులతో సమావేశమై అన్నప్రసాదాలు, వాటి ప్రాముఖ్యతపై సుదీర్ఘంగా చర్చించారు. అంతే కాకుండా అన్నప్రసాదాల తయారీ లేదా దిట్టం పెంచడంపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని అధికార ప్రతినిధి తెలిపారు. అయితే శ్రీవారి ఆలయంలో అన్నప్రసాదాల తయారీలో మార్పులు చేశామని కొందరు సోషల్ మీడియాలో పుకార్లు సృష్టిస్తున్నారని, ఇది పూర్తిగా సరికాదని సోషల్ మీడియా వేదికలపై ఇలాంటి తప్పుడు వార్తలను నమ్మవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.