Govt Hospital: కరెంట్ బిల్లు కట్టలేదని కర్నూలు ప్రభుత్వాసుపత్రిలో సిటీ స్కాన్, ఎమ్ఆర్ఐ కేంద్రాలకు తాళం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎవరన్న కరెంట్ బిల్లు కట్టకపోతే విద్యుత్ శాఖ అధికారులు కనెక్షన్ కట్ చేసేస్తారు. అలాంటిది ప్రభుత్వానికి సంబంధించినవి స్కూల్స్, హస్పటల్స్ అయినా.. సరే వారి తీరు అలాగే ఉంటుంది. అయితే, తాజాగా నిరంతరం పేదలకు చికిత్స అందించే ప్రభుత్వ ఆస్పత్రికి కూడా విద్యుత్ శాఖ అధికారులు షాక్ ఇచ్చారు. గత కొన్ని నెలలుగా కరెంట్ బిల్లు కట్టడం లేదని సదరు హస్పటల్ కు కరెంట్ కనెక్షన్ కట్ చేశారు. అయితే, ఈ ఘటన మన పక్క రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్ లోని కర్నూలు జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో చోటు చేసుకుంది.
Read Also: Varun Tej Lavanya Tripathi : వరుణ్ తేజ్, లావణ్య పెళ్లికి వెళ్లేవాళ్లు ఈ బట్టలే ధరించాలట!
Also Read
- Amaravati Land Pooling: అమరావతిలో మరో విడత ల్యాండ్ పూలింగ్.. 1,654 ఎకరాల భూమి సమీకరణకు నోటిఫికేషన్..
- Makkah Deal: మక్కా ఒప్పందంలోకి బంగ్లాదేశ్! భారత్పై జమాతే ఇస్లామీ నాయకుడు కీలక వ్యాఖ్యలు
- Amaravati: రాజధాని గ్రామాలకు గుడ్ న్యూస్.. 29 గ్రామాలకు భారీగా నిధులు..
- Raksha Bandhan 2026: రాఖీ ఎప్పుడు కట్టాలి? ఎలా కట్టాలి? శుభ సమయాలతో పాటు రక్షా బంధన్ పూర్తి వివరాలు ఇవే..
కర్నూలు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలోకి విద్యుత్ శాఖ అధికారులు తాళం వేశారు. అయితే, గత కొంత కాలంగా కరెంట్ బిల్లు చెల్లించడం లేదని సిటీ స్కాన్, ఎమ్ఆర్ఐ కేంద్రాలకు కలెక్టర్ సృజన తాళం వేయించింది. ఏడాదిగా బిల్లులు రాలేదని, కొంత సమయం ఇస్తే విద్యుత్ బిల్లులు చెల్లిస్తామని కలెక్టర్ కు ఏజెన్సీ ప్రతినిధులు తెలిపారు. అయినా ఎమ్ఆర్ఐ, సిటీ స్కాన్ కేంద్రాలకు అధికారులు లాక్ వేసేశారు. రోగులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకుండా ఎలా మూసివేస్తారని అధికారులను హస్పటల్ లో ఉన్న రోగులు నిలదీస్తున్నారు. అత్యవసర పరీక్ష కేంద్రాలను మూసివేయడంతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆసుపత్రి అధికారులు వెంటనే స్పందించి సిటీ స్కాన్, ఎమ్ఆర్ఐ కేంద్రాలను తెరిపించాలని పేషెంట్స్ కోరుతున్నారు.
Read Also: Phone Hacking: యాపిల్ సంస్థ నుంచి ప్రతిపక్ష ఎంపీలకు అలర్ట్.. కేంద్రం హ్యాక్ చేస్తోందని ధ్వజం
జీజీహెచ్ లో సిటీ స్కాన్ సెంటర్ ముందు రోగులు, సీపీఐ ఆందోళనకు దిగారు. సిటీ స్కాన్, ఎంఆర్ఐ కేంద్రాలు మూసివేయడంపై ఆందోళన చేస్తున్నారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకుండా సిటీ స్కాన్, ఎంఆర్ఐ ఎలా మూసి వేస్తారని రోగులు ప్రశ్నించారు. సిటీ స్కాన్, ఎంఆర్ఐ కేంద్రాలను వెంటనే తెరిపించాలని డిమాండ్ చేస్తున్నారు.
తాజావార్తలు
-
Amaravati Land Pooling: అమరావతిలో మరో విడత ల్యాండ్ పూలింగ్.. 1,654 ఎకరాల భూమి సమీకరణకు నోటిఫికేషన్..
-
Makkah Deal: మక్కా ఒప్పందంలోకి బంగ్లాదేశ్! భారత్పై జమాతే ఇస్లామీ నాయకుడు కీలక వ్యాఖ్యలు
-
Amaravati: రాజధాని గ్రామాలకు గుడ్ న్యూస్.. 29 గ్రామాలకు భారీగా నిధులు..
-
The Paradise : ‘యెషనాగుల’ వచ్చేస్తోంది.. ‘ది ప్యారడైజ్’లో ఊరమాస్ ట్రీట్
-
Raksha Bandhan 2026: రాఖీ ఎప్పుడు కట్టాలి? ఎలా కట్టాలి? శుభ సమయాలతో పాటు రక్షా బంధన్ పూర్తి వివరాలు ఇవే..
ట్రెండింగ్
-
Festival Recipes : రక్షా బంధన్ స్పెషల్.. ఇంట్లోనే సింపుల్గా కాజు కట్లీ రెడీ..!
-
MS Dhoni-CSK: సీఎస్కేలో ధోనీకి 25 శాతం వాటానా?.. ఫ్రీగా ఎవరైనా ఇస్తారా?.. మాజీ టీమిండియా ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
కేవలం రూ.7,999కే.. 5000mAh బ్యాటరీ, LED ఫ్లాష్ కెమరాతో Lava Bold N4 Lite లాంచ్..!
-
రూ.14,999కే మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే.. Realme C100i 4G ఫోన్ లాంచ్.!
-
Paneer Bhurji Recipe: పప్పు, కూరలతో బోర్ కొడుతోందా.? అయితే “పనీర్ భుర్జీ”తో కొత్త టేస్ట్ ఆస్వాదించండి..!