Citigroup Layoffs: 20వేల మంది ఉద్యోగులను ఇంటికి పంపేస్తున్న.. సిటీ గ్రూప్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Citigroup Layoffs: అమెరికాకు చెందిన ప్రముఖ బ్యాంక్ సిటీ గ్రూప్ ఇంక్ రాబోయే రెండేళ్లలో 20,000 మందికి పైగా ఉద్యోగులను తొలగించాలని యోచిస్తోంది. 14 ఏళ్లలో అత్యంత దారుణమైన త్రైమాసిక ఫలితాలు రావడంతో బ్యాంక్ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ అమెరికన్ బ్యాంక్ మొత్తం 2,39,000 మంది ఉద్యోగులను 20,000 మంది తగ్గించాలని ప్రణాళిక వేసింది. 2026 నాటికి బ్యాంకులో పనిచేసే మొత్తం ఉద్యోగుల సంఖ్య 8 శాతం తగ్గవచ్చు. ఈ రిట్రెంచ్మెంట్ ప్లాన్కు సిటీ గ్రూప్ కు 1 బిలియన్ డాలర్లు ఖర్చు అవుతుంది. తొలగించబడిన ఉద్యోగులకు అదనపు జీతం, సౌకర్యాల కోసం ఈ డబ్బు ఖర్చు చేయబడుతుంది. అయితే, బ్యాంకు మొత్తం ఖర్చులు తక్కువగా ఉంటాయి. కొత్త చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ జేన్ ఫ్రైసెన్ బ్యాంక్లో బాధ్యతలు స్వీకరించినప్పటి నుండి సిటీ గ్రూప్ తన వ్యాపారాన్ని పునర్వ్యవస్థీకరించడంలో బిజీగా ఉంది. బ్యాంక్ తన ఖర్చులను తగ్గించుకోవడానికి ప్రయత్నిస్తోంది. తద్వారా దాని లాభాలను పెంచుకోవచ్చు.
Read Also:Lok Sabha Elections: నేడు ఇండియా కూటమి కీలక సమావేశం
Also Read
- Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
- Third Front: దేశంలో ‘‘థర్డ్ ఫ్రంట్’’.. కనిమొళి వరస భేటీలతో కొత్త చర్చ..
- Marital Rape: వైవాహిక అత్యాచారంపై సుప్రీంకోర్టు కీలక విచారణ.. తెగే పంచాయితీనేనా?
- Pakistan: అరేబియా సముద్రంలో భారత్-పాక్ నేవీ ఢీ.. చైనా వ్యూహాలపై అనుమానం.!
ఈ సంవత్సరం దాని వ్యయం 53.5 నుండి 53.80 బిలియన్ డాలర్ల మధ్య ఉండవచ్చని బ్యాంక్ శుక్రవారం అంచనా వేసింది. ఇది గత సంవత్సరం కంటే కొంచెం తక్కువ. అంతకుముందు, 2023లో బ్యాంక్ మొత్తం వ్యయం సుమారు 56.40 బిలియన్ డాలర్లు. సిటీ గ్రూప్ 20,000 మంది ఉద్యోగులను తొలగించడం ద్వారా రాబోయే రెండేళ్లలో 2.5 బిలియన్ డాలర్లను ఆదా చేసేందుకు ప్లాన్ చేయనుంది.
Read Also:Traffic Diversions: కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్.. 3 రోజులు అక్కడ ట్రాఫిక్ ఆంక్షలు
త్రైమాసికంలో నిరుత్సాహకర ఫలితాలు
అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికానికి సంబంధించిన ఫలితాలను విడుదల చేసింది. ఆ సమయంలో సిటీ గ్రూప్ ఈ కాలంలో 1.8 బిలియన్ డాలర్ల నష్టాన్ని చవిచూసింది. ఇది గత 14 ఏళ్లలో బ్యాంక్ అత్యంత నిరాశాజనకమైన ఫలితాలని పేర్కొంది. గతేడాది ఇదే త్రైమాసికంతో పోలిస్తే బ్యాంక్ ఆదాయం 3 శాతం తగ్గి 17.40 బిలియన్ డాలర్లకు చేరుకుంది. ఈ ఫలితం తర్వాత బ్యాంక్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ జేన్ ఫ్రెషన్ మాట్లాడుతూ.. 2023 సంవత్సరం ఆశించినంతగా లేదని.. 2024 మాకు చాలా ముఖ్యమైనదన్నారు. బ్యాంక్ రాబోయే రెండేళ్లలో పెద్ద ఎత్తున పునర్నిర్మాణం చేయబోతోంది. దీని ద్వారా మొత్తం 2.5 బిలియన్ డాలర్లను ఆదా చేయడానికి ప్రణాళిక చేయబడింది.
తాజావార్తలు
-
Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
-
Third Front: దేశంలో ‘‘థర్డ్ ఫ్రంట్’’.. కనిమొళి వరస భేటీలతో కొత్త చర్చ..
-
Marital Rape: వైవాహిక అత్యాచారంపై సుప్రీంకోర్టు కీలక విచారణ.. తెగే పంచాయితీనేనా?
-
Pakistan: అరేబియా సముద్రంలో భారత్-పాక్ నేవీ ఢీ.. చైనా వ్యూహాలపై అనుమానం.!
-
Abhishek Sharma: అభిషేక్ శర్మ విధ్వంసం.. 30 బాల్స్లో సెంచరీ.. నంబర్ 1 బ్యాట్స్మెన్గా ప్రపంచ రికార్డు..
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!