Christianity: ప్రపంచ దేశాల్లో తగ్గుతున్న క్రైస్తవ జనాభా.. భారత్లో మాత్రం భారీ పెరుగుదల..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Christianity Declining Globally: జనాభా పరంగా ప్రపంచంలోనే అతిపెద్ద మతం క్రైస్తవ మతం. కానీ ప్రస్తుతం అది సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ప్రపంచంలోని క్రైస్తవ మతాన్ని అనుసరించేవారు దూరమవుతున్నారు. ప్యూ రీసెర్చ్ సెంటర్ తాజా నివేదికలో ఈ సమాచారం వెల్లడైంది. గత దశాబ్దంలో ప్రపంచంలోని మరో నాలుగు దేశాలు క్రైస్తవ దేశం హోదాను కోల్పోయాయని ప్యూ రీసెర్చ్ విశ్లేషణలో తేలింది. అంటే ఒకప్పుడు క్రైస్తవ దేశాలుగా ఉన్న ఈ నాలుగు దేశాల్లో క్రైస్తవ జనాభా తగ్గింది. ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. ప్రపంచంలో క్రైస్తవ్యం తగ్గుతుంటే భారత్లో మాత్రం గణనీయమైన పెరుగుదల కనిపించింది.
READ MORE: Yashasvi Jaiswal: జైస్వాల్ సెంచరీ.. గవాస్కర్ రికార్డు సమం, సచిన్ రికార్డు బ్రేక్!
Also Read
- OTR: అసెంబ్లీకి పోటీ చేయాలని ఉవ్విళ్ళూరుతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు.. నియోజకవర్గాలను ఎంపిక చేసుకున్నారా?
- OTR: సీఎం టూర్.. శాసనమండలి ఛైర్మన్కు మరోసారి ప్రోటోకాల్ ఇబ్బంది.!
- Delhi: కేతన్ హత్య తరహాలో మరో ఇల్లాలి కుట్ర.. దేశ రాజధానిలో కలకలం
- Clean and Clutter Free Home: బిజీ లైఫ్లోనూ క్లీన్ హోమ్ సాధ్యం.. పరిశుభ్రమైన ఇంటి రహస్యం ఇదే.!
ప్యూ రీసెర్చ్ సెంటర్ నివేదిక ప్రకారం.. 2010- 2020 మధ్య క్రైస్తవ జనాభా మైనారిటీగా మారిన దేశాలలో బ్రిటన్ కూడా ఉంది. ఒకప్పుడు చర్చ్ ఆఫ్ ఇంగ్లాండ్ రూపంలో క్రైస్తవ మతం జెండాను రెపరెపలాడించిన బ్రిటన్లో ఇప్పుడు క్రైస్తవ జనాభా 50 శాతం కంటే తక్కువకు తగ్గింది. ఇది కాకుండా.. ఫ్రాన్స్, ఆస్ట్రేలియాలో కూడా క్రైస్తవ జనాభా మైనారిటీగా మారింది. దక్షిణ అమెరికా దేశమైన ఉరుగ్వే కూడా ఈ జాబితాలో చేరింది. రెండు అమెరికా ఖండాల్లోనూ క్రైస్తవులు మైనారిటీలుగా ఉన్న ఏకైక దేశం ఉరుగ్వే. ఉరుగ్వేలో కేవలం 44 శాతం మంది మాత్రమే క్రైస్తవ మతంలో ఉన్నారు. 52% జనాభా ఏ మతాన్ని నమ్మరు. ఈ దేశాలలో క్రైస్తవ జనాభా తగ్గడానికి కారణం ప్రజలు మత సంప్రదాయాలకు దూరంగా ఉండటం. ప్యూ రీసెర్చ్ నివేదిక ప్రకారం.. లక్షలాది మంది క్రైస్తవ మతాన్ని విడిచిపెడుతున్నారు. అయితే, ఎక్కువ మంది వేరే మతంలోకి మారడం కంటే తమకు ఎలాంటి మతం లేదని స్పష్టం చేస్తున్నారు.
READ MORE: Konda Surekha : ఈ కేసులు, కొట్లాటలు నాకు కొత్త కాదు.. నా జీవితమే ఒక పోరాటం
ఇదిలా ఉండగా.. ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవ జనాభాలో క్షీణత ఉన్నప్పటికీ.. భారతదేశంలో మాత్రం క్రైస్తవ జనాభా వేగంగా పెరుగుతోంది. గత దశాబ్దంలో క్రైస్తవ జనాభా 23.40 లక్షలు పెరిగింది. 2010లో దేశంలో క్రైస్తవ జనాభా 287,20000, ఇది 2020 నాటికి 310,60,000కి పెరిగింది. ప్రపంచ వ్యాప్తంగా క్రైత్సవ జనాభా 28.8 శాతం. అయితే.. ఇస్లాం ప్రపంచంలో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న మతం. 2010 – 2020 మధ్య ముస్లిం జనాభాలో భారీగా వృద్ధి కనిపించింది. ప్రపంచ జనాభాలో ముస్లింలు 25.6 శాతంగా ఉన్నారు. అంటే ప్రపంచ జనాభాలో నాలుగో వంతు ముస్లింలే ఉన్నారు. 2010 సంవత్సరంలో ఇది 23.9 శాతంగా ఉండేది. గత దశాబ్దంలో 34.6 కోట్లు పెరిగింది.
తాజావార్తలు
-
Chairmans Desk : హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఇంకా కోలుకోలేదా..?
-
Monsoon Traffic: వర్షాకాలం ట్రాఫిక్ యాక్షన్ ప్లాన్.. పోలీసులకు సైబరాబాద్ సీపీ కీలక ఆదేశాలు!
-
OTR: అసెంబ్లీకి పోటీ చేయాలని ఉవ్విళ్ళూరుతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు.. నియోజకవర్గాలను ఎంపిక చేసుకున్నారా?
-
OTR: గుంటూరు జిల్లాలో టీడీపీకి ఎదురుదెబ్బా? విజయోత్సవ సభ ఫ్లాప్ వెనుక కారణాలు
-
OTR: మూడు నియోజకవర్గాల చుట్టూ తిరిగిన మాజీ మంత్రి.. ఫైనల్గా ఎక్కడ ఫిక్స్ అయ్యారు?
ట్రెండింగ్
-
Clean and Clutter Free Home: బిజీ లైఫ్లోనూ క్లీన్ హోమ్ సాధ్యం.. పరిశుభ్రమైన ఇంటి రహస్యం ఇదే.!
-
6000mAh భారీ బ్యాటరీ, Snapdragon 6 Gen 3 ప్రాసెసర్తో Samsung Galaxy M47 5G లాంచ్.! ధర ఎంతంటే.?
-
టీవీ కాదు భయ్యో.. అంతకు మించి.! AI పవర్, True RGB డిస్ప్లేతో Sony BRAVIA 9 II, BRAVIA 7 II భారత్లో లాంచ్.!
-
Ragi Milk: శరీరాన్ని సహజంగా చల్లగా ఉంచే సూపర్ డ్రింక్ ‘రాగి మిల్క్’.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Gautam Gambhir: అయ్యా బాబోయ్.. గంభీర్ మాకు కోచ్గా వద్దు.. పసికూన క్రికెట్ బోర్డు ఎద్దేవా!