Site icon NTV Telugu

Fishing Vessel Capsize: హిందూ మహాసముద్రంలో మత్స్యకార నౌక బోల్తా.. 39 మంది గల్లంతు

Fishing Vessel

Fishing Vessel

Fishing Vessel Capsize: హిందూ మహాసముద్రం మధ్య భాగంలో చైనా మత్స్యకార నౌక మంగళవారం బోల్తా పడింది. ఈ ప్రమాదంలో నౌకలో ఉన్న మొత్తం 39 మంది గల్లంతైనట్లు తెలిసింది. సిబ్బందిలో 17 మంది చైనా జాతీయులు, 17 మంది ఇండోనేషియా, ఐదుగురు ఫిలిప్పీన్స్ నుంచి ఉన్నారు. గల్లంతైన సిబ్బంది ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఇప్పటికవవరకు ఒక్కరి జాడ లభించనట్లు సమాచారం.

Read Also: Quad Summit: బైడెన్‌ పర్యటన వాయిదా.. క్వాడ్ సమ్మిట్‌ను రద్దు చేసిన ఆస్ట్రేలియా

మంగళవారం తెల్లవారుజామున 3 గంటలకు (బీజింగ్ కాలమానం ప్రకారం) మధ్య హిందూ మహాసముద్రంలో చైనాకు చెందిన ఫిషింగ్ నౌక బోల్తా పడింది. నౌక బోల్తా పడటంతో చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ పూర్తి సహాయ చర్యలకు ఆదేశించారు. పరిస్థితిని ధృవీకరించడానికి, అదనపు రెస్క్యూ దళాలను మోహరించడానికి అత్యవసర ప్రతిస్పందన యంత్రాంగాన్ని వెంటనే మోహరించాలని చైనా వ్యవసాయ, గ్రామీణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, చైనా రవాణా మంత్రిత్వ శాఖ షాన్‌డాంగ్ ప్రావిన్స్‌ను ఆదేశించింది. అంతర్జాతీయ సముద్ర శోధన, రెస్క్యూ సహాయాన్ని సమన్వయం చేయాలని కూడా జిన్‌పింగ్‌ ఆదేశించారు. ప్రజల భద్రతను నిర్ధారించడానికి సుదూర ప్రాంత కార్యకలాపాలకు భద్రతా ప్రమాదం గురించి ముందస్తు హెచ్చరికలను బలోపేతం చేయాలని కూడా ఆయన ఆదేశించారు.

Exit mobile version