China : 16 ఏళ్ల క్రితం చైనాలో తలకిందులైన భూమి.. 87000 మంది మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
China : 16 ఏళ్ల క్రితం చైనాలో భయంకరమైన ప్రకృతి వైపరీత్యం నమోదైంది. 2008లో మే 12న కేవలం రెండు క్షణాలకే భూమి తలకిందులు కావడంతో చైనాలో 87 వేల మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రకృతి విపత్తులో చరిత్రలో అత్యంత భయంకరమైన భూకంపాలలో ఒకటిగా పరిగణించబడుతుంది. వేలాది మంది ప్రజలు తప్పిపోయారు. లక్షల మంది నిరాశ్రయులయ్యారు. అనేక ఇళ్ళు ధ్వంసమయ్యాయి. చాలా మంది ప్రజలు వీధుల్లోకి రావాల్సి వచ్చింది.
ఈ విపత్తులో భారీ ప్రాణ, ఆస్తి నష్టం జరిగింది. పరిహారం చెల్లించడానికి సంవత్సరాలు పట్టింది. ఈ భూకంపంలో 87 వేల మంది చనిపోగా, నాలుగు లక్షల మంది గాయపడ్డారు. మే 12, 2008న, చైనాలోని సిచువాన్ ప్రావిన్స్లో 7.9 తీవ్రతతో భూకంపం నమోదైంది. దాదాపు 2 నిమిషాల పాటు భూకంపం సంభవించింది. భూకంపం కేంద్రం సిచువాన్ ప్రావిన్స్ రాజధాని చెంగ్డూ నుండి 80 కిలోమీటర్ల దూరంలో ఉంది. దాని లోతు 19 కిలోమీటర్లుగా నమోదైంది.
Also Read
- Vaibhav Sooryavanshi: బుడ్డోడికి మళ్లీ నిరాశే.. ఇంగ్లండ్తో తొలి టీ20లోనూ 'నో ఛాన్స్'.!
- Pawan Kalyan: సోషల్ మీడియా దుర్వినియోగంపై ఉక్కుపాదం మోపుతాం.. ‘ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్’ పేరుతో దూషణలు ఇక కుదరవు.!
- US: అమెరికాలో విషాదం.. ఆకస్మిక వరదల్లో ఏపీ యువకుడు మృతి
- Ishan Kishan: ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్లో పేలిన పాకెట్ డైనమెట్.. నెం.1 బ్యాటర్గా ఇషాన్ కిషన్.!
Read Also:‘ఛలో ఏపీ’ అంటూ.. రాజకీయ నాయకుల తలరాతలు మార్చడానికి సిద్దమైన బెంగళూరు ఆంధ్ర ఓటర్లు..
6 నెలల పాటు ప్రకంపనలు
ఈ ప్రమాదకరమైన భూకంపం దేశ రాజధాని బీజింగ్, షాంఘైకి 1,500 – 1,700 కిలోమీటర్ల దూరంలో ఉంది. బ్యాంకాక్, థాయ్లాండ్, వియత్నాంలోని హనోయిలో కూడా భూకంపం సంభవించింది. ఈ భయంకరమైన భూకంపం తరువాత, దేశంలో ఆర్నెళ్ల పాటు అనేక ప్రకంపనలు సంభవించాయి. భూకంపం కారణంగా సుమారు 20 వేల కొండచరియలు విరిగిపడిన కేసులు నమోదయ్యాయి. భూకంపం కారణంగా కనీసం 4.8 మిలియన్ల మంది నిరాశ్రయులయ్యారు. 1976లో తాంగ్షాన్ భూకంపం తర్వాత చైనాలో సంభవించిన అత్యంత ప్రమాదకరమైన భూకంపం ఇదే.
80 శాతం భవనాలు ధ్వంసం
భూకంపం సంభవించిన 72 గంటల్లోనే 4.0 నుంచి 6.1 తీవ్రతతో 64 నుంచి 104 భారీ ప్రకంపనలు నమోదయ్యాయి. భూకంపం కారణంగా దాదాపు 80శాతం భవనాలు ధ్వంసమయ్యాయి. వెన్చువాన్ కౌంటీలోని యింగ్క్సియు నగరంలో మొత్తం 9,000 మంది జనాభాలో 2,300 మంది మాత్రమే ప్రాణాలతో బయటపడినట్లు రెస్క్యూ టీమ్ నివేదించింది. సిచువాన్లోని బీచువాన్ కౌంటీలో 3,000 నుండి 5,000 మంది మరణించారు. అక్కడ 10,000 మంది గాయపడ్డారు.
Read Also:Anil Ravipudi : వెంకీ మూవీ కోసం భారీ రెమ్యూనరేషన్ అందుకున్న అనిల్ రావిపూడి..?
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: బుడ్డోడికి మళ్లీ నిరాశే.. ఇంగ్లండ్తో తొలి టీ20లోనూ ‘నో ఛాన్స్’.!
-
ENG vs IND 1st T20: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్! ప్లేయింగ్ XI లో ఎవరెవరంటే?
-
Kayadu Lohar: అందుకే హిట్లున్నా లేకున్నా వరుస ఆఫర్లు!
-
Pawan Kalyan: సోషల్ మీడియా దుర్వినియోగంపై ఉక్కుపాదం మోపుతాం.. ‘ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్’ పేరుతో దూషణలు ఇక కుదరవు.!
-
US: అమెరికాలో విషాదం.. ఆకస్మిక వరదల్లో ఏపీ యువకుడు మృతి
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!
-
Fluffy Omelette: రెగ్యులర్ ఆమ్లెట్కు బదులుగా.. స్పాంజీలా ఉండే ‘ఫ్లఫీ ఆమ్లెట్’ చేసేయండి ఇలా.! లొట్టలేసుకుని తింటారంతే.!
-
Air Fryer vs Stove Cooking: ఎయిర్ ఫ్రయర్ Vs స్టవ్ వంట.. ఆరోగ్యానికి ఏది మంచిది.?
-
అందుబాటులోకి Aadhaar App కొత్త వెర్షన్..ఫేస్ ఆథెంటికేషన్, మొబైల్ నంబర్ అప్డేట్లతో పాటు మరిన్ని సేవలు.!