China: మరణశిక్షల్లో చైనా నయా రికార్డ్.. 30 రోజులు – 15 ఉరిశిక్షలు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
China: చైనా మరణశిక్షల అమలులో నయా రికార్డ్ను సృష్టించింది. ఈ రికార్డ్తో డ్రాగన్ దేశం సౌదీ అరేబియా, ఇరాన్లను అధిగమించింది. 2026 మొదటి నెలలో చైనా 15 మందికి మరణశిక్ష విధించింది. ఇదే టైంలో సౌదీ అరేబియా ఒక వ్యక్తిని ఉరితీసింది, ఇరాన్ ఎవరినీ ఉరితీయలేదు. 2025లో ఇరాన్, సౌదీ అరేబియా అత్యధిక దోషులను ఉరితీశాయి. సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ నివేదికల ప్రకారం.. మయన్మార్లో బై కుటుంబంతో సంబంధం కలిగి ఉన్న నలుగురు వ్యక్తులను ఒక కుంభకోణానికి సంబంధించి చైనా అధికారులు ఉరితీశారు. జనవరి 29న చైనా మింగ్ కుటుంబంతో సంబంధం ఉన్న 11 మంది వ్యక్తులను కూడా అక్కడి అధికారులు ఉరితీశారు.
Also Read
2025లో 356 మందికి ఉరిశిక్ష..
సౌదీ అరేబియా 2025లో 356 మందికి ఉరిశిక్ష విధించింది. ఇది ఒక దేశం ఏడాది కాలంలో విధించిన అత్యధిక ఉరిశిక్షల సంఖ్య. సౌదీ అరేబియా ప్రభుత్వ గణాంకాల ప్రకారం.. 2025లో మాదకద్రవ్యాలకు సంబంధించిన నేరాలకు 243 మందికి ఉరిశిక్ష విధించారు. మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా దేశం అనుసరిస్తున్న కఠినమైన విధానం కారణంగా ఈ ఉరిశిక్షల సంఖ్య గణీయంగా ఉందని నిపుణులు చెబుతున్నారు. 2024లో అమలు చేసిన ఉరిశిక్షలు 338 కంటే 2025లో అమలు చేసినవి ఎక్కువ. గతంలో దాదాపు మూడు సంవత్సరాల పాటు సౌదీ దేశంలో ఉరిశిక్షలను నిలిపి వేసిన తర్వాత, 2022 ఏడాది చివరిలో మాదకద్రవ్యాల నేరాలకు తిరిగి మరణశిక్షను ప్రవేశపెట్టింది.
2025లో అమలు చేసిన మరణశిక్షల పరంగా ఇతర దేశాలకు సంబంధించిన కచ్చితమైన గణాంకాలు అందుబాటులో లేవు. 2024లో ఇరాన్, ఇరాక్ రెండవ, మూడవ స్థానాల్లో ఉన్నాయి. పలు నివేదికల ప్రకారం.. 2024లో ఇరాన్లో 972 మందికి ఉరిశిక్ష అమలు చేయగా, ఇరాక్లో 63 మందికి ఉరిశిక్షలు విధించారు. చైనాలో అత్యధిక సంఖ్యలో మరణశిక్షలు అమలు చేశారని నమ్ముతారు, కానీ డ్రాగన్ దేశం వాస్తవిక అధికారిక గణాంకాలు ఎప్పుడూ చెప్పలేదు.
READ ALSO: IND vs PAK Match Refund: భారత్తో పాక్ మ్యాచ్ ఆడకపోతే.. ఫ్యాన్స్కు రీఫండ్ వస్తుందా?
తాజావార్తలు
-
Uttar Pradesh: అజాంఖాన్ డ్రీమ్ ప్రాజెక్ట్పై యోగి బుల్డోజర్ యాక్షన్..
-
Trump: ట్రంప్ చిత్రంతో బంగారు నాణెం విడుదల.. ప్రత్యేకత ఇదే
-
CM Chandrababu: అమరావతి 2.0 ఇంటిగ్రేటేడ్ మాస్టర్ ప్లాన్ పై సీఎం సమీక్ష.. ప్రపంచస్థాయి నగరంగా..!
-
Sutlej: సట్లజ్ వివాదం.. ZEE5పై చర్యలకు కేంద్రం సిద్ధం..
-
Deputy CM Pawan Kalyan: సీఎం రేవంత్ రెడ్డికి పవన్ కల్యాణ్ లేఖ.. షాబాద్ ఘటన ప్రస్తావన..
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!