China: మరణశిక్షల్లో చైనా నయా రికార్డ్.. 30 రోజులు – 15 ఉరిశిక్షలు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
China: చైనా మరణశిక్షల అమలులో నయా రికార్డ్ను సృష్టించింది. ఈ రికార్డ్తో డ్రాగన్ దేశం సౌదీ అరేబియా, ఇరాన్లను అధిగమించింది. 2026 మొదటి నెలలో చైనా 15 మందికి మరణశిక్ష విధించింది. ఇదే టైంలో సౌదీ అరేబియా ఒక వ్యక్తిని ఉరితీసింది, ఇరాన్ ఎవరినీ ఉరితీయలేదు. 2025లో ఇరాన్, సౌదీ అరేబియా అత్యధిక దోషులను ఉరితీశాయి. సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ నివేదికల ప్రకారం.. మయన్మార్లో బై కుటుంబంతో సంబంధం కలిగి ఉన్న నలుగురు వ్యక్తులను ఒక కుంభకోణానికి సంబంధించి చైనా అధికారులు ఉరితీశారు. జనవరి 29న చైనా మింగ్ కుటుంబంతో సంబంధం ఉన్న 11 మంది వ్యక్తులను కూడా అక్కడి అధికారులు ఉరితీశారు.
Also Read
- Harmanpreet Kaur: ‘చాలా సంతోషంగా ఉంది.. ఈ సీక్రెట్ ప్లాన్తో ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్కు వెళ్తాం’..
- Kitchen Cleaning Tips: వంటగది లైట్ స్విచ్లపై జిగురు మరకలా? 5 నిమిషాల్లో క్లీనింగ్కు సూపర్ టిప్స్
- Ind Vs Ban: బంగ్లాదేశ్పై భారత్ ఘన విజయం.. సెమీస్ రేసులో దూసుకెళ్లిన టీమిండియా..
- First T20 Captain: ధోని కాదు.. భారత్కు తొలి టీ-20 కెప్టెన్ ఎవరో తెలుసా..?
2025లో 356 మందికి ఉరిశిక్ష..
సౌదీ అరేబియా 2025లో 356 మందికి ఉరిశిక్ష విధించింది. ఇది ఒక దేశం ఏడాది కాలంలో విధించిన అత్యధిక ఉరిశిక్షల సంఖ్య. సౌదీ అరేబియా ప్రభుత్వ గణాంకాల ప్రకారం.. 2025లో మాదకద్రవ్యాలకు సంబంధించిన నేరాలకు 243 మందికి ఉరిశిక్ష విధించారు. మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా దేశం అనుసరిస్తున్న కఠినమైన విధానం కారణంగా ఈ ఉరిశిక్షల సంఖ్య గణీయంగా ఉందని నిపుణులు చెబుతున్నారు. 2024లో అమలు చేసిన ఉరిశిక్షలు 338 కంటే 2025లో అమలు చేసినవి ఎక్కువ. గతంలో దాదాపు మూడు సంవత్సరాల పాటు సౌదీ దేశంలో ఉరిశిక్షలను నిలిపి వేసిన తర్వాత, 2022 ఏడాది చివరిలో మాదకద్రవ్యాల నేరాలకు తిరిగి మరణశిక్షను ప్రవేశపెట్టింది.
2025లో అమలు చేసిన మరణశిక్షల పరంగా ఇతర దేశాలకు సంబంధించిన కచ్చితమైన గణాంకాలు అందుబాటులో లేవు. 2024లో ఇరాన్, ఇరాక్ రెండవ, మూడవ స్థానాల్లో ఉన్నాయి. పలు నివేదికల ప్రకారం.. 2024లో ఇరాన్లో 972 మందికి ఉరిశిక్ష అమలు చేయగా, ఇరాక్లో 63 మందికి ఉరిశిక్షలు విధించారు. చైనాలో అత్యధిక సంఖ్యలో మరణశిక్షలు అమలు చేశారని నమ్ముతారు, కానీ డ్రాగన్ దేశం వాస్తవిక అధికారిక గణాంకాలు ఎప్పుడూ చెప్పలేదు.
READ ALSO: IND vs PAK Match Refund: భారత్తో పాక్ మ్యాచ్ ఆడకపోతే.. ఫ్యాన్స్కు రీఫండ్ వస్తుందా?
తాజావార్తలు
-
Harmanpreet Kaur: ‘చాలా సంతోషంగా ఉంది.. ఈ సీక్రెట్ ప్లాన్తో ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్కు వెళ్తాం’..
-
HYDRAA : హైదరాబాద్ చెరువులకు హైడ్రా టచ్.. రూ.107 కోట్ల భారీ ప్రాజెక్ట్.!
-
Kitchen Cleaning Tips: వంటగది లైట్ స్విచ్లపై జిగురు మరకలా? 5 నిమిషాల్లో క్లీనింగ్కు సూపర్ టిప్స్
-
Ind Vs Ban: బంగ్లాదేశ్పై భారత్ ఘన విజయం.. సెమీస్ రేసులో దూసుకెళ్లిన టీమిండియా..
-
First T20 Captain: ధోని కాదు.. భారత్కు తొలి టీ-20 కెప్టెన్ ఎవరో తెలుసా..?
ట్రెండింగ్
-
Iron Box Cleaning : ఐరన్ బాక్స్ కింద మరకలా..? 5 నిమిషాల్లో కొత్తదానిలా..!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!