China: మరణశిక్షల్లో చైనా నయా రికార్డ్.. 30 రోజులు – 15 ఉరిశిక్షలు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
China: చైనా మరణశిక్షల అమలులో నయా రికార్డ్ను సృష్టించింది. ఈ రికార్డ్తో డ్రాగన్ దేశం సౌదీ అరేబియా, ఇరాన్లను అధిగమించింది. 2026 మొదటి నెలలో చైనా 15 మందికి మరణశిక్ష విధించింది. ఇదే టైంలో సౌదీ అరేబియా ఒక వ్యక్తిని ఉరితీసింది, ఇరాన్ ఎవరినీ ఉరితీయలేదు. 2025లో ఇరాన్, సౌదీ అరేబియా అత్యధిక దోషులను ఉరితీశాయి. సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ నివేదికల ప్రకారం.. మయన్మార్లో బై కుటుంబంతో సంబంధం కలిగి ఉన్న నలుగురు వ్యక్తులను ఒక కుంభకోణానికి సంబంధించి చైనా అధికారులు ఉరితీశారు. జనవరి 29న చైనా మింగ్ కుటుంబంతో సంబంధం ఉన్న 11 మంది వ్యక్తులను కూడా అక్కడి అధికారులు ఉరితీశారు.
Also Read
- Shocking Love Story: ముసలోడికి దసరా పండగ.. 22 ఏళ్ల యువతితో పెళ్లి చేసిన గ్రామస్తులు..
- Hyderabad: గుడ్డిగా నమ్మితే ప్రాణాలు గాల్లో కలిసినట్టేనా? హైదరాబాద్ మర్డర్ నేర్పిస్తున్న పాఠమిదేనా?
- Telangana : తెలంగాణ ఉద్యమకారులకు గుడ్న్యూస్.. ప్రభుత్వం కీలక నిర్ణయం..!
- CSK Vs LSG: లక్నో గ్రౌండ్లో కార్తీక్ శర్మ వీరవిహారం.. నిర్ణీత 20 ఓవర్లలో చెన్నై భారీ స్కోరు..
2025లో 356 మందికి ఉరిశిక్ష..
సౌదీ అరేబియా 2025లో 356 మందికి ఉరిశిక్ష విధించింది. ఇది ఒక దేశం ఏడాది కాలంలో విధించిన అత్యధిక ఉరిశిక్షల సంఖ్య. సౌదీ అరేబియా ప్రభుత్వ గణాంకాల ప్రకారం.. 2025లో మాదకద్రవ్యాలకు సంబంధించిన నేరాలకు 243 మందికి ఉరిశిక్ష విధించారు. మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా దేశం అనుసరిస్తున్న కఠినమైన విధానం కారణంగా ఈ ఉరిశిక్షల సంఖ్య గణీయంగా ఉందని నిపుణులు చెబుతున్నారు. 2024లో అమలు చేసిన ఉరిశిక్షలు 338 కంటే 2025లో అమలు చేసినవి ఎక్కువ. గతంలో దాదాపు మూడు సంవత్సరాల పాటు సౌదీ దేశంలో ఉరిశిక్షలను నిలిపి వేసిన తర్వాత, 2022 ఏడాది చివరిలో మాదకద్రవ్యాల నేరాలకు తిరిగి మరణశిక్షను ప్రవేశపెట్టింది.
2025లో అమలు చేసిన మరణశిక్షల పరంగా ఇతర దేశాలకు సంబంధించిన కచ్చితమైన గణాంకాలు అందుబాటులో లేవు. 2024లో ఇరాన్, ఇరాక్ రెండవ, మూడవ స్థానాల్లో ఉన్నాయి. పలు నివేదికల ప్రకారం.. 2024లో ఇరాన్లో 972 మందికి ఉరిశిక్ష అమలు చేయగా, ఇరాక్లో 63 మందికి ఉరిశిక్షలు విధించారు. చైనాలో అత్యధిక సంఖ్యలో మరణశిక్షలు అమలు చేశారని నమ్ముతారు, కానీ డ్రాగన్ దేశం వాస్తవిక అధికారిక గణాంకాలు ఎప్పుడూ చెప్పలేదు.
READ ALSO: IND vs PAK Match Refund: భారత్తో పాక్ మ్యాచ్ ఆడకపోతే.. ఫ్యాన్స్కు రీఫండ్ వస్తుందా?
తాజావార్తలు
-
Lift Accident : తెగిపడ్డ అపార్ట్మెంట్ లిఫ్ట్.. ఆరుగురు బీఆర్ఎస్ నాయకులకు గాయాలు.!
-
Off The Record : పొలిటికల్ డబుల్ యాక్షన్తో రోజా ఇరుకున పడ్డారా?
-
Shocking Love Story: ముసలోడికి దసరా పండగ.. 22 ఏళ్ల యువతితో పెళ్లి చేసిన గ్రామస్తులు..
-
Story Board : ఫ్యూచర్ కోసం ఆర్థిక సూత్రం..? సంక్షోభం ముంచుకొచ్చాక ప్రభుత్వం మేల్కోందా ?
-
Hyderabad: గుడ్డిగా నమ్మితే ప్రాణాలు గాల్లో కలిసినట్టేనా? హైదరాబాద్ మర్డర్ నేర్పిస్తున్న పాఠమిదేనా?
ట్రెండింగ్
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..