IND vs PAK Match Refund: భారత్తో పాక్ మ్యాచ్ ఆడకపోతే.. ఫ్యాన్స్కు రీఫండ్ వస్తుందా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IND vs PAK Match Refund: T20 ప్రపంచ కప్ మరికొన్ని రోజుల్లో ప్రారంభం కానుంది. ఈ క్రమంలో పాకిస్థాన్ ఫిబ్రవరి 15న భారత్తో మ్యాచ్ ఆడకూడదని ప్రకటించి, T20 ప్రపంచ కప్లో కలకలం రేపింది. పాక్ తీసుకున్న ఈ నిర్ణయంతో టోర్నమెంట్ భాగస్వాములందరికీ (ICC, BCCI, స్పాన్సర్లు) పెద్ద మొత్తంలో నష్టాలు రావడమే కాకుండా, ఈ ‘మెగా మ్యాచ్’ చూడటానికి ముందుగానే టిక్కెట్లు కొనుగోలు చేసిన వేలాది మంది అభిమానులకు ఆందోళన కలిగిస్తుంది. పాకిస్థాన్ ప్రకటన తర్వాత, భారత్- పాక్ మ్యాచ్ను చూడటానికి ముందు గానే టికెట్లు కొనుగోలు చేసిన అభిమానులు ఇప్పుడు తమ డబ్బులు తిరిగి వస్తాయో లేదో అని ఆందోళన పడుతున్నారు. ఇంతకీ ఈ విషయంలో ICC నియమాలు ఏమి చెబుతున్నాయో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
READ ALSO: T20 World Cup 2026: భారత్ మ్యాచ్ బాయ్కాట్ తర్వాత, పాకిస్తాన్ ‘ఈమెయిల్’ డ్రామా..
Also Read
- Karnataka Politics: కర్ణాటక రాజకీయంలో హైడ్రామా.. కేబినెట్ కొలువుదీరిన కొద్దిరోజులకే మంత్రి రాజీనామా!
- వరల్డ్ కప్ గెలిచినా అసలు ట్రోఫీ దక్కదట.! 'FIFA World Cup' గురించి తెలియని విషయాలు మీకోసం..
- 2000 vs 2026: పెట్రోల్ రూ. 26, సిలిండర్ రూ.157.. ఈ 26 ఏళ్లలో నిత్యావసరాల ధరలు ఎంత పెరిగాయో తెలుసా?
- Pat Cummins: "ఆ పిల్లాడు గ్రౌండ్లో కాదు.. స్కూల్లో ఉంటే బాగుండేది".. వైభవ్ విధ్వంసంపై SRH కెప్టెన్ కమిన్స్ ఆసక్తికర వ్యాఖ్యలు..
ICC టికెట్ రీఫండ్ పాలసీ..
ICC టికెట్ రీఫండ్ పాలసీ ప్రకారం.. కొన్ని పరిస్థితులలో మాత్రమే మీ టికెట్కు పూర్తి వాపసు లభిస్తుంది.
1. టాస్ లేకుండా మ్యాచ్ రద్దు చేస్తే, టిక్కెట్లు బుక్ చేసుకున్న అభిమానులకు వారి పూర్తి డబ్బు తిరిగి ఇస్తారు.
2. గ్రూప్ దశ లేదా సూపర్ 8 రౌండ్ ముగిసేలోపు ఐదు ఓవర్ల ముందు మ్యాచ్ రద్దు అయితే, ప్రేక్షకులకు వారి టిక్కెట్ల డబ్బులను పూర్తిగా వాపసు ఇస్తారు.
3. సెమీ-ఫైనల్ లేదా ఫైనల్ మ్యాచ్ 10 ఓవర్లకు ముందే రద్దు చేస్తే, మ్యాచ్ ఫలితం రాకపోతే, మీ టికెట్ డబ్బులు పూర్తిగా తిరిగి చెల్లిస్తారు.
ఈ పరిస్థితులలో నో వాపసు..
1. గ్రూప్ దశలో లేదా సూపర్ 8 రౌండ్లో ఐదు ఓవర్ల కంటే ఎక్కువ ఆడి మ్యాచ్ నిర్ణయం కాకపోతే, డబ్బు తిరిగి ఇవ్వరు.
2. సెమీ-ఫైనల్ లేదా ఫైనల్ 10 లేదా అంతకంటే ఎక్కువ ఓవర్లు ఉండి ఫలితం రాకపోతే, టికెట్ డబ్బులు తిరిగి చెల్లించరు.
3. ఏదైనా మ్యాచ్ ఫలితం అధికారికంగా ప్రకటించకపోయినా, ప్రేక్షకులకు డబ్బులు రిటన్ చేయరు.
4. మ్యాచ్ను తిరిగి షెడ్యూల్ చేస్తే, ముందుగా తీసుకున్న టికెట్ మళ్లీ మ్యాచ్ జరిగే తేదీ వరకు చెల్లుతుంది.
మీకు ఎన్ని డబ్బులు వస్తాయి..
టికెట్ ధరను తిరిగి చెల్లించేటప్పుడు, కొనుగోలుదారుకు కన్వీనియన్స్ ఫీజు చెల్లించరు. ఇది టికెట్ ధరలో 10-15 శాతం ఉంటుంది. ఇంకా బుకింగ్ ఛార్జీ (50-200 రూపాయలు), ప్లాట్ఫామ్ ఫీజులు మారుతూ ఉంటాయి. ఉదాహరణకు మీ టికెట్ ధర ఐదు వేల రూపాయలు అయితే, మీరు రూ.750 కన్వీనియన్స్ ఫీజు, రూ.100 బుకింగ్ ఛార్జీతో సహా రూ.5,850 చెల్లించాలి, కానీ ఆ మ్యాచ్ జరగకపోతే మీకు రూ.5 వేలు మాత్రమే తిరిగి పొందుతారు.
READ ALSO: The Paradise: ‘ది ప్యారడైజ్’ లో కొత్త ట్విస్ట్ .. మోహన్ బాబు విలన్ కాదా!
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi Record: వైభవ్ సూర్యవంశీకి గుడ్న్యూస్.. ఇక క్రికెట్ దిగ్గజం సచిన్ రికార్డు బద్దలే!
-
RBI MPC 2026: ఆర్బీఐ కీలక నిర్ణయం.. రెపో రేటు 5.25% వద్ద యథాతథం.. లక్షలాది మంది రుణగ్రహీతలకు ఊరట
-
Karnataka Politics: కర్ణాటక రాజకీయంలో హైడ్రామా.. కేబినెట్ కొలువుదీరిన కొద్దిరోజులకే మంత్రి రాజీనామా!
-
వరల్డ్ కప్ గెలిచినా అసలు ట్రోఫీ దక్కదట.! ‘FIFA World Cup’ గురించి తెలియని విషయాలు మీకోసం..
-
Ather Rizta Price Hike: పెరిగిన ఏథర్ రిజ్టా ధరలు.. ఏ వేరియంట్పై ఎంత ధర పెరిగిందో తెలుసా?
ట్రెండింగ్
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..