Chilipi Krishnudu: నలభై ఐదేళ్ళ’చిలిపి కృష్ణుడు’
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సురేశ్ ప్రొడక్షన్స్కు, నటసమ్రాట్ అక్కినేని నాగేశ్వరరావుకు ఉన్న అనుబంధం ప్రత్యేకమైనది. యన్టీఆర్ ‘రాముడు-భీముడు’తో మొదలైన సురేశ్ సంస్థ ఏయన్నార్ తో తొలిసారి ‘సిసాయి చిన్నయ్య’ నిర్మించింది. ఆ పై సురేశ్ అధినేత డి.రామానాయుడు కొన్ని పరాజయాలు చవిచూశారు. ఆ సమయంలో రామానాయుడు చిత్రసీమలో ఉండడమో, ఊరికి వెళ్ళడమో అనుకున్నప్పుడు ఏయన్నార్ తో నిర్మించిన రంగుల చిత్రం ‘ప్రేమనగర్’ ఘనవిజయం సాధించింది. అప్పటి నుంచీ ఏయన్నార్, శోభన్ బాబుతో చిత్రాలు నిర్మిస్తూ సాగారు రామానాయుడు. ఏయన్నార్ హృదయ శస్త్ర చికిత్స తరువాత నటించిందీ సురేశ్ సంస్థ నిర్మించిన ‘సెక్రటరీ’లోనే! ఆ తరువాత ఏయన్నార్ తో సురేశ్ సంస్థ తెరకెక్కించిన ‘చిలిపికృష్ణుడు’ సైతం జనాన్ని భలేగా అలరించింది. 1978 జనవరి 11న ‘చిలిపి కృష్ణుడు’ విడుదలయింది.
‘చిలిపి కృష్ణుడు’ కథ ఏమిటంటే- డాక్టర్ కృష్ణ, డాక్టర్ వాణి మెడిసిన్ చదువుతున్న రోజుల్లోనే ప్రేమించుకుంటారు. పెళ్ళాడాలనీ ఆశిస్తారు. అయితే కొంతమంది దుర్మార్గులు వాణిని రేప్ చేస్తారు. చనిపోతూ, తన కుటుంబ పరిస్థితులు చెబుతుంది. అలాగే తన ఊరిలోని పేదవారికి ఉచిత వైద్య అందించాలన్నదీ తన కల అంటుంది. వాటిని నెరవేర్చడానికి కృష్ణ, వాణి ఊరెళతాడు. అక్కడ అచ్చు వాణి పోలికలతో ఉన్న ఆమె చెల్లెలు రాణి కనిపిస్తుంది. ఆమెను తీర్చిదిద్దుతాడు. అలాగే ఊరిలో ఆసుపత్రి నెలకొల్పి పేదవారికి కృష్ణ వైద్యసేవలు అందిస్తూ ఉంటాడు. దాంతో ఆ ఊరిలో నాగలింగం అనే నాటు వైద్యుడు, కృష్ణకు పలు విధాలా అడ్డు తగలుతాడు. కానీ, జనం కృష్ణ వైద్యం కోసమే పరుగు తీస్తూ ఉంటారు. వాణి జీవితం నాశనం కావడానికి కారణమైన రాజా ప్రమాదానికి గురై ఆ ఊరికి వస్తాడు. అతని భార్య కూడా చేరుకుంటుంది. నాగలింగం వైద్యంతో రాజా ప్రాణానికే ముప్పు వస్తుంది. రాజాను ఆయన భార్య కృష్ణ దగ్గరకు తీసుకు వస్తుంది. కృష్ణకు, రాజా ఎవరో తెలుసు. కానీ, వృత్తిధర్మంగా అతనికి వైద్యం చేస్తాడు. అప్పుడే రాజా తప్పిపోయిన తన అన్న విషయం కృష్ణకు తెలుస్తుంది. రాజా కూడా పశ్చాత్తాపంతో తన తప్పు క్షమించమంటాడు. రాణి తల్లి పెద్దకూతురు వాణిని చూడాలంటుంది. దాంతో రాణినే వాణిగా నటింప చేస్తాడు కృష్ణ. అదే సమయంలో రాజాను, అతని భార్యను పోలీసుల బారి నుండి కృష్ణ దాచిపెట్టి రక్షిస్తూ ఉంటాడు. నాగలింగం ఈ విషయాలు తెలుసుకొని అల్లరి చేస్తాడు. కానీ, తన అన్న కుటుంబాన్ని కాపాడడానికి కృష్ణ మౌనం వహిస్తాడు. వాణి మరణించిందన్న విషయం తెలుస్తుంది. అందరూ కృష్ణ వల్లే ఆమె చనిపోయిందని నమ్ముతారు. కానీ, రాణి అసలు నేరస్థుడైన రాజాను బయటకు తెస్తుంది. కృష్ణ మంచితనాన్ని, ఆయన తండ్రి కూడా వచ్చి అందరికీ చెబుతాడు. చివరకు రాజా పోలీసులకు లొంగిపోతాడు. అతని భార్య లక్ష్మి బాధ్యతను తన కుటుంబానికి అప్ప చెబుతాడు రాజా. చివరకు కృష్ణ, రాణి ఒక్కటవ్వడంతో కథ ముగుస్తుంది.
Also Read
- Piyush Goyal: అందరం కలిసి ముందుకెళ్లాల్సిన సమయం వచ్చింది.. పరిశ్రమలకు పీయూష్ గోయల్ హెచ్చరిక
- Story Board : ప్రధాని మోడీ స్పీచ్ దారి తప్పిందా ? ఏదో చెప్పాలని..ఇంకేదో చెప్పారా ?
- NEET Paper Leak: రూ. 10 లక్షలకు కొని, రూ. 15 లక్షలకు అమ్మకం.. నీట్ పేపర్ లీక్ కేసులో నిందితుడి అరెస్ట్..
- KCR : బీఆర్ఎస్ సభ్యత్వ నమోదులో డిజిటల్ విప్లవం.. ఎర్రవెల్లిలో కేసీఆర్ సుదీర్ఘ మంతనాలు.!
ఏయన్నార్ సరసన వాణిశ్రీ నాయికగా నటించిన ఈ చిత్రంలో సత్యనారాయణ, గుమ్మడి, ప్రభాకర్ రెడ్డి, రావు గోపాలరావు, రాజబాబు, అల్లు రామలింగయ్య, కె.వి.చలం, కె.కె.శర్మ, సిహెచ్.కృష్ణమూర్తి, చిట్టిబాబు, శాంతకుమారి, సూర్యకాంతం, రమాప్రభ, రాధాకుమారి, ఫటాఫట్ జయలక్ష్మి, శుభ ముఖ్యపాత్రధారులు. వి.సి.గుహనాథన్ కథ అందించిన ఈ చిత్రానికి ఆచార్య ఆత్రేయ మాటలు రాశారు. కేవీ మహదేవన్ బాణీలు కూర్చిన ఈ చిత్రానికి ఆత్రేయ, వేటూరి సాహిత్యం సమకూర్చారు. “చీరలెత్తు కెళ్ళాడా చిన్నికృష్ణుడు…”, “గోవిందా గోవిందా…”, “ఎళ్ళొస్తానోయ్ మామా మళ్ళొస్తానోయ్…”, “కాటుకెట్టి బొట్టు పెట్టి…”, “నేర్చుకో నేర్పుతానూ నేర్చుకో…”, “ఇందుకేనా విధి ముందుగ నీకు తెలిసేనా…” అంటూ సాగే పాటలు ఆకట్టుకున్నాయి.
‘చిలిపికృష్ణుడు’ చిత్రం 1978 సంక్రాంతి విజేతగా నిలచింది. రజతోత్సవం చూసిందీ సినిమా. ‘చిలిపికృష్ణుడు’కు బోయిన సుబ్బారావు దర్శకత్వం వహించారు. అంతకు ముందు రామానాయుడు నిర్మించిన ‘సావాసగాళ్ళు’తోనే బోయిన సుబ్బారావు దర్శకునిగా పరిచయం అయ్యారు. తరువాత ఈ సినిమాను హిందీలో రామానాయుడు ‘బందిష్’ పేరుతో రాజేశ్ ఖన్నా, హేమామాలిని జంటగా తెరకెక్కించారు. ‘బందిష్’ చిత్రానికి కె.బాపయ్య దర్శకత్వం వహించారు.
తాజావార్తలు
-
SRH vs GT : గుజరాత్ ధాటికి సన్రైజర్స్ కుప్పకూలింది.. 86 పరుగులకే ఆలౌట్.!
-
Off The Record : ఆపరేషన్ ఆకర్ష్ రివర్స్? టీడీపీ నేతలపై వైసీపీ కన్ను.. ఏపీ రాజకీయాల్లో కొత్త మలుపు!
-
Piyush Goyal: అందరం కలిసి ముందుకెళ్లాల్సిన సమయం వచ్చింది.. పరిశ్రమలకు పీయూష్ గోయల్ హెచ్చరిక
-
Anjali Sardana: 23 ఏళ్ల యువతి.. రూ.1700 కోట్ల సామ్రాజ్యం!
-
Story Board : ప్రధాని మోడీ స్పీచ్ దారి తప్పిందా ? ఏదో చెప్పాలని..ఇంకేదో చెప్పారా ?
ట్రెండింగ్
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!
-
Met Gala 2026 : బంగారు కాళ్లతో మెరిసిన మోడల్.. ప్రాణాల మీదకు తెచ్చిన ఆ ఒక్క పొరపాటు.!
-
క్లచ్ లేకుండానే గేర్ మార్పులు.. ఈ-క్లచ్ టెక్నాలజీతో Honda NX500 లాంచ్..
-
స్టైలిష్ లుక్ + పవర్ ఫుల్ బ్యాటరీతో లాంచ్ కు సిద్దమైన Realme 16T 5G.!
-
TVK Floor Test: మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు.. బలపరీక్షకు ముందే టీవీకేకు కోలుకోలేని దెబ్బ!