Drinker : తాగకు కొడుకా.. అన్నందుకు తండ్రిని త్రిశూలంతో పొడిచాడు
Drinker : ఓ యువకుడు రోజూ మద్యం సేవించి ఇంట్లో గొడవపడేవాడు. కొడుకును మద్యం తాగొద్దని తండ్రి మందలించాడు. ఆ విషయంలో యువకుడికి కోపం వచ్చింది. పరిగెత్తుకెళ్లి గుళ్లో త్రిశూలం తెచ్చి పొడిచి చంపేశాడు. ఈ ఘటన ఛత్తీస్గఢ్లోని రాజ్నంద్గావ్ జిల్లాలో జరిగింది. మద్యం తాగడం మంచిది కాదని చెప్పిన ఓ తండ్రిని కన్న కొడుకే చంపాడు. దుఖు రామ్(61), ఖేమ్లాల్ తండ్రీ కొడుకులు.
Read Also: Graeme Swann : నాగిని డ్యాన్స్ చేసిన గ్రేన్ స్వాన్
Also Read
- Navjot Kaur Sidhu: రాఘవ్ చద్దా బీజేపీలో చేరడానికి ప్రియాంక చోప్రానే కారణం.. అసలు కథ ఇదేనా?
- యష్ ‘టాక్సిక్’కు ఓటీటీ టెన్షన్..
- Mahabubabad: దారుణం.. ఇద్దరు కుమారులకు ఉరేసి, తానూ ఆత్మహత్య చేసుకున్న తండ్రి..
- Ashwini Vaishnaw: విశాఖపట్నం ఇక ఏఐపట్నం.. దక్షిణాది రాష్ట్రాలకు పూర్తి న్యాయం.. అమరావతి నుంచి త్వరలోనే బుల్లెట్ ట్రైన్..
మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలో ఖేమ్లాల్ కూలీగా పనిచేస్తున్నాడు. ప్రస్తుతం సెలవుపై స్వగ్రామానికి వెళ్లాడు. అంతకు ముందే ఖేమ్లాల్ మద్యానికి బానిసయ్యాడు. నాసిక్ నుంచి వచ్చిన తర్వాత రోజూ మద్యం తాగి ఇంటికి వచ్చేవాడు. మద్యానికి బానిస కావడంతో ఇంట్లో తరచూ గొడవలు జరిగేవి. ఆదివారం రాత్రి గ్రామంలోని శిత్లా దేవి గుడి సమీపంలో దుఖ్ రామ్ కూర్చున్నాడు. ఈ సమయంలో ఖేమ్లాల్ మద్యం తాగి అక్కడికి వచ్చి వారితో గొడవకు దిగాడు.
Read Also: Amritpal Singh: భింద్రన్వాలేగా కనిపించేందుకు సర్జరీ.. అమృత్పాల్ సింగ్ కేసులో సంచలన విషయాలు
దుఖు రామ్ మద్యం తాగవద్దని కొడుకును మందలించాడు. అయితే ఈ విషయంపై అతడికి కోపం వచ్చింది. గుడిలోకి పరుగెత్తి త్రిశూలాన్ని తీసుకుని తండ్రి ఛాతీపై కొట్టాడు. దుఖు రామ్ అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి ఘటనపై దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడైన ఖేమ్లాల్ వర్మని పోలీసులు అరెస్ట్ చేశారు.
తాజావార్తలు
-
Navjot Kaur Sidhu: రాఘవ్ చద్దా బీజేపీలో చేరడానికి ప్రియాంక చోప్రానే కారణం.. అసలు కథ ఇదేనా?
-
యష్ ‘టాక్సిక్’కు ఓటీటీ టెన్షన్..
-
Mahabubabad: దారుణం.. ఇద్దరు కుమారులకు ఉరేసి, తానూ ఆత్మహత్య చేసుకున్న తండ్రి..
-
Ashwini Vaishnaw: విశాఖపట్నం ఇక ఏఐపట్నం.. దక్షిణాది రాష్ట్రాలకు పూర్తి న్యాయం.. అమరావతి నుంచి త్వరలోనే బుల్లెట్ ట్రైన్..
-
Mumbai: దారుణం.. కల్మా పఠించలేదని ఇద్దరు సెక్యూరిటీ గార్డులపై దాడి.. రంగంలోకి ఏటీఎస్
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!