IAS Officer: అబ్బా అన్ని వందల కోట్లా.. మనోడు చేయి తిరిగినోడే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IAS Officer: దేశంలో అత్యున్నత పోస్టులు ఐఏఎస్, ఐపీఎస్. ఎంతో బాధ్యతగా.. మరెందరికో ఆదర్శంగా నిలవాల్సిన ఐఏఎస్ ఆఫీసర్ అడ్డదారులకు అలవాటుపడ్డాడు. డబ్బు సంపాదనే ధ్యేయంగా వందల కోట్ల నగదును వెనకేసుకున్నాడు. కేవలం 16నెలల్లోనే దాదాపు 500కోట్లు వెనకేశాడంటే మనోడి పనితనం ఏమేరకు ఉందో అర్థమవుతుంది. కానీ చివరికి ఈడీ సోదాల్లో అడ్డంగా బుక్కయి జైలుపాలయ్యాడు. ఈ మనీలాండరింగ్లో కేసులో సదరు ఐఏఎస్తోపాటు మరో ఇద్దరు ఐఏఎస్లను ఈడీ అరెస్టు చేసింది. వివరాల్లోకి వెళితే..
సమీర్ విష్ణోయ్ 2009 బ్యాచ్ ఐఎఎస్ అధికారి. ఛత్తీస్గఢ్ జియాలజీ అండ్ మైనింగ్ డిపార్ట్మెంట్ డైరెక్టర్గా ఉన్నప్పుడు జారీ చేసిన నోటిఫికేషన్తో బొగ్గు రవాణా ద్వారా అక్రమంగా డబ్బు సంపాదనకు దార్లు తెరిచారు. బొగ్గు రవాణా కోసం ఆన్లైన్లో కాకుండా మాన్యువల్గా అనుమతులు తీసుకోవాంటూ నోటిఫికేషన్ జారీ చేశారు. దీంతో గనుల నుంచి బొగ్గును తరలించేందుకు గనుల మంత్రిత్వశాఖ ఆఫీసు నుంచి నో అబ్జక్షన్ సర్టిఫికేట్ అనుమతులు తీసుకోవడం అనివార్యమైంది. ఇదే అదనుగా భావించిన సూర్యకాంత్ తివారీ ఎవరికి రవాణా అనుమతులు కావాలన్నా టన్నుకు రూ.25 చొప్పున వసూలు చేయడం ప్రారంభించాడు. ఇలా గడిచిన 16 నెలల్లో రూ.500 కోట్లకుపైగా కూడబెట్టినట్లు ఐటీ డాక్యుమెంట్లు చూపుతున్నాయి. ఈ మొత్తాన్ని రాజకీయ నాయకులు, ఇతర అధికారులకు పంపిణీ అయ్యినట్లు ఆరోపణలు వస్తున్నాయి.
Also Read
- Sitanshu Kotak: "వైభవ్ కోసం పాతోళ్లను తీసేయలేం".. బుడ్డోడి ప్లేయింగ్-11 ఛాన్స్పై కోచ్ సంచలన ప్రకటన..
- Nandini Reddy: ‘మా ఇంటి బంగారం’ షూటింగ్లోనే సమంత ప్రెగ్నెంట్.. ఆ సీక్రెట్ నాకు మాత్రమే తెలుసు!
- Varanasi: వారణాసిపై ఒక్క హింట్ కూడా ఇవ్వలేదు బాబోయ్.. నెట్ఫ్లిక్స్ వీపీ మోనికా ఆసక్తికర వ్యాఖ్యలు!
- BSNL మాస్టర్ స్ట్రోక్.! అన్లిమిటెడ్ కాలింగ్, డేటా మాత్రమే కాదు.. OTT సబ్స్క్రిప్షన్స్ కూడా..
Read Also: Kerala: కేరళ “నరబలి” కేసులో ట్విస్ట్.. నిందితులు మా పార్టీ కాదంటున్న సీపీఎం
ఈడీ సోదాల్లో సమీర్ విష్ణోయ్ ఇంటి నుంచి రూ.47 లక్షల నగదు, రూ.21 లక్షల విలువైన ఇతర డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ విధంగా ఆర్జించగా వచ్చిన సొమ్ముతో సమీర్ విష్ణోయ్ భార్య ప్రీతి గోదారా పెద్ద మొత్తంలో ఆస్తులు, ఖరీదైన ఆభరణాలు కొనుగోలు చేసినట్లు అంగీకరించింది. ఈ కేసులో మరో నిందితుడైన సునీల్ అగర్వాల్కు, సూర్యకాంత్ తివారీతో 10-15 ఏళ్లకు పైగా పరిచయం ఉంది. వీరిద్దరు కూడా ఐఏఎస్ అధికారులే. సూర్యకాంత్ తివారీకి చెందిన సంస్థ నుంచి రూ. 50 కోట్లకు రెండు వాషరీలను సునీల్ అగర్వాల్ కొనుగోలు చేశాడు. ఈ కేసులో మరో కీలక విషయం ఏంటంటే.. సత్య పవర్ అండ్ ఇస్పాట్ లిమిటెడ్ అండ్ ఇండస్ ఉద్యోగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ యజమానులను బలవంతం చేసి సునీల్ అగర్వాల్కు విక్రయించడానికి రెండు నెలల ముందే సూర్యకాంత్ ఈ వాషరీలను కొనుగోలు చేశాడు. అక్రమంగా సంపాదించిన డబ్బును సూర్యకాంత్ వీటికి ఖర్చు పెట్టాడు. ఈ కొనుగోలు విషయంలో సునీల్ అగర్వాల్, సూర్యకాంత్ తివారీకి సహాయం చేశాడు. ఈ ముగ్గురితోపాటు మరో ముగ్గురిని కూడా ఈడీ అధికారులు అరెస్టు చేశారు.
తాజావార్తలు
-
Vishnu Vishal : నాలుగేళ్లుగా ఆ వ్యాధితో పోరాడుతున్నా.. హీరో విష్ణు విశాల్ ఎమోషనల్
-
Samsung Galaxy A27 5G: సామ్ సంగ్ గెలాక్సీ A27 5G రిలీజ్.. 5,000mAh బ్యాటరీ, 6.7-ఇంచెస్ AMOLED డిస్ప్లే
-
Sitanshu Kotak: “వైభవ్ కోసం పాతోళ్లను తీసేయలేం”.. బుడ్డోడి ప్లేయింగ్-11 ఛాన్స్పై కోచ్ సంచలన ప్రకటన..
-
Nandini Reddy: ‘మా ఇంటి బంగారం’ షూటింగ్లోనే సమంత ప్రెగ్నెంట్.. ఆ సీక్రెట్ నాకు మాత్రమే తెలుసు!
-
Baahubali 3 Announced: ఇండియన్ సినీ ప్రియులకు బిగ్ సర్ప్రైజ్.. ‘బాహుబలి 3′ వస్తోంది!
ట్రెండింగ్
-
BSNL మాస్టర్ స్ట్రోక్.! అన్లిమిటెడ్ కాలింగ్, డేటా మాత్రమే కాదు.. OTT సబ్స్క్రిప్షన్స్ కూడా..
-
Viral Video: ఎవరయ్యా ఈయన.. మద్యం మత్తులో 11KV విద్యుత్ స్తంభం ఎక్కి తీగలపై పడుకున్నాడు.!
-
Iron Box Cleaning : ఐరన్ బాక్స్ కింద మరకలా..? 5 నిమిషాల్లో కొత్తదానిలా..!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!