Cherlapally Drug Case: దేశవ్యాప్తంగా నెట్వర్క్ ఉందా?.. చాలా మంది పెద్ద మనుషులు ఉన్నారా?
- చర్లపల్లి డ్రగ్ కేసులో పట్టుబడ్డ వోలేటి శ్రీనివాస్, విజయ్
- శ్రీనివాస్, విజయ్కి దేశవ్యాప్తంగా నెట్వర్క్ ఉందా?
- ముంబై కోర్టులో పోలీసులు ఏం వాదించారు?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చర్లపల్లి డ్రగ్ కేసులో పట్టుబడ్డ వోలేటి శ్రీనివాస్, విజయ్కి దేశవ్యాప్తంగా నెట్వర్క్ ఉందా?. అమెరికా కంపెనీ కోసం ఫార్మాస్యూటికల్ డ్రగ్స్ తయారు చేస్తున్నాడనే వాదనలో నిజమెంత?, ముంబై కోర్టులో పోలీసులు ఏం వాదించారు?.
చర్లపల్లిలో మెఫిడ్రిన్ డ్రగ్స్ వ్యవహారం.. ఇప్పుడు ముంబైకి షిఫ్ట్ అయింది. ఈ కేసులో వాగ్దేవి ఫార్మా యజమాని వోలేటి శ్రీనివాస్తో పాటు వోలేటి విజయ్, మరో వ్యక్తి తానాజీని పోలీసులు ముంబైకి తరలించారు. వారిని కోర్టులో హాజరు పరిచారు. అంతే కాదు.. 15 రోజులు పోలీస్ కస్టడీకి ఇవ్వాలని ముంబై పోలీసులు కోర్టును అభ్యర్థించారు.
Also Read
- SBI Loans: ఎస్బీఐ ఖాతాదారులకు శుభవార్త.. UPI చెల్లింపుల ఆధారంగా కూడా రుణాలు మంజూరు..
- Modi-Jinping: అరుదైన ఖనిజాలు, వాణిజ్య లోటు.. మోడీ-జిన్పింగ్ భేటీలో కీలకాంశాలు..
- Notification Cancelled: నిరుద్యోగులకు అలర్ట్.. TGPSC నుంచి విడుదలైన ఆ నోటిఫికేషన్ రద్దు..
- Botsa Satyanarayana Emotional: మరోసారి బొత్స కన్నీళ్లు.. అమర్నాథ్ వ్యాఖ్యలతో కన్నీటి పర్యంతం
మరోవైపు ఈ కేసులో పట్టుబడ్డ వోలేటి శ్రీనివాస్.. తాను నిర్దోషినని చెప్పే ప్రయత్నం చేశాడు. చర్లపల్లి కెమికల్ ఫ్యాక్టరీలో కేవలం రీసెర్చ్ చేస్తానన్నాడు. అమెరికాకు సంబంధించిన ఒక కంపెనీ కోసం తాను పనిచేస్తున్నట్లు చెప్పుకొచ్చాడు. ఆ కంపెనీకి కావాల్సిన డ్రగ్స్ కోసమే రీసర్చ్ చేస్తున్నట్లు తెలిపాడు. అంతే కానీ డ్రగ్స్ తయారు చేయడం లేదని బుకాయించే ప్రయత్నం చేశాడు. డ్రగ్స్ తయారీకి కావాల్సిన ముడి సరుకు నా దగ్గర లేదని చెప్పాడు.
చర్లపల్లి వాగ్దేవి ఫార్మా కంపెనీ యజమాని శ్రీనివాస్ వోలేటిని మీరా భయందర్ పోలీసులు కోర్టులో హాజరు పరిచారు. డ్రగ్స్ తయారు చేస్తున్న తానాజీ తోపాటు విజయ్ని కోర్టులో హాజరుపరచగా 15 రోజులపాటు రిమాండ్కు తరలించారు. వీళ్లతోపాటు దాదాపు 50 వేల లీటర్ల కెమికల్స్, 950 కిలోల డ్రగ్ పౌడర్ను కూడా కోర్టు ముందు ఉంచారు. ఈ కేసులో ఇంకా చాలామంది ఉన్నారని.. ఈ కేసులో నిందితులకు దేశవ్యాప్తంగా నెట్వర్క్ ఉందని పోలీసుల తరఫు న్యాయవాదులు వాదించారు. ముంబై కేంద్రంగా డ్రగ్స్ దందా చేస్తున్నారని తెలిపారు.
మరోవైపు ఈ కేసులో ముంబై పోలీసులు మొదటి నుంచి చాలా చాకచక్యంగా వ్యవహరించారు. ఫాతిమా అనే మహిళ ద్వారా హైదరాబాద్లో డ్రగ్స్ తయారీ గురించి వారికి పక్కా సమాచారం అందింది. దీంతో అక్కడి నుంచి ఫాతిమాను హైదరాబాద్ పంపించారు. ఆమె ఓ సాధారణ పర్యాటకురాలిగా హైదరాబాద్ వచ్చి.. 200 గ్రాముల మెఫిడ్రిన్ను ముంబై తీసుకెళ్లింది. తర్వాత ముంబై పోలీసులు డెకాయ్ ఆపరేషన్ నిర్వహించి చర్లపల్లిలో డ్రగ్ రాకెట్ భరతం పట్టారు. ఈ కేసుతో ఈగల్, రాచకొండ పోలీసులు, ఎక్సైజ్ విభాగం అధికారులు అప్రమత్తమయ్యారు. ఈ ఆపరేషన్ ఇంకా కొనసాగుతుందని ఇందులో చాలా పెద్ద మనుషులు ఉన్నారని ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు చెప్తున్నారు.
తాజావార్తలు
-
SBI Loans: ఎస్బీఐ ఖాతాదారులకు శుభవార్త.. UPI చెల్లింపుల ఆధారంగా కూడా రుణాలు మంజూరు..
-
Modi-Jinping: అరుదైన ఖనిజాలు, వాణిజ్య లోటు.. మోడీ-జిన్పింగ్ భేటీలో కీలకాంశాలు..
-
Soori : అద్దం ముందు షర్ట్ విప్పేసి.. నా ఒంటిపై ఉన్న గాయాలకు నేనే ముద్దులు పెట్టుకున్నా.
-
Ganesh Utsav: ఇంటికే పరిమితమైన గణపతి గల్లీలోకి ఎలా వచ్చాడో తెలుసా? 1905 నాటి ఆ చరిత్ర ఇదిగో!
-
Notification Cancelled: నిరుద్యోగులకు అలర్ట్.. TGPSC నుంచి విడుదలైన ఆ నోటిఫికేషన్ రద్దు..
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్తో సెప్టెంబర్ 15న భారత్లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్తో భారత్ దౌత్యం.. చాబహార్తో కొత్త ట్రేడ్ రూట్.!