CM Chandrababu: సీఎం చంద్రబాబు బంపరాఫర్.. మూడో బిడ్డకు రూ.30 వేలు, నాలుగో బిడ్డకు రూ.40 వేలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో క్రమంగా తగ్గుతున్న జనాభా రేటుపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. జనాభా క్షీణించడం అనేది భవిష్యత్తులో తీవ్రమైన సంక్షోభానికి దారితీస్తుందని ఆయన హెచ్చరించారు. ముఖ్యంగా యువత సంఖ్య తగ్గి, వృద్ధుల జనాభా పెరగడం వల్ల ఉత్పాదకత తగ్గి ఆర్థిక వ్యవస్థపై కోలుకోలేని భారం పడుతుందని అభిప్రాయపడ్డారు. ఒకప్పుడు జనాభా నియంత్రణ గురించి మాట్లాడిన తరుణం నుంచి.. ఇప్పుడు జనాభాను పెంచుకోవాల్సిన అవశ్యకత ఏర్పడిందని ఆయన గుర్తుచేశారు.
ఈ క్రమంలోనే మానవ వనరుల ప్రాధాన్యతను వివరిస్తూ, పిల్లలు కుటుంబానికి గానీ, దేశానికి గానీ భారం కాదని.. వారే అసలైన సంపద అని సీఎం వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో సంతానోత్పత్తి రేటును పెంపొందించేందుకు ప్రభుత్వం తరఫున విప్లవాత్మకమైన ప్రోత్సాహకాలను ప్రకటించారు. ఇందులో భాగంగా ఎక్కువ మంది పిల్లలను కనే దంపతులకు ఆర్థిక భరోసా కల్పించాలని నిర్ణయించారు. కుటుంబంలో మూడో బిడ్డ జన్మిస్తే ఆ దంపతులకు తక్షణమే రూ.30,000 ఆర్థిక సాయం అందిస్తామని, అలాగే నాలుగో బిడ్డ జన్మిస్తే రూ.40,000 నగదు బహుమతిగా ఇస్తామని ఒక కీలకమైన పథకాన్ని వెల్లడించారు.
Also Read
- CM Chandrababu: ఢిల్లీలో సీఎం చంద్రబాబు మార్క్ రాజకీయం.. భోగాపురం ఎయిర్పోర్ట్, విశాఖ మెట్రోపై స్పీడ్..
- Delhi High Court: పబ్లిసిటీ కోసం లాఠీ దెబ్బలు తింటారా? పోలీసులపై హైకోర్టు ఆగ్రహం
- CJP Protest: విద్యార్థుల నిరసనపై క్రికెటర్లు బుమ్రా, సూర్యకుమార్ భార్యల పోస్ట్లు వైరల్
- Lalit Modi: 16 ఏళ్ల తర్వాత భారత్ రాబోతున్న లలిత్ మోడీ..
ఈ జనాభా నియంత్రణ వ్యతిరేక విధానాలతో పాటు రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి సంబంధించిన మరికొన్ని అంశాలను కూడా ఆయన పంచుకున్నారు. అందులో భాగంగా రాష్ట్రాన్ని పరిశుభ్రంగా తీర్చిదిద్దేందుకు ‘స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇది ‘స్వర్ణాంధ్ర’ సాకారం కావడానికి ఎంతగానో దోహదపడుతుందన్నారు. అలాగే ప్రతి నెల ఒకటో తారీఖున లబ్ధిదారుల ఇళ్ల వద్దకే వెళ్లి నేరుగా సామాజిక పింఛన్లు పంపిణీ చేయడం ప్రభుత్వానికి ఎనలేని తృప్తిని ఇస్తోందని చెప్పారు.
ప్రభుత్వ పాలనను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో అధికార యంత్రాంగం కీలక పాత్ర పోషిస్తుందని, వారి పనితీరుపైనే ప్రభుత్వానికి మంచి లేదా చెడు పేరు వస్తుందని పేర్కొన్నారు. అటు ప్రభుత్వ యంత్రాంగం, ఇటు నిరంతరం శ్రమించే పార్టీ శ్రేణులు తనకున్న రెండు ముఖ్యమైన బలాలని ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Priyanka Chopra: ప్రియాంక చోప్రా బాలీవుడ్కు గుడ్బై చెప్పడానికి వాళ్లే కారణమట! వీడియో వైరల్..
-
CM Chandrababu: ఢిల్లీలో సీఎం చంద్రబాబు మార్క్ రాజకీయం.. భోగాపురం ఎయిర్పోర్ట్, విశాఖ మెట్రోపై స్పీడ్..
-
Uday Krishna Reddy : ఆసుపత్రి నుంచి ఉదయ్ కృష్ణారెడ్డి డిశ్చార్జ్.. కేసులో కీలక మలుపు.!
-
Delhi High Court: పబ్లిసిటీ కోసం లాఠీ దెబ్బలు తింటారా? పోలీసులపై హైకోర్టు ఆగ్రహం
ట్రెండింగ్
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!
-
Light Flip 5G Phone: సోషల్ మీడియా లేని 5G ఫోన్.. 50MP కెమెరాతో Light Flip కొత్త కాన్సెప్ట్.!