CM Chandrababu: సీఎం చంద్రబాబు బంపరాఫర్.. మూడో బిడ్డకు రూ.30 వేలు, నాలుగో బిడ్డకు రూ.40 వేలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో క్రమంగా తగ్గుతున్న జనాభా రేటుపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. జనాభా క్షీణించడం అనేది భవిష్యత్తులో తీవ్రమైన సంక్షోభానికి దారితీస్తుందని ఆయన హెచ్చరించారు. ముఖ్యంగా యువత సంఖ్య తగ్గి, వృద్ధుల జనాభా పెరగడం వల్ల ఉత్పాదకత తగ్గి ఆర్థిక వ్యవస్థపై కోలుకోలేని భారం పడుతుందని అభిప్రాయపడ్డారు. ఒకప్పుడు జనాభా నియంత్రణ గురించి మాట్లాడిన తరుణం నుంచి.. ఇప్పుడు జనాభాను పెంచుకోవాల్సిన అవశ్యకత ఏర్పడిందని ఆయన గుర్తుచేశారు.
ఈ క్రమంలోనే మానవ వనరుల ప్రాధాన్యతను వివరిస్తూ, పిల్లలు కుటుంబానికి గానీ, దేశానికి గానీ భారం కాదని.. వారే అసలైన సంపద అని సీఎం వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో సంతానోత్పత్తి రేటును పెంపొందించేందుకు ప్రభుత్వం తరఫున విప్లవాత్మకమైన ప్రోత్సాహకాలను ప్రకటించారు. ఇందులో భాగంగా ఎక్కువ మంది పిల్లలను కనే దంపతులకు ఆర్థిక భరోసా కల్పించాలని నిర్ణయించారు. కుటుంబంలో మూడో బిడ్డ జన్మిస్తే ఆ దంపతులకు తక్షణమే రూ.30,000 ఆర్థిక సాయం అందిస్తామని, అలాగే నాలుగో బిడ్డ జన్మిస్తే రూ.40,000 నగదు బహుమతిగా ఇస్తామని ఒక కీలకమైన పథకాన్ని వెల్లడించారు.
Also Read
- Sanjay Raut: కాంగ్రెస్లో విలీనం కావాలి.. టీఎంసీ, ఎన్సీపీలకు సంజయ్ రౌత్ పిలుపు..
- Iran: యురేనియం బదిలీపై ఇరాన్ సంచలన నిర్ణయం.. పాక్కు కీలక సమాచారం!
- Arunachal Pradesh: ‘‘ఇది 1962 కాదు’’.. చైనాకు అరుణాచల్ సీఎం హెచ్చరిక..
- PM Surya Ghar: సోలార్ విద్యుత్ దిశగా దేశం.. 40 లక్షల ఇళ్లకు చేరిన ‘పీఎం సూర్య ఘర్’ పథకం
ఈ జనాభా నియంత్రణ వ్యతిరేక విధానాలతో పాటు రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి సంబంధించిన మరికొన్ని అంశాలను కూడా ఆయన పంచుకున్నారు. అందులో భాగంగా రాష్ట్రాన్ని పరిశుభ్రంగా తీర్చిదిద్దేందుకు ‘స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇది ‘స్వర్ణాంధ్ర’ సాకారం కావడానికి ఎంతగానో దోహదపడుతుందన్నారు. అలాగే ప్రతి నెల ఒకటో తారీఖున లబ్ధిదారుల ఇళ్ల వద్దకే వెళ్లి నేరుగా సామాజిక పింఛన్లు పంపిణీ చేయడం ప్రభుత్వానికి ఎనలేని తృప్తిని ఇస్తోందని చెప్పారు.
ప్రభుత్వ పాలనను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో అధికార యంత్రాంగం కీలక పాత్ర పోషిస్తుందని, వారి పనితీరుపైనే ప్రభుత్వానికి మంచి లేదా చెడు పేరు వస్తుందని పేర్కొన్నారు. అటు ప్రభుత్వ యంత్రాంగం, ఇటు నిరంతరం శ్రమించే పార్టీ శ్రేణులు తనకున్న రెండు ముఖ్యమైన బలాలని ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
Sanjay Raut: కాంగ్రెస్లో విలీనం కావాలి.. టీఎంసీ, ఎన్సీపీలకు సంజయ్ రౌత్ పిలుపు..
-
Iran: యురేనియం బదిలీపై ఇరాన్ సంచలన నిర్ణయం.. పాక్కు కీలక సమాచారం!
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Arunachal Pradesh: ‘‘ఇది 1962 కాదు’’.. చైనాకు అరుణాచల్ సీఎం హెచ్చరిక..
-
PM Surya Ghar: సోలార్ విద్యుత్ దిశగా దేశం.. 40 లక్షల ఇళ్లకు చేరిన ‘పీఎం సూర్య ఘర్’ పథకం
ట్రెండింగ్
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!