CM Chandrababu: సీఎం చంద్రబాబు బంపరాఫర్.. మూడో బిడ్డకు రూ.30 వేలు, నాలుగో బిడ్డకు రూ.40 వేలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో క్రమంగా తగ్గుతున్న జనాభా రేటుపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. జనాభా క్షీణించడం అనేది భవిష్యత్తులో తీవ్రమైన సంక్షోభానికి దారితీస్తుందని ఆయన హెచ్చరించారు. ముఖ్యంగా యువత సంఖ్య తగ్గి, వృద్ధుల జనాభా పెరగడం వల్ల ఉత్పాదకత తగ్గి ఆర్థిక వ్యవస్థపై కోలుకోలేని భారం పడుతుందని అభిప్రాయపడ్డారు. ఒకప్పుడు జనాభా నియంత్రణ గురించి మాట్లాడిన తరుణం నుంచి.. ఇప్పుడు జనాభాను పెంచుకోవాల్సిన అవశ్యకత ఏర్పడిందని ఆయన గుర్తుచేశారు.
ఈ క్రమంలోనే మానవ వనరుల ప్రాధాన్యతను వివరిస్తూ, పిల్లలు కుటుంబానికి గానీ, దేశానికి గానీ భారం కాదని.. వారే అసలైన సంపద అని సీఎం వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో సంతానోత్పత్తి రేటును పెంపొందించేందుకు ప్రభుత్వం తరఫున విప్లవాత్మకమైన ప్రోత్సాహకాలను ప్రకటించారు. ఇందులో భాగంగా ఎక్కువ మంది పిల్లలను కనే దంపతులకు ఆర్థిక భరోసా కల్పించాలని నిర్ణయించారు. కుటుంబంలో మూడో బిడ్డ జన్మిస్తే ఆ దంపతులకు తక్షణమే రూ.30,000 ఆర్థిక సాయం అందిస్తామని, అలాగే నాలుగో బిడ్డ జన్మిస్తే రూ.40,000 నగదు బహుమతిగా ఇస్తామని ఒక కీలకమైన పథకాన్ని వెల్లడించారు.
Also Read
- NEET UG Re-Exam: నీట్ రీ-ఎగ్జామ్ వేళ కేంద్రం సంచలన నిర్ణయం.. భారత్లో టెలిగ్రామ్ యాప్పై తాత్కాలిక నిషేధం!
- Kesineni Nani: కేశినేని నాని వరుస పోస్టులు.. రాజకీయ రీఎంట్రీకి సంకేతాలా?
- ACB Raids: ఆదాయానికి మించిన ఆస్తులు.. డిప్యూటీ డైరెక్టర్ నరహరి ఇంట్లో ఏసీబీ దాడులు.!
- Hyderabad: ఘనంగా మిస్ యూనివర్స్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 2026 గ్రాండ్ ఫినాలే.!
ఈ జనాభా నియంత్రణ వ్యతిరేక విధానాలతో పాటు రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి సంబంధించిన మరికొన్ని అంశాలను కూడా ఆయన పంచుకున్నారు. అందులో భాగంగా రాష్ట్రాన్ని పరిశుభ్రంగా తీర్చిదిద్దేందుకు ‘స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇది ‘స్వర్ణాంధ్ర’ సాకారం కావడానికి ఎంతగానో దోహదపడుతుందన్నారు. అలాగే ప్రతి నెల ఒకటో తారీఖున లబ్ధిదారుల ఇళ్ల వద్దకే వెళ్లి నేరుగా సామాజిక పింఛన్లు పంపిణీ చేయడం ప్రభుత్వానికి ఎనలేని తృప్తిని ఇస్తోందని చెప్పారు.
ప్రభుత్వ పాలనను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో అధికార యంత్రాంగం కీలక పాత్ర పోషిస్తుందని, వారి పనితీరుపైనే ప్రభుత్వానికి మంచి లేదా చెడు పేరు వస్తుందని పేర్కొన్నారు. అటు ప్రభుత్వ యంత్రాంగం, ఇటు నిరంతరం శ్రమించే పార్టీ శ్రేణులు తనకున్న రెండు ముఖ్యమైన బలాలని ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
Theatre Releases June 2026 : ‘మా ఇంటి బంగారం’ నుండి ‘చిన్న చిన్న ఆసై’ వరకు… ఈ వారం థియేటర్లలో ఈ సౌత్ సినిమాలని డోంట్ మిస్
-
NEET UG Re-Exam: నీట్ రీ-ఎగ్జామ్ వేళ కేంద్రం సంచలన నిర్ణయం.. భారత్లో టెలిగ్రామ్ యాప్పై తాత్కాలిక నిషేధం!
-
Kesineni Nani: కేశినేని నాని వరుస పోస్టులు.. రాజకీయ రీఎంట్రీకి సంకేతాలా?
-
ACB Raids: ఆదాయానికి మించిన ఆస్తులు.. డిప్యూటీ డైరెక్టర్ నరహరి ఇంట్లో ఏసీబీ దాడులు.!
-
Hyderabad: ఘనంగా మిస్ యూనివర్స్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 2026 గ్రాండ్ ఫినాలే.!
ట్రెండింగ్
-
Mrigashira నక్షత్రంలో పుట్టినవారు ఒక్కచోటు కుదురుగా ఉండరుగా.! అదృష్టం, స్వభావం, కెరీర్ అవకాశాలు ఎలా ఉంటాయంటే.?
-
Tilak Varma: నేను ఎవరికీ నీతులు చెప్పడానికి ఇక్కడ రాలేదు.. తిలక్ వర్మ సంచలన వ్యాఖ్యలు!
-
Vaibhav Sooryavanshi Fight: వైభవ్ సూర్యవంశీపై కఠిన చర్యలు తప్పవా?.. ఐసీసీ నిబంధనలు ఏం చెబుతున్నాయంటే?
-
Lucky Plants : మీ పుట్టిన తేదీ ప్రకారం ఇంట్లో ఏ మొక్క పెంచితే అదృష్టం కలిసొస్తుందో తెలుసా?
-
Rainy Season Tips : వానాకాలంలో తప్పక తినాల్సిన 7 పండ్లు.!