Chamala Kiran Kumar Reddy : కేంద్రం బీహార్కు, ఏపీకి ఇచ్చిన ప్రాధాన్యత తెలంగాణకు ఇవ్వట్లేదు
- బండి సంజయ్ కార్పొరేటర్ కాదు కేంద్ర మంత్రి అని గుర్తు పెట్టుకోవాలి
- హరీష్ రావు ముందు కేసీఆర్ ను ప్రజలకు దర్శనం ఇవ్వాలని చెప్పాలి
- కేంద్రం బీహార్కు, ఏపీకి ఇచ్చిన ప్రాధాన్యత తెలంగాణకు ఇవ్వట్లేదు : భువనగిరి ఎంపీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chamala Kiran Kumar Reddy : పద్మ శ్రీ అవార్డుల విషయంలో పార్లమెంట్ జీరో అవర్ లో లెవనెత్తుతా అని అన్నారు భువనగిరి ఎంపీ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బండి సంజయ్ కార్పొరేటర్ కాదు కేంద్ర మంత్రి అని గుర్తు పెట్టుకోవాలని, హరీష్ రావు ముందు కేసీఆర్ ను ప్రజలకు దర్శనం ఇవ్వాలని చెప్పాలన్నారు చామల కిరణ్ కుమార్. కేంద్రం బీహార్కు, ఏపీకి ఇచ్చిన ప్రాధాన్యత తెలంగాణకు ఇవ్వట్లేదని ఆయన మండిపడ్డారు. అందుకే బడ్జెట్ లో మొండి చేయి చూపిస్తున్నారని, ఈ సారి అయిన లోకసభలో విభజన హామీల గురించి బీజేపీ ఎంపీలు మాట్లాడాలన్నారు చామల కిరణ్ కుమార్ రెడ్డి. అంతేకాకుండా.. రాష్ట్రం కోసం సీఎం రేవంత్ రెడ్డి ఎన్ని సార్లు డిల్లికి పోయాడో కేటిఆర్ ను అడిగితే వ్యంగ్యంగా చెప్తాడని, ఆదిలాబాద్ లో సీఎం రేవంత్ రెడ్డి మోడీని రాష్ట్రానికి పెద్దన్న లాగ ఉండమన్నారని, కాంగ్రెస్ లో 8మంది ఎంపీలు ఉన్నారన్నారు. తెలంగాణ ప్రజలు 8మంది బీజేపీ ఎంపిలను గెలిపించారని, మిమ్ముల్ని గెలిపించింది ఎందుకు అని ఆయన వ్యాఖ్యానించారు. లక్ష్మణ్ రాజ్య సభ ఎంపీగా ఉండి ఆర్ఆర్ఆర్పై భువనగిరి పోయి ఫిర్యాదు చేయడం పై వాళ్ల వైఖరి అర్థం చేసుకోవచ్చన్నారు చామల కిరణ్ కుమార్. హైదరాబాద్ RRR కోసం కేంద్ర మంత్రి గడ్కరీని సీఎం రేవంత్ రెడ్డి కలిశారని, RRR హైదరాబాద్ లైఫ్ లైన్ దానికి 45వేల కోట్లు అవసరమన్నారు. రిజనల్ రింగ్ రోడ్డు, మెట్రో తో హైదరాబాద్ గ్లోబల్ సిటీ అవుతుందన్నారు.
Supreme Court: ట్రిపుల్ తలక్కు వ్యతిరేకంగా ఎన్ని కేసులు నమోదయ్యాయి? రిపోర్టు ఇవ్వండి..
Also Read
- Trump: నా యుద్ధ అధికారాల్ని పరిమితం చేయడం దేశద్రోహం.. డెమోక్రాట్లపై ట్రంప్ ఆగ్రహం
- Rajya Sabha: రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ.. కీలక నేతలకు అవకాశం
- Pawan Kalyan: పాత వీడియో షేర్ చేసిన పవన్ కల్యాణ్.. తెలంగాణపై నా వైఖరి ఇదే..!
- Test Match: ఆఫ్ఘనిస్తాన్తో టెస్ట్ మ్యాచ్.. సిరాజ్ ఫిట్నెస్పై కోచ్ కీలక వ్యాఖ్యలు
అంతేకాకుండా..’పద్మ అవార్డుల విషయంలో బండి సంజయ్ బాధ్యత రహిత్యంగా మాట్లాడిండు.. కిషన్ రెడ్డి దావోస్ పర్యటన ను , కంపెనీలను నెగెటివ్ ప్రచారం చేస్తుండు.. నల్లగొండలో రైతులు ఎవ్వరు కేటీఆర్ ధర్నా ను పట్టించుకోలేదు.. మూసీ కోసం పార్లమెంట్ లో ఎంపీలందరం కొట్లాడాలి.. మహారాష్ట్ర కంటే మన రాష్ట్రం ఎక్కువగా కేంద్రానికి జీఎస్టీ పే చేస్తుంది. పది ఏండ్లు రాష్ట్రానికి రావాల్సిన నిధులను రప్పించడంలో బీఆర్ఎస్ విఫలమైంది.. హైదరాబాద్ లో గ్రీన్ పీల్డ్ హైవే ,డ్రై పోర్ట్ పెట్టబోతున్నాం.. పార్టీ ఏ అవకాశం ఇచ్చినా స్వీకరిస్తా’ అని చామల కిరణ్ కుమార్ వ్యాఖ్యానించారు.
Bandi Sanjay: కుంభమేళాలో తొక్కిసలాట జరగడం తీవ్ర దిగ్భ్రాంతి కలిగిస్తోంది..
తాజావార్తలు
-
Trump: నా యుద్ధ అధికారాల్ని పరిమితం చేయడం దేశద్రోహం.. డెమోక్రాట్లపై ట్రంప్ ఆగ్రహం
-
Rajya Sabha: రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ.. కీలక నేతలకు అవకాశం
-
Pawan Kalyan: పాత వీడియో షేర్ చేసిన పవన్ కల్యాణ్.. తెలంగాణపై నా వైఖరి ఇదే..!
-
Kitchen Tips: ఈ వస్తువుల్ని ఫ్రిజ్లో పెట్టొద్దు.. నెమ్మదిగా విషంగా మారుతాయి..
-
Test Match: ఆఫ్ఘనిస్తాన్తో టెస్ట్ మ్యాచ్.. సిరాజ్ ఫిట్నెస్పై కోచ్ కీలక వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!
-
రూ.11,999కే Lava Bold N2 5G స్మార్ట్ఫోన్ లాంచ్.. 6000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో పాటు.!