Sri Ram Janbhoomi Trust: విదేశీ విరాళాలు స్వీకరించేందుకు రామ మందిర ట్రస్టుకు కేంద్రం అనుమతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sri Ram Janbhoomi Trust: అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి విదేశీ వనరుల నుంచి విరాళాలను స్వీకరించేందుకు శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్రానికి హోం మంత్రిత్వ శాఖ అనుమతి ఇచ్చిందని శ్రీ రామ జన్మభూమి తీర్థ ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ ఈరోజు తెలిపారు. అలాంటి విరాళాలను ఢిల్లీలో ఉన్న ఎస్బీఐ ప్రధాన శాఖలోని ట్రస్ట్కు సంబంధించిన నిర్దేశిత బ్యాంక్ ఖాతాకు పంపవచ్చని ఆయన చెప్పారు.
Also Read: IIT Kharagpur: ఐఐటీ ఖరగ్పూర్లో తెలంగాణకు చెందిన విద్యార్థి ఆత్మహత్య
Also Read
“శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్రం ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ 2010 ప్రకారం స్వచ్ఛంద విరాళాలను స్వీకరించడానికి భారత ప్రభుత్వంలోని హోం మంత్రిత్వ శాఖలోని FCRA (ఫారిన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్) డిపార్ట్మెంట్ ఆమోదించింది” అని ఆయన ట్విట్టర్ వేదికగా ఒక పోస్ట్లో తెలిపారు. విడిగా విడుదల చేసిన మీడియా ప్రకటనలో.. భారత ప్రభుత్వ హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖలోని FCRA విభాగం, విదేశీ వనరుల నుంచి స్వచ్ఛంద సహకారాన్ని స్వీకరించడానికి ‘శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్రం’ ట్రస్ట్ను నమోదు చేసిందని ఆయన వెల్లడించారు. “దయచేసి అటువంటి విరాళాలను 11 సంసద్ మార్గ్, న్యూఢిల్లీలో ఉన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, మెయిన్ బ్రాంచ్లో ఉన్న బ్యాంక్ ఖాతాకు మాత్రమే పంపగలరని దయచేసి గమనించండి” అని ఆయన చెప్పారు.
Also Read: Benjamin Netanyahu: మేం చేయగలిగినదంతా చేస్తున్నాం.. కానీ హమాస్ ప్రజల్ని కవచాలుగా వాడుకుంటోంది..
అయోధ్యలో మూడంతస్తుల రామాలయం గ్రౌండ్ ఫ్లోర్ నిర్మాణం డిసెంబర్ చివరి నాటికి పూర్తవుతుందని, జనవరి 22న పవిత్రోత్సవం జరుగుతుందని ఆలయ నిర్మాణ కమిటీ చైర్ పర్సన్ నృపేంద్ర మిశ్రా ఇటీవల ఇంటర్వ్యూలో తెలిపారు. జనవరి 20 మరియు 24 మధ్య ఏదైనా రోజున ‘ప్రాణ్ ప్రతిష్ఠ’కు సంబంధించిన కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొంటారని కూడా మిశ్రా చెప్పారు. తుది తేదీని ప్రధానమంత్రి కార్యాలయం ఇంకా తెలియజేయలేదని ఆయన అన్నారు.
తాజావార్తలు
-
Paper Leaks: పంజాబ్లో పేపర్ లీక్.. చిక్కుల్లో ఆమ్ ఆద్మీ పార్టీ..
-
CM Revanth Reddy vs KTR : సీఎం రేవంత్ రెడ్డి, కేటీఆర్ మధ్య సవాళ్లు.. మాటల తూటాలు.!
-
CJI Protest: నిరసనకారులకు ఢిల్లీ పోలీసులు బిగ్ షాక్.. అలా చేస్తే పాస్పోర్టులు రద్దు!
-
Whisky Business: విస్కీ కిక్కు మామూలుగా లేదు.. మూడు నెలల్లోనే రూ.391 కోట్ల లాభం!
-
Shikhar Dhawan: కాక్రోచ్ ఉద్యమంపై శిఖర్ ధావన్ పోస్ట్.. సోషల్ మీడియాలో ట్రోలింగ్..
ట్రెండింగ్
-
Home Tips : ఎండిపోయిన పాత కొబ్బరిని పడేస్తున్నారా? ఇంట్లోనే ప్యూర్ కొబ్బరి నూనె..!
-
SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?