PM-KISAN : రైతులకు కేంద్రం గుడ్ న్యూస్.. ఇక నుంచి ఎకరాకు రూ.8వేలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM-KISAN : రైతులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది కేంద్ర సర్కార్. ఈ నెల 23వ తేదీన కిసాన్ సమ్మాన్ నిధులు విడుదల కానున్నాయి. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన 13వ విడత డబ్బులు ఈ నెలాఖరులో విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కేంద్రంలోని బీజేపీ సర్కారు రైతులకోసం ఎన్నో పథకాలను తీసుకొచ్చింది. దీనిలో భాగంగా 2019లో ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (పీఎం-కిసాన్ ) పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకంలో అర్హులైన రైతులకు ఏడాదికి రూ.6,000 చొప్పున.. మూడు వాయిదాలలో రూ.2,000 చొప్పున రైతుల ఖాతాలో జమ చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటివరకు ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన 12 వాయిదాల నగదును రైతులకు అందించగా.. ఇప్పుడు 13వ విడత పీఎం కిసాన్ నగదు కోసం లక్షలాది మంది రైతులు ఎదురుచూస్తున్నారు. జనవరి 23న నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి ఉండటంతో ఆ రోజు రైతుల ఖాతాల్లో రూ.2000 చొప్పున వేస్తారని సమాచారం. మరోవైపు రైతులు ఈనెల 15లోగా ఈకేవైసీ పూర్తి చేయాలని, ఆధార్ అనుసంధానం చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఈకేవైసీ లేకుంటే 13వ విడత డబ్బులు రావని హెచ్చరిస్తున్నారు.
Read Also: China Explosion : చైనాలో భారీ అగ్ని ప్రమాదం.. రోజైనా అదుపులోకి రాని మంటలు
Also Read
- Covid 19-AP: ఏపీలో అప్రమత్తం.. ప్రత్యేక కొవిడ్ వార్డు ఏర్పాటు!
- Ind vs Eng 3rd ODI: నేడే హై ఓల్టేజ్ పోరు.. ఆ జట్టుకే అడ్వాంటేజ్.. పిచ్ రిపోర్ట్, ప్లేయింగ్ ఎలెవన్, లైవ్ స్ట్రీమింగ్ వివరాలు ఇవే!
- Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
- Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
ఈ తరుణంలో కేంద్ర ప్రభుత్వం రైతులకు మరో గుడ్ న్యూస్ అందించేందుకు సిద్ధమవుతోందని సమాచారం. పీఎం కిసాన్ నగదు 6000 వేల నుంచి మరింత పెంచాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఫిబ్రవరి ఒకటిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. ఈ క్రమంలో పీఎం కిసాన్ నగదును పెంచే యోచనలో ఉన్నట్లు పేర్కొంటున్నారు. వివిధ మీడియా నివేదికల ప్రకారం ప్రభుత్వం పీఎం కిసాన్ పథకం కింద రైతులకు అందిస్తున్న వార్షిక ఆర్థిక ప్రయోజనాన్ని రూ. 8వేలకి పెంచే అవకాశం ఉన్నట్లు పేర్కొంటున్నారు. 8వేలను అర్హులైన రైతుల ఖాతాలో 4 సమాన వాయిదాలలో పంపిణీ చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. చిన్న, సన్నకారు రైతు కుటుంబాలకు ఆర్థికంగా చేయుతనందించేందుకు కేంద్రం ఈ పథకాన్ని ప్రారంభించి, నేరుగా రైతుల ఖాతాల్లో రూ.6వేలను జమచేస్తోంది.
తాజావార్తలు
-
Article 370: రెండు జాతీయ అవార్డులు గెలిచిన ‘ఆర్టికల్ 370’.. ఏ ఓటీటీలో చూడొచ్చో తెలుసా?
-
Sharwanand : మహాభారతం నేపథ్యంలో నాగబంధం దర్శకుడితో శర్వానంద్..
-
Covid 19-AP: ఏపీలో అప్రమత్తం.. ప్రత్యేక కొవిడ్ వార్డు ఏర్పాటు!
-
Suriya : ఎక్స్పరిమెంట్స్ వద్దు.. రొటీన్ కమర్షియల్ సినిమాలే ముద్దంటున్న సూర్య
-
Fahadh Faasil: టామ్ క్రూజ్ సినిమాను వదులుకున్న ఫహద్ ఫాసిల్.. కారణం తెలిస్తే షాకవుతారు!
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!