GVL Narasimha Rao: రుషికొండ నిర్మాణాలపై కేంద్రం దర్యాప్తు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విశాఖపట్నంలోని రుషికొండ ప్రాజెక్టులో పర్యావరణ నిబంధనల ఉల్లంఘనలపై,రుషికొండ వద్ద మంజూరు చేయబద్ద 19968 చదరపు మీటర్ల ప్రాంతం కంటే కోస్టల్ రీజియన్ జోన్ నిబంధనలను ఉల్లంఘించి అదనపు నిర్మాణం చేపట్టినట్లు మంత్రిత్వ శాఖకు తెలుసా అని జీవీఎల్ పార్లమెంటులో ప్రశ్నించగా ,ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వం దర్యాప్తు చేస్తోందని కేంద్రమంత్రి సమాధానం ఇచ్చారు. కేంద్ర పర్యావరణ, మంత్రి అశ్వినీ కుమార్ చౌబే ఎంపీ జీవీఎల్ కు సమాధానం ఇస్తూ ఏపీ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ కు 9.88 ఎకరాల విస్తీర్ణంలో మాత్రమే 2021 మే 19 న రాసిన లేఖ ద్వారా పర్యాటక ప్రాజెక్టు అభివృద్ధి కోసం సిఆర్జెడ్ క్లియరెన్స్ ఇచ్చినట్లు తెలిపారు.
Read Also:Urfi Javed: బట్టలు విప్పి దుబాయ్ లో బోల్డ్ బ్యూటీ ఫోటోషూట్.. అరెస్ట్..?
Also Read
- Free Flight Journey: వారికి భారీ శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. ఒక రోజు ఉచిత విమాన ప్రయాణం..
- Indus Waters Treaty: సింధు జలాల ఒప్పందంపై పాకిస్తాన్కు కెనడా షాక్..
- Kavya Maran: పాకిస్థాన్ క్రికెటర్ను కొనుగోలు చేయడంపై చెలరేగిన రచ్చ.. కావ్య మారన్ రియాక్షన్ ఇదే!
- Gold In Bag: అలిపిరిలో దొరికిన బంగారం బ్యాగ్.. సీసీటీవీ పరిశీలించిన అధికారులు..
దీనిపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అమరావతి: 2021 ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) నంబర్లు 257 , 241 మరియు 2022 యొక్క సిసి నంబర్ 1425 03/11/2022 ఉత్తర్వు ద్వారా పై ప్రాంతాన్ని సర్వే చేయడానికి ఒక బృందాన్ని నియమించమని మరియు నిర్మాణ కార్యకలాపాలు జరిగిన ఖచ్చితమైన ప్రాంతం మరియు స్లాపింగ్ కోసం ఉపయోగించిన ప్రాంతం గురించి ఒక నివేదికను సమర్పించమని మంత్రిత్వ శాఖను ఆదేశించినట్లు కేంద్ర మంత్రి తెలియజేశారు. ఇటువంటి పర్యావరణ ఉల్లంఘనలకు వ్యతిరేకంగా చర్య తీసుకోవడానికి కేంద్ర చట్టాల ప్రకారం కేంద్ర ప్రభుత్వానికి ఉన్న అధికారాల గురించి జీవీఎల్ ప్రశ్నించగా మంత్రి సమాధానం ఇస్తూ పర్యావరణ (సంరక్షణ) చట్టం, 1986 లోని సెక్షన్ 3 ద్వారా పర్యావరణ నాణ్యతను పరిరక్షించడం మరియు మెరుగుపరచడం మరియు పర్యావరణ కాలుష్యాన్ని నియంత్రించడం మరియు తగ్గించడం కోసం అవసరమైన లేదా ప్రయోజనకరమైన అన్ని చర్యలను తీసుకునే అధికారాన్ని కేంద్ర ప్రభుత్వం కలిగి ఉందన్నారు.
ఆయా చట్టాలు కేంద్ర ప్రభుత్వానికి తగిన ఆదేశాలు జారీ చేయడానికి చట్టం కింద అవసరమైన లేదా అవసరం అని భావించే అధికారాలు, విధులను రాష్ట్ర ప్రభుత్వానికి లేదా తాము అనుకున్న ఇతర అధికారులకు అప్పగించే అధికారం కలుగజేస్తాయని కేంద్రమంత్రి సమాధానం ఇచ్చారు. ఈ సందర్భంగా ఎంపీ జీవీఎల్ నరసింహారావు మాట్లాడుతూ రుషికొండ ప్రాజెక్టులో సీఆర్ జెడ్ ఉల్లంఘనలను కేంద్ర ప్రభుత్వం నియమించిన నిజనిర్ధారణ కమిటీ త్వరలోనే రుషికొండ రహస్యాన్ని బహిర్గతం చేస్తారనే ఆశ భావం వ్యక్తం చేశారు. అంతేగాక మంజూరు చేయబడ్డ CRZ అనుమతి యొక్క అన్ని ఉల్లంఘనలకు పాల్పడినవారు పర్యావరణ (సంరక్షణ) చట్టం, 1986 యొక్క నిబంధనలకు అనుగుణంగా కచ్చితంగా శిక్షించబడాల్సి వస్తుందని తెలియజేశారు.
Read Also: Oscars 2023: ఇండియా నుంచి షార్ట్ లిస్ట్ అయిన ప్రాజెక్ట్స్ ఇవే
తాజావార్తలు
-
Shamshabad : ఇండిగో ఉద్యోగినిపై క్యాబ్ డ్రైవర్ అత్యాచారయత్నం..!
-
Free Flight Journey: వారికి భారీ శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. ఒక రోజు ఉచిత విమాన ప్రయాణం..
-
Minister Seethakka : ములుగు టూర్కు వెళ్తున్నారా? మంత్రి సీతక్క కీలక హెచ్చరిక.!
-
Indus Waters Treaty: సింధు జలాల ఒప్పందంపై పాకిస్తాన్కు కెనడా షాక్..
-
Kavya Maran: పాకిస్థాన్ క్రికెటర్ను కొనుగోలు చేయడంపై చెలరేగిన రచ్చ.. కావ్య మారన్ రియాక్షన్ ఇదే!
ట్రెండింగ్
-
Cleaning Hacks : తుప్పు పట్టిన ఇనుప అల్మారా కొత్తదానిలా మెరవాలా? ఈ 4 చిట్కాలు చాలు.!
-
Remote Cleaning : వర్షాల్లో టీవీ రిమోట్ పనిచేయడం లేదా? ఈ 4 ట్రిక్స్తో కొత్తదానిలా మారుతుంది.!
-
Food Storage Tips : వంట నూనె ఇలా నిల్వ చేస్తే విషమే.! ఈ 5 సంకేతాలు కనిపిస్తే వెంటనే పారేయండి
-
Kitchen Tips : పుట్టగొడుగులు 2 రోజుల్లో పాడవుతున్నాయా? ఈ సీక్రెట్ ట్రిక్తో వారాల పాటు ఫ్రెష్.!
-
Sanju Samson: రోహిత్ భాయ్ సారీ.. నిన్ను నేను నమ్మలేదు.. సంజు ఆసక్తికర వ్యాఖ్యలు!