Chiranjeevi : మెగాస్టార్ కు పద్మవిభూషణ్ ఇవ్వనున్న కేంద్రం..?
తన అద్భుతమైన నటనతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న మెగాస్టార్ చిరంజీవికి మరో అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్ వరించనున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. మెగాస్టార్ చిరంజీవి కు పద్మవిభూషణ్ అవార్డు రావడం గురించి రిపబ్లిక్ డే రోజు అఫీషియల్ అనౌన్స్మెంట్ రానున్నట్లు సమాచారం. ఆరోజు మోదీ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించబోతున్నట్లు సమాచారం.ఈ ఏడాది పద్మ అవార్డ్స్ లిస్ట్లో చిరంజీవి పేరు ప్రముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది.కరోనా కష్ట సమయంలో సినీ కార్మికులతో పాటు సామాన్యులను ఆదుకునేందుకు చిరంజీవి చేసిన సేవలను గుర్తించి మోదీ ప్రభుత్వం మెగాస్టార్ను పద్మవిభూషణ్తో సత్కరించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. లాక్డౌన్ టైమ్లో ఉపాధి కోల్పోయిన సినీ కార్మికులకు చిరంజీవి నిత్యావసరాలు అందజేశారు. సినీ కార్మికులతో పాటు కోవిడ్ కారణంగా ఇబ్బందులు పడిన సామన్య ప్రజలను ఆదుకునేందుకు అంబులెన్స్ మరియు ఆక్సిజన్ సదుపాయాలను ఉచితంగా కల్పించారు.సినీ పరిశ్రమతో పాటు ప్రజలకు ఆయన చేసిన సేవలను గుర్తించి పద్మవిభూషణ్ అవార్డును అందజేయబోతున్నట్లు తెలుస్తుంది.
ఇప్పటికే చిరంజీవి పద్మభూషణ్ అవార్డును అందుకున్నారు. 2006లో ఈ అవార్డును ఆయన స్వీకరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో చిరంజీవి పద్మభూషణ్ అందుకున్నారు.. ఇప్పుడు బీజీపీ ప్రభుత్వం ఆయన్ని పద్మవిభూషణ్తో సత్కరించనుంది. చిరంజీవి పద్మవిభూషణ్కు ఎంపికైన వార్త టాలీవుడ్లో హాట్టాపిక్గా మారింది. ఈ వార్త తెలిసి మెగా ఫ్యామిలీతో పాటు మెగా అభిమానులు కూడా ఎంతో సంతోషిస్తున్నారు..ఇదిలా ఉంటే ప్రస్తుతం చిరంజీవి విశ్వంభర మూవీతో బిజీగా ఉన్నారు.ఫాంటసీ ఎంటర్టైనర్గా రూపొందుతున్న.ఈ సినిమాకు బింబిసార ఫేమ్ వశిష్ట దర్శకత్వం వహిస్తున్నాడు. వంద కోట్లకుపైగా బడ్జెట్తో రూపొందుతోన్న ఈ మూవీ వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ కానుంది. యూవీ క్రియేషన్స్ పతాకంపై వంశీ, ప్రమోద్ మరియు విక్రమ్ విశ్వంభర మూవీని నిర్మిస్తున్నారు. విశ్వంభరలో చిరంజీవికి జోడీగా త్రిష హీరోయిన్గా నటించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. అలాగే త్రిషతో పాటు మరో ఇద్దరు హీరోయిన్లు కూడా ఈ సినిమాలో నటించనున్నట్లు తెలుస్తుంది.అయితే త్వరలోనే ఈ సినిమాలోని హీరోయిన్స్ గురించి త్వరలోనే క్లారిటీ రానున్నట్లు సమాచారం
Also Read
- House Sales Down: భారీగా పడిపోయిన ఇళ్ల అమ్మకాలు.. ప్రధాన కారణం ఇదే..
- Software Jobs Opening: లేఆఫ్స్ మధ్య భారీ ఊరట.. నియామకాలు స్టార్ట్ చేసిన ప్రముఖ సాఫ్ట్వేర్ సంస్థ..
- Success Story: ఊరి నుంచి రూ.12 అప్పు చేసి వచ్చాడు.. నేడు రూ. 15 వేల కోట్లకు అధిపతి..
- IPL 2026: 8 మ్యాచ్లు ఆడి చేసిన స్కోర్ 88.. అతడిని తప్పించాల్సిందే.. రాజస్థాన్ రాయల్స్ ఆటగాడిపై సెహ్వాగ్ ఆగ్రహం..
తాజావార్తలు
-
CM Revanth Reddy : ఐఏఎస్ల బదిలీల్లో రేవంత్ రెడ్డి క్యారెట్ అండ్ స్టిక్ పాలసీ
-
House Sales Down: భారీగా పడిపోయిన ఇళ్ల అమ్మకాలు.. ప్రధాన కారణం ఇదే..
-
Software Jobs Opening: లేఆఫ్స్ మధ్య భారీ ఊరట.. నియామకాలు స్టార్ట్ చేసిన ప్రముఖ సాఫ్ట్వేర్ సంస్థ..
-
Success Story: ఊరి నుంచి రూ.12 అప్పు చేసి వచ్చాడు.. నేడు రూ. 15 వేల కోట్లకు అధిపతి..
-
Angkrish Raghuvanshi: రేర్ డిస్మిసల్.. అంగ్క్రిష్ రఘువంశీ ఆబ్స్ట్రక్టింగ్ ది ఫీల్డ్ కు ఔట్.. కేకేఆర్ ఆగ్రహం
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!