దేశీయ దిగ్గజ ఐటీ సంస్థ ఇన్ఫోసిస్ ఎండీ, సీఈఓ సలీల్ పరేఖ్కు కేంద్ర ఆర్థికశాఖ సమన్లు జారీ చేసింది. ఆదాయపు పన్నుకు సంబంధించిన కొత్త వెబ్ పోర్టల్ ప్రారంభించి రెండు నెలలు గడుస్తున్నా.. ఇంకా సాంకేతిక సమస్యలు తలెత్తుతుండటంపై వివరణ ఇవ్వాలని ఆదేశించింది. రేపు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ముందు హాజరు కావాలని తెలిపింది. నిన్నటి నుంచి ఐటీ పోర్టల్ అందుబాటులో లేని విషయాన్ని ఈ సందర్భంగా గుర్తుచేసింది.