NTV Telugu Site icon

Andhra Pradesh : ఏపీ సీఈవో జారీ చేసిన మెమోను వెనక్కి తీసుకున్న కేంద్ర ఎన్నికల సంఘం

Cec

Cec

Andhra Pradesh : పోస్టల్ బ్యాలెట్ ఓట్ల విషయంలో కేంద్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు విరుద్ధంగా సీఈవో జారీ చేసిన మోమోలను రద్దు చేయాలని కోరుతూ వైసీపీ దాఖలు చేసిన లంచ్‌ మోషన్‌ పిటిషన్‌ పిటిషన్‌పై హైకోర్టు విచారణ జరిపింది. రాష్ట్ర ఎన్నికల సంఘం జారీ చేసిన మెమోను ఉపసంహరించుకున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం కోర్టుకు తెలిపింది. ఏపీ సీఈవో జారీ చేసిన మెమోపైనే వైఎస్సార్‌సీపీ కోర్టులో పిటిషన్‌ వేసిన విషయం తెలిసిందే. పిటిషన్‌ విచారణలో ఉండగానే.. ఆ మెమోను ఎన్నికల సంఘం వెనక్కి తీసుకోవడం గమనార్హం. పోస్టల్‌ బ్యాలెట్‌ డిక్లరేషన్‌ ఫారంపై అటెస్టింగ్‌ ఆఫీసర్‌ సంతకం చేసి, స్టాంప్‌ లేకపోయినా.. తన పేరు, డిజిగ్నేషన్‌ పూర్తి వివరాలను చేతితో రాస్తే ఆమోదించాలని గతేడాది జూలై 19న కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టమైన మార్గదర్శకాలు జారీచేసింది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ ఇవే మార్గదర్శకాలు అమలవుతున్నాయి. కానీ రాష్ట్రంలో రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ఎంకే మీనా జారీ చేసిన ఉత్తర్వులు జారీ చేయడంతో వైసీపీ కోర్టును ఆశ్రయించింది.

Read Also: AP ICET Results: ఏపీ ఐసెట్ ఫలితాలు విడుదల.. డైరెక్ట్‌ లింక్ ఇదే..