Central Election Commission: ఏపీలో నేటితో ముగియనున్న కేంద్ర ఎన్నికల సంఘం పర్యటన.. సీఈసీ నేటి కార్యక్రమాలు ఇవే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Central Election Commission: ఆంధ్రప్రదేశ్లో కేంద్ర ఎన్నికల సంఘం పర్యటన నేటితో ముగియనుంది.. ఈ నెల 8వ తేదీన విజయవాడ చేరుకుంది కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ రాజీవ్కుమార్, కమిషనర్లు అనూప్చంద్ర పాండే, అరుణ్ గోయల్తో కూడిన ఉన్నతాధికారుల బృందం విజయవాడ చేరుకుంది.. తొలి రోజు ఎలాంటి అధికారిక కార్యక్రమాలు లేవు.. కానీ, రెండో రోజు పర్యటనలో భాగంగా మంగళవారం.. వివిధ రాజకీయ పార్టీలకు సమయం కేటాయించింది ఈసీ.. ఇక, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, టీడీపీ, జనసేన, సీపీఎం, ప్రజాశాంతి పార్టీ.. ఇలా వరుసగా అన్ని పార్టీల నేతలు కేంద్ర ఎన్నికల సంఘం ప్రతినిధులను కలిసి.. తమ అభ్యంతరాలను, కొన్ని ఫిర్యాదులు చేశారు.. ఇక, మధ్యాహ్నం అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు ఆయా జిల్లాలకు సంబంధించి ఎస్ఎస్ఆర్–2024 కార్యకలాపాలు, ఎన్నికల సన్నద్ధత ప్రణాళికను కేంద్ర ఎన్నికల కమిషన్ బృందం సమీక్షించారు..
Read Also: IND vs ENG Test: విద్యార్థులకు శుభవార్త.. ఉప్పల్ స్టేడియంలో భారత్, ఇంగ్లండ్ మ్యాచ్ ఫ్రీ!
Also Read
- Dahi Masala Khichdi Recipe: వేసవిలో చల్లదనం ఇచ్చే దహీ మసాలా కిచిడి.. రుచితో పాటు ఆరోగ్యానికి మేలు చేస్తుంది..
- Hyderabad: నెంబర్ ప్లేట్ లేని కారుతో ఢీ.. నగరంలో న్యాయవాది దారుణ హత్య!
- Pakistan Cuts Petrol and Diesel Prices: పాక్లో భారీగా తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు.. వరుసగా రెండోసారి ఊరట
- Trump: భారత్ దెబ్బకు భయపడి అమెరికా కాళ్లబేరానికి పాక్.. ఆపరేషన్ సిందూర్ సీజ్ఫైర్పై ట్రంప్ సంచలన ప్రకటన..
ఇక, మూడో రోజు పర్యటనలో భాగంగా ఈ రోజు ఉదయం 9.30 గంటల నుంచి 11 గంటల వరకు స్టేట్ పోలీస్ నోడల్ ఆఫీసర్తో కలిసి కేంద్ర ఎన్నికల అధికారులకు పవర్పాయింట్ ప్రజంటేషన్ ఇవ్వనుంది రాష్ట్ర ఎన్నికల సంఘం.. ఆ తర్వాత కేంద్ర, రాష్ట్రాలకు చెందిన వివిధ ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీలకు చెందిన అధికారులతో సమావేశం ఉండనుంది.. ఏపీ సీఎస్, డీజీపీ, వివిధ శాఖల కార్యదర్శులతో ఈసీఐ ఉన్నతాధికారులు సమావేశంకానున్నారు. ఈ రోజు సాయంత్రం 4.30 గంటలకు మీడియా సమావేశం ఏర్పాటు చేసి తమ పర్యటన వివరాలను కేంద్ర ఎన్నికల సంఘం బృందం వివరించనుంది.. దీంతో.. ఏపీలో కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ రాజీవ్కుమార్ నేతృత్వంలోని బృందం పర్యటన ముగియనుంది.. ఓటర్ల జాబితాలో తప్పులు, ఫేక్ ఓటర్లపై అధికార ప్రతిపక్ష నేతలు పరస్పరం ఫిర్యాదులు చేసుకోవడంతో.. కేంద్ర ఎన్నికల సంఘం పర్యటనకు ప్రాధాన్యత ఏర్పడింది.
తాజావార్తలు
-
Dahi Masala Khichdi Recipe: వేసవిలో చల్లదనం ఇచ్చే దహీ మసాలా కిచిడి.. రుచితో పాటు ఆరోగ్యానికి మేలు చేస్తుంది..
-
Rukmini Vasanth: AI డీప్ఫేక్ బికినీ వీడియో పై..క్లారిటీ ఇచ్చిన రుక్మిణి వసంత్
-
Hyderabad: నెంబర్ ప్లేట్ లేని కారుతో ఢీ.. నగరంలో న్యాయవాది దారుణ హత్య!
-
Pakistan Cuts Petrol and Diesel Prices: పాక్లో భారీగా తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు.. వరుసగా రెండోసారి ఊరట
-
Trump: భారత్ దెబ్బకు భయపడి అమెరికా కాళ్లబేరానికి పాక్.. ఆపరేషన్ సిందూర్ సీజ్ఫైర్పై ట్రంప్ సంచలన ప్రకటన..
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!