Kerala Blast: కేరళ వరుస పేలుళ్లతో అప్రమత్తమైన కేంద్రం..ఎన్ఐఏ, ఎన్ఎస్జీ బృందాన్ని పంపిన అమిత్ షా
Kerala Blast: కేరళలోని ఎర్నాకుళంలోని యోహవా క్రిస్టియన్ కన్వెన్షన్ సెంటర్లో వరుస పేలుళ్ల తర్వాత కేంద్ర ప్రభుత్వం వెంటనే ఘటనపై దృష్టి సారించింది. NSG, NIA బృందాలను కేరళకు పంపింది. ఒకరోజు ముందుగానే హమాస్కు మద్దతుగా కేరళలో ర్యాలీ నిర్వహించారు. ఇలాంటి పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం ఈ పేలుడును చాలా సీరియస్గా తీసుకుంది. దర్యాప్తు పూర్తయ్యే వరకు కేరళలోనే ఉండాలని హోంమంత్రి అమిత్ షా దర్యాప్తు సంస్థలను కోరినట్లు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. కన్వెన్షన్ సెంటర్లో ఉదయం 9 గంటలకు వరుసగా ఐదు పేలుళ్లు సంభవించాయని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఈ పేలుళ్లలో ఒక మహిళతో సహా ఇద్దరు వ్యక్తులు మరణించినట్లు సమాచారం. 24మంది గాయపడ్డారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది.
Read Also:IND vs ENG: లక్నోలో కేఎల్ రాహుల్కు చేదు అనుభవం.. ఆటకు దూరం!
Also Read
- Mahabubabad: దారుణం.. ఇద్దరు కుమారులకు ఉరేసి, తానూ ఆత్మహత్య చేసుకున్న తండ్రి..
- Ashwini Vaishnaw: విశాఖపట్నం ఇక ఏఐపట్నం.. దక్షిణాది రాష్ట్రాలకు పూర్తి న్యాయం.. అమరావతి నుంచి త్వరలోనే బుల్లెట్ ట్రైన్..
- Mumbai: దారుణం.. కల్మా పఠించలేదని ఇద్దరు సెక్యూరిటీ గార్డులపై దాడి.. రంగంలోకి ఏటీఎస్
- Crime: ఇదేం దారుణం రా నాయనా.. బస్సు ఎక్కడికి వెళ్తుందని అడిగినందుకు వృద్ధుడి హత్య..
ఒక రోజు ముందు కేథలిక్ చర్చి హమాస్ను ఖండించింది. కేరళలో జరిగిన ర్యాలీలో హమాస్ మాజీ చీఫ్ ప్రసంగించిన తీరు, ఆయనకు మద్దతుగా నినాదాలు చేయడం సరికాదని చర్చి తరపున పేర్కొన్నారు. ఉగ్రవాదులను కీర్తించకూడదు. ఇప్పుడు ప్రార్థనా సమావేశంలో చర్చిపై దాడి జరిగింది. మలప్పురంలో హమాస్కు మద్దతుగా జమాతే ఇస్లామీ అసోసియేట్ ఆర్గనైజేషన్ ర్యాలీని చేపట్టింది. ఈ పేలుడులో ఉగ్రవాద కోణం కనిపిస్తోంది. భయాందోళనకు గురిచేసేందుకే చర్చిలో ఈ దాడికి పాల్పడ్డారని చెబుతున్నారు. ఆదివారం ప్రార్థనా సమావేశంలో చర్చిలో 1000 మంది ఉన్నారు. ఈ సమయంలో కొంతమంది యూదులు కూడా అక్కడ ఉన్నారని కూడా చెప్పుతున్నారు. కేరళలో జరిగిన హమాస్ ర్యాలీలో హమాస్ నాయకుడు విషం చిమ్మినట్లు తెలుస్తోంది. హమాస్ నాయకుడు యూదులపైనే కాకుండా హిందువులపై కూడా విషం చిమ్మాడు. వారి నిర్మూలన గురించి మాట్లాడాడు. ఇక కేరళ గురించి మాట్లాడితే ఇక్కడ ఉగ్రవాద సంస్థల అనుమానితులు తరచుగా పట్టుబడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం కూడా సీరియస్గా వ్యవహరిస్తోంది. హోంమంత్రి అమిత్ షా సీఎం పినరయి విజయన్తో ఫోన్లో మాట్లాడి ఘటనపై సమాచారం తీసుకున్నారు.
Read Also:Japan : కార్తీ జపాన్ ట్రైలర్ రిలీజ్.. క్రేజీ దొంగ గా అదరగొట్టిన కార్తీ..
తాజావార్తలు
-
Mahabubabad: దారుణం.. ఇద్దరు కుమారులకు ఉరేసి, తానూ ఆత్మహత్య చేసుకున్న తండ్రి..
-
Ashwini Vaishnaw: విశాఖపట్నం ఇక ఏఐపట్నం.. దక్షిణాది రాష్ట్రాలకు పూర్తి న్యాయం.. అమరావతి నుంచి త్వరలోనే బుల్లెట్ ట్రైన్..
-
Mumbai: దారుణం.. కల్మా పఠించలేదని ఇద్దరు సెక్యూరిటీ గార్డులపై దాడి.. రంగంలోకి ఏటీఎస్
-
Crime: ఇదేం దారుణం రా నాయనా.. బస్సు ఎక్కడికి వెళ్తుందని అడిగినందుకు వృద్ధుడి హత్య..
-
Ashu Reddy: హైకోర్టును ఆశ్రయించిన అషురెడ్డి ..
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!