Currency: పెద్ద నోట్ల రద్దుకు ఆరేళ్లు పూర్తి.. కానీ ప్రజల వద్ద డబ్బెంతో తెలుసా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Currency: పెద్ద నోట్ల రద్దు చర్య తర్వాత ఆరేళ్ల తర్వాత కూడా నగదు వినియోగం ఇంకా తగ్గలేదు. ప్రజల వద్ద ఉన్న కరెన్సీ అక్టోబరు 21 నాటికి రూ. 30.88 లక్షల కోట్ల కొత్త గరిష్ట స్థాయికి చేరుకుంది. రోజురోజుకీ కొత్త డిజిటల్ చెల్లింపుల సాధనాలు అందుబాటులోకి వస్తున్నప్పటికీ.. నగదుకు మాత్రం ప్రాధాన్యం తగ్గడం లేదు. నోట్ల రద్దు జరిగిన నాటితో పోలిస్తే ప్రజల వద్ద ఉన్న డబ్బు విలువలో 70 శాతానికి పైగా వృద్ధి నమోదు కావడం గమనార్హం. నోట్ల రద్దును ప్రకటించిన 2016 నవంబరు 4 నాటితో పోలిస్తే ప్రజల వద్ద ఉన్న నగదు విలువ 71.84 శాతం పెరిగినట్లు ఆర్బీఐ విడుదల చేసిన నివేదిక ద్వారా వెల్లడైంది. ఆర్థిక వ్యవస్థలో అవినీతి, నల్లధనాన్ని తగ్గించడమే అంతిమ లక్ష్యంగా రూ.500, రూ.1000 నోట్లను ఉపసంహరించుకునే నిర్ణయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు.
2016 నవంబరు 4 నాటికి ప్రజల వద్ద ఉన్న నగదు విలువ రూ.17.7 లక్షల కోట్లుగా ఉండగా.. అక్టోబర్ 21, 2022 నాటికి అది రూ.30.88 లక్షల కోట్లకు పెరిగింది. ఈ సమాచారం ఆర్బీఐ విడుదల చేసిన ద్రవ్య సరఫరాపై డేటాలో వెల్లడైంది. పబ్లిక్తో ఉన్న కరెన్సీ అనేది ప్రజలు లావాదేవీలు జరపడానికి, లావాదేవీలను పరిష్కరించుకోవడానికి, వస్తువులు మరియు సేవలను కొనుగోలు చేయడానికి ఉపయోగించే నోట్లు, నాణేలను సూచిస్తుంది. చెలామణిలో ఉన్న కరెన్సీ నుండి బ్యాంకుల్లో నగదును తీసివేసిన తర్వాత ఈ సంఖ్య వచ్చింది. ఆర్థిక వ్యవస్థలో నగదు వినియోగం క్రమంగా పెరుగుతోంది. కొత్త కొత్త డిజిటల్ చెల్లింపు సాధనాలు అందుబాటులోకి వస్తున్నప్పటికీ.. నగదు చలామణి సైతం అదే స్థాయిలో పెరుగుతండడం గమనార్హం. డిజిటల్ చెల్లింపులపై 2019 ఆర్బీఐ అధ్యయనం పాక్షికంగా సమస్యను పరిష్కరించింది.
Also Read
- Ketan Agarwal Case: కేతన్-సియా కేసులో కొత్త ట్విస్ట్.. బ్లాక్మెయిల్ కోణంలో దర్యాప్తు..
- Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
- Saikrishna Lockup Death: సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో సిట్ దూకుడు.. మరో ఇద్దరు పోలీసుల కోసం గాలింపు!
- Ayodhya: అయోధ్య రామాలయ విరాళాల కుంభకోణంలో కీలక పరిణామం.. ట్రస్ట్ కీలక సభ్యులు రాజీనామా..
Team India: 2007 మేజిక్ రిపీట్ అవుతుందా? మరోసారి విశ్వవిజేత అవుతామా?
డీమోనిటైజేషన్ తర్వాత భారతదేశంలో డిజిటల్ లావాదేవీలు గణనీయంగా పెరిగాయని, అయినప్పటికీ దేశంలో డిజిటల్ చెల్లింపులు జీడీపీ నిష్పత్తి తక్కువగా ఉన్నాయని ఆర్బీఐ పేర్కొంది. ఇటీవల దీపావళి వారంలో నగదు చలామణిలో ఉన్న కరెన్సీ రూ.7,600 కోట్ల మేర తగ్గినట్లు ఎస్బీఐ నివేదిక తెలిపింది. గత రెండు దశాబ్దాల్లో నగదు చెలామణి తగ్గడం ఇదే మొదటిసారని పేర్కొంది. దేశంలో ప్రజలు డిజిటల్ చెల్లింపులపై ఆధారపడడం పెరగడమే ఇందుకు కారణమని ఎస్బీఐ ఆర్థికవేత్తలు తెలిపారు. ప్రస్తుతం భారత ఆర్థిక వ్యవస్థ నిర్మాణాత్మక మార్పులకు లోనవుతున్నట్లు వెల్లడించారు.
తాజావార్తలు
-
Ketan Agarwal Case: కేతన్-సియా కేసులో కొత్త ట్విస్ట్.. బ్లాక్మెయిల్ కోణంలో దర్యాప్తు..
-
Sanjay Jaju : తెలంగాణ నూతన సీఎస్ గా సంజయ్ జాజు నియామకం
-
Varanasi Update: ‘వారణాసి’ నుంచి బిగ్ అప్డేట్.. ఈ సెప్టెంబర్ నాటికే..!
-
Shah Rukh Khan: ‘నా భర్త కంటే మీరే ఇష్టం’.. మహిళా అభిమాని మాటకు షారుఖ్ ఇచ్చిన సమాధానం వైరల్
-
Woman Constable: ఇదేం పద్దతి మేడం.. ఫిర్యాదు కోసం వచ్చిన వృద్ధుడి ఎదుట.. టేబుల్పై కాళ్లు పెట్టిన మహిళా కానిస్టేబుల్
ట్రెండింగ్
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!
-
Viral Video: పోలీస్ స్టేషన్లో సహోద్యోగిని ముద్దుపెట్టుకున్న మహిళా కానిస్టేబుల్.. చివరకు.?
-
రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!
-
Pesara Garelu Recipe: బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా ఉండే రుచికరమైన స్నాక్ “పెసర గారెలు” చేసేయండి ఇలా.!