Currency: పెద్ద నోట్ల రద్దుకు ఆరేళ్లు పూర్తి.. కానీ ప్రజల వద్ద డబ్బెంతో తెలుసా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Currency: పెద్ద నోట్ల రద్దు చర్య తర్వాత ఆరేళ్ల తర్వాత కూడా నగదు వినియోగం ఇంకా తగ్గలేదు. ప్రజల వద్ద ఉన్న కరెన్సీ అక్టోబరు 21 నాటికి రూ. 30.88 లక్షల కోట్ల కొత్త గరిష్ట స్థాయికి చేరుకుంది. రోజురోజుకీ కొత్త డిజిటల్ చెల్లింపుల సాధనాలు అందుబాటులోకి వస్తున్నప్పటికీ.. నగదుకు మాత్రం ప్రాధాన్యం తగ్గడం లేదు. నోట్ల రద్దు జరిగిన నాటితో పోలిస్తే ప్రజల వద్ద ఉన్న డబ్బు విలువలో 70 శాతానికి పైగా వృద్ధి నమోదు కావడం గమనార్హం. నోట్ల రద్దును ప్రకటించిన 2016 నవంబరు 4 నాటితో పోలిస్తే ప్రజల వద్ద ఉన్న నగదు విలువ 71.84 శాతం పెరిగినట్లు ఆర్బీఐ విడుదల చేసిన నివేదిక ద్వారా వెల్లడైంది. ఆర్థిక వ్యవస్థలో అవినీతి, నల్లధనాన్ని తగ్గించడమే అంతిమ లక్ష్యంగా రూ.500, రూ.1000 నోట్లను ఉపసంహరించుకునే నిర్ణయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు.
2016 నవంబరు 4 నాటికి ప్రజల వద్ద ఉన్న నగదు విలువ రూ.17.7 లక్షల కోట్లుగా ఉండగా.. అక్టోబర్ 21, 2022 నాటికి అది రూ.30.88 లక్షల కోట్లకు పెరిగింది. ఈ సమాచారం ఆర్బీఐ విడుదల చేసిన ద్రవ్య సరఫరాపై డేటాలో వెల్లడైంది. పబ్లిక్తో ఉన్న కరెన్సీ అనేది ప్రజలు లావాదేవీలు జరపడానికి, లావాదేవీలను పరిష్కరించుకోవడానికి, వస్తువులు మరియు సేవలను కొనుగోలు చేయడానికి ఉపయోగించే నోట్లు, నాణేలను సూచిస్తుంది. చెలామణిలో ఉన్న కరెన్సీ నుండి బ్యాంకుల్లో నగదును తీసివేసిన తర్వాత ఈ సంఖ్య వచ్చింది. ఆర్థిక వ్యవస్థలో నగదు వినియోగం క్రమంగా పెరుగుతోంది. కొత్త కొత్త డిజిటల్ చెల్లింపు సాధనాలు అందుబాటులోకి వస్తున్నప్పటికీ.. నగదు చలామణి సైతం అదే స్థాయిలో పెరుగుతండడం గమనార్హం. డిజిటల్ చెల్లింపులపై 2019 ఆర్బీఐ అధ్యయనం పాక్షికంగా సమస్యను పరిష్కరించింది.
Also Read
- Nalgonda: రక్తసంబంధానికే మాయని మచ్చ.. ఆస్తి కోసం ఎంత పని చేశారంటే..!
- US-Iran: ఇరాన్ ప్రతిపాదనలు తిరస్కరించిన అమెరికా.. మళ్లీ యుద్ధం తప్పదా?
- I BOMMA: తెలుగుతో పాటు ఇతర భాషల సినిమాలు ఉచితంగా స్ట్రీమింగ్.. 'ఐబొమ్మ', 'బప్పం' వెబ్సైట్లపై కేసు దర్యాప్తు ముమ్మరం.!
- CSK vs SRH: బ్రెవిస్ బ్లాస్ట్.. కమిన్స్ క్లాస్.. సన్ రైజర్స్ టార్గెట్ ఎంతంటే.?
Team India: 2007 మేజిక్ రిపీట్ అవుతుందా? మరోసారి విశ్వవిజేత అవుతామా?
డీమోనిటైజేషన్ తర్వాత భారతదేశంలో డిజిటల్ లావాదేవీలు గణనీయంగా పెరిగాయని, అయినప్పటికీ దేశంలో డిజిటల్ చెల్లింపులు జీడీపీ నిష్పత్తి తక్కువగా ఉన్నాయని ఆర్బీఐ పేర్కొంది. ఇటీవల దీపావళి వారంలో నగదు చలామణిలో ఉన్న కరెన్సీ రూ.7,600 కోట్ల మేర తగ్గినట్లు ఎస్బీఐ నివేదిక తెలిపింది. గత రెండు దశాబ్దాల్లో నగదు చెలామణి తగ్గడం ఇదే మొదటిసారని పేర్కొంది. దేశంలో ప్రజలు డిజిటల్ చెల్లింపులపై ఆధారపడడం పెరగడమే ఇందుకు కారణమని ఎస్బీఐ ఆర్థికవేత్తలు తెలిపారు. ప్రస్తుతం భారత ఆర్థిక వ్యవస్థ నిర్మాణాత్మక మార్పులకు లోనవుతున్నట్లు వెల్లడించారు.
తాజావార్తలు
-
Nalgonda: రక్తసంబంధానికే మాయని మచ్చ.. ఆస్తి కోసం ఎంత పని చేశారంటే..!
-
US-Iran: ఇరాన్ ప్రతిపాదనలు తిరస్కరించిన అమెరికా.. మళ్లీ యుద్ధం తప్పదా?
-
I BOMMA: తెలుగుతో పాటు ఇతర భాషల సినిమాలు ఉచితంగా స్ట్రీమింగ్.. ‘ఐబొమ్మ’, ‘బప్పం’ వెబ్సైట్లపై కేసు దర్యాప్తు ముమ్మరం.!
-
CSK vs SRH: బ్రెవిస్ బ్లాస్ట్.. కమిన్స్ క్లాస్.. సన్ రైజర్స్ టార్గెట్ ఎంతంటే.?
-
Blackmail : వరుణ్ సందేశ్ ‘బ్లాక్ మెయిల్’.. లాభాల్లో టెక్నీషియన్స్కు వాటా?
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!