Site icon NTV Telugu

Election Duty: ఎన్నికల డ్యూటీ శిక్షణకు గైర్హాజరు.. 93 మంది ప్రభుత్వ ఉద్యోగులపై కేసు

Election Duty

Election Duty

Election Duty: ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో ఎలక్షన్ డ్యూటీ ట్రైనింగ్‌ను దాటేసినందుకు 93 మంది ప్రభుత్వ ఉద్యోగులపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయనున్నారు. భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా చట్టపరమైన చర్య ప్రారంభించబడింది. జిల్లా అధికారి సూర్యపాల్ గంగ్వార్ ఆదేశాల మేరకు ఎఫ్‌ఐఆర్ నమోదు చేయబడుతుంది. లోక్‌సభ సార్వత్రిక ఎన్నికల ప్రక్రియను పూర్తి చేసేందుకు పోలింగ్ సిబ్బందికి రెండో శిక్షణా కార్యక్రమాన్ని జయనారాయణ (కేకేసీ) పీజీ కళాశాలలో ఈరోజు నిర్వహించినట్లు అధికారి తెలిపారు. సిబ్బంది అందరికీ శిక్షణ తప్పనిసరి అని జిల్లా ఎన్నికల అధికారి తెలిపారు. ఈ క్రమంలో ట్రైనింగ్‌కు 93 మంది ప్రభుత్వ ఉద్యోగులు గైర్హాజరయ్యారు. ఈ నేపథ్యంలో వారిపై జిల్లా అధికారి చర్యలకు ఉపక్రమించారు.

Read Also: Karnataka Horror: ముగ్గురి కిడ్నాప్, వారి ప్రైవేట్ భాగాలపై విద్యుత్ షాక్‌తో చిత్రహింసలు.. వీడియోలు వైరల్

ఉత్తరప్రదేశ్‌లోని 80 స్థానాలకు 7 దశల్లో పోలింగ్ జరగనుంది. మే 13న షెడ్యూల్ చేయబడిన నాల్గవ దశలో షాజహాన్‌పూర్, ఖేరీ, ధౌరహర, సీతాపూర్, హర్దోయ్, మిస్రిఖ్, ఉన్నావ్, ఫరూఖాబాద్, ఇటావా, కన్నౌజ్, కాన్పూర్, అక్బర్‌పూర్, బహ్రైచ్‌లలో ఓటింగ్ జరగనుంది.

Exit mobile version