MLC C Ramachandraiah: అరాచక పాలనలో భాగస్వామ్యం కాకూడదనే రాజీనామా చేశా: ఎమ్మెల్సీ రామచంద్రయ్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వైసీపీ ఎమ్మెల్సీ పదవికి సీ రామచంద్రయ్య రాజీనామా చేశారు. అరాచక పాలనలో భాగస్వామ్యం కాకూడదనే తాను రాజీనామా చేశానని రామచంద్రయ్య తెలిపారు. ఎమ్మెల్సీగా ఇంకా 3సంవత్సరాల పదవీకాలం ఉన్నా.. రాజీనామా చేస్తున్నా అని, ప్రజా జీవితంలో రాజీపడకుండా బ్రతుకున్నా అని అన్నారు. ఏపీలో ప్రజాస్వామ్యం, రాజ్యాంగ వ్యవస్థలు చిన్నాభిన్నం అయ్యాయని.. రాష్ట్రంలో ఏం జరుగుతుందో సీఎం వైఎస్ జగన్ చూసుకోవాలన్నారు. తప్పిదాలను జగన్కు చెప్పే అవకాశం రావడం లేదని, క్యాడర్ సలహాలు తీసుకోకుండానే నిర్ణయాలు తీసుకుంటున్నారని రామచంద్రయ్య చెప్పారు.
వైసీపీ ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన అనంతరం సీ రామచంద్రయ్య మాట్లాడుతూ… ‘రాష్ట్రంలో ప్రజాస్వామ్య, రాజ్యాంగ వ్యవస్థలు చిన్నాభిన్నమయ్యాయి. అరాచక పాలనలో భాగస్వామ్యం కాకూడదనే రాజీనామా చేశా. ఎమ్మెల్సీగా ఇంకా 3సంవత్సరాల పదవీకాలం ఉన్నా.. రాజీనామా చేస్తున్నా. ప్రజాజీవితంలో రాజీపడకుండా బ్రతుకున్నా. ఇప్పటివరకు రాజకీయ విలువలు కాపాడుకుంటూ వచ్చా. వైసీపీలో ఉన్నందుకు చాలాకాలం నుంచి అంతర్మధనం చెందా. కొంతకాలం నుంచి మీడియాకు దూరంగా ఉన్నా. ప్రజల ఆస్తులను కాపాడుకోలేకపోయాం. తప్పిదాలను సీఎం జగన్కు చెప్పడానికి అవకాశం రాలేదు. జగన్తో మనసు విప్పి మాట్లాడే అవకాశం రాలేదు. రాష్ట్రంలో ఏం జరుగుతుందో జగన్ చూసుకోవాలి’ అని అన్నారు.
Also Read
- GT vs CSK: టాస్ గెలిచిన రుతురాజ్ గైక్వాడ్.. గిల్ సేనకు మొదట బ్యాటింగ్ సవాల్..
- Twisha Sharma: తెలుగు నటి ట్విషా శర్మ మృతి కేసులో అత్త గారికి ప్రభుత్వం షాక్.. కీలక పదవి నుంచి తొలగింపు
- Sai Sudharsan: చిన్నప్పుడు రోడ్డుపై ఆ జట్టును చూసేవాడిని.. ఇప్పుడు అదే జట్టుపై రికార్డులు: సాయి సుదర్శన్
- Karnataka: త్వరలో కాంగ్రెస్ హైకమాండ్ భేటీ.. తేల్చేయనున్న కర్ణాటక పంచాయితీ!
Also Read: Shaik Mastan Vali: వైఎస్ఆర్ కలను నిజం చేయటానికి షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరారు!
‘పార్టీలో నుంచి బయటకు వచ్చామని స్క్రాప్ అంటున్నారు. పార్టీలో చేరమని మా ఇంటిచుట్టూ తిరిగినప్పుడు స్క్రాప్ అని తెలియదా?. వైసీపీలో రాజకీయంగా ప్రజాస్వామ్యం కనిపించలేదు. సలహాదారులైనా సరైన సలహాలు ఇచ్చి జగన్ను మారిస్తే బాగుంటుంది. క్యాడర్ సలహాలు తీసుకోకుండా నిర్ణయాలు తీసుకుంటున్నారు. వందల కోట్లు ప్రజాధనం కోర్టులో కేసులకు దుర్వినియోగం చేస్తున్నారు. కేసుల కోసం కేంద్రంతో రాజీపడి రాష్ట్రానికి రావాల్సిన ప్రాజెక్టులు వదులుకున్నారు. సాధికారత సభల వల్ల ఎలాంటి ఉపయోగం లేదు’ అని సీ రామచంద్రయ్య చెప్పుకొచ్చారు.
- Tags
తాజావార్తలు
-
GT vs CSK: టాస్ గెలిచిన రుతురాజ్ గైక్వాడ్.. గిల్ సేనకు మొదట బ్యాటింగ్ సవాల్..
-
Twisha Sharma: తెలుగు నటి ట్విషా శర్మ మృతి కేసులో అత్త గారికి ప్రభుత్వం షాక్.. కీలక పదవి నుంచి తొలగింపు
-
Summer Tips: ఎండ నుంచి వచ్చాక వెంటనే ఐస్ వాటర్ తాగుతున్నారా? ప్రమాదం ఇదే
-
Sai Sudharsan: చిన్నప్పుడు రోడ్డుపై ఆ జట్టును చూసేవాడిని.. ఇప్పుడు అదే జట్టుపై రికార్డులు: సాయి సుదర్శన్
-
Karnataka: త్వరలో కాంగ్రెస్ హైకమాండ్ భేటీ.. తేల్చేయనున్న కర్ణాటక పంచాయితీ!
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!