MLC C Ramachandraiah: అరాచక పాలనలో భాగస్వామ్యం కాకూడదనే రాజీనామా చేశా: ఎమ్మెల్సీ రామచంద్రయ్య
వైసీపీ ఎమ్మెల్సీ పదవికి సీ రామచంద్రయ్య రాజీనామా చేశారు. అరాచక పాలనలో భాగస్వామ్యం కాకూడదనే తాను రాజీనామా చేశానని రామచంద్రయ్య తెలిపారు. ఎమ్మెల్సీగా ఇంకా 3సంవత్సరాల పదవీకాలం ఉన్నా.. రాజీనామా చేస్తున్నా అని, ప్రజా జీవితంలో రాజీపడకుండా బ్రతుకున్నా అని అన్నారు. ఏపీలో ప్రజాస్వామ్యం, రాజ్యాంగ వ్యవస్థలు చిన్నాభిన్నం అయ్యాయని.. రాష్ట్రంలో ఏం జరుగుతుందో సీఎం వైఎస్ జగన్ చూసుకోవాలన్నారు. తప్పిదాలను జగన్కు చెప్పే అవకాశం రావడం లేదని, క్యాడర్ సలహాలు తీసుకోకుండానే నిర్ణయాలు తీసుకుంటున్నారని రామచంద్రయ్య చెప్పారు.
వైసీపీ ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన అనంతరం సీ రామచంద్రయ్య మాట్లాడుతూ… ‘రాష్ట్రంలో ప్రజాస్వామ్య, రాజ్యాంగ వ్యవస్థలు చిన్నాభిన్నమయ్యాయి. అరాచక పాలనలో భాగస్వామ్యం కాకూడదనే రాజీనామా చేశా. ఎమ్మెల్సీగా ఇంకా 3సంవత్సరాల పదవీకాలం ఉన్నా.. రాజీనామా చేస్తున్నా. ప్రజాజీవితంలో రాజీపడకుండా బ్రతుకున్నా. ఇప్పటివరకు రాజకీయ విలువలు కాపాడుకుంటూ వచ్చా. వైసీపీలో ఉన్నందుకు చాలాకాలం నుంచి అంతర్మధనం చెందా. కొంతకాలం నుంచి మీడియాకు దూరంగా ఉన్నా. ప్రజల ఆస్తులను కాపాడుకోలేకపోయాం. తప్పిదాలను సీఎం జగన్కు చెప్పడానికి అవకాశం రాలేదు. జగన్తో మనసు విప్పి మాట్లాడే అవకాశం రాలేదు. రాష్ట్రంలో ఏం జరుగుతుందో జగన్ చూసుకోవాలి’ అని అన్నారు.
Also Read
- UAE vs Saudi Arabia: ఉప్పు నిప్పుగా యూఏఈ, సౌదీ అరేబియా.. గల్ఫ్లో పవర్ స్ట్రగుల్..
- PBKS vs RR: స్టోయినిస్ తుఫాన్ ఇన్నింగ్స్.. రాజస్థాన్ ముందు భారీ లక్ష్యం.!
- S-400 air defence system: పాకిస్తాన్కు చుక్కలే.. మరో ఎస్-400 భారత్ రాబోతోంది
- Petrol Bunks Rush: పెట్రోల్ బంకుల వద్ద రద్దీకి అసలు కారణాలు ఇవే..!
Also Read: Shaik Mastan Vali: వైఎస్ఆర్ కలను నిజం చేయటానికి షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరారు!
‘పార్టీలో నుంచి బయటకు వచ్చామని స్క్రాప్ అంటున్నారు. పార్టీలో చేరమని మా ఇంటిచుట్టూ తిరిగినప్పుడు స్క్రాప్ అని తెలియదా?. వైసీపీలో రాజకీయంగా ప్రజాస్వామ్యం కనిపించలేదు. సలహాదారులైనా సరైన సలహాలు ఇచ్చి జగన్ను మారిస్తే బాగుంటుంది. క్యాడర్ సలహాలు తీసుకోకుండా నిర్ణయాలు తీసుకుంటున్నారు. వందల కోట్లు ప్రజాధనం కోర్టులో కేసులకు దుర్వినియోగం చేస్తున్నారు. కేసుల కోసం కేంద్రంతో రాజీపడి రాష్ట్రానికి రావాల్సిన ప్రాజెక్టులు వదులుకున్నారు. సాధికారత సభల వల్ల ఎలాంటి ఉపయోగం లేదు’ అని సీ రామచంద్రయ్య చెప్పుకొచ్చారు.
- Tags
తాజావార్తలు
-
UAE vs Saudi Arabia: ఉప్పు నిప్పుగా యూఏఈ, సౌదీ అరేబియా.. గల్ఫ్లో పవర్ స్ట్రగుల్..
-
PBKS vs RR: స్టోయినిస్ తుఫాన్ ఇన్నింగ్స్.. రాజస్థాన్ ముందు భారీ లక్ష్యం.!
-
Payal Rajput: రిపోర్టర్ ప్రశ్నకు ఏడుస్తూ ఈవెంట్ నుంచి వెళ్లిపోయిన పాయల్ రాజ్పుత్
-
The Lalit Hotel: ఢిల్లీలోని లగ్జరీ హోటల్కు వెయ్యి కోట్ల పెనాల్టీ! ఎందుకో తెలుసా?
-
S-400 air defence system: పాకిస్తాన్కు చుక్కలే.. మరో ఎస్-400 భారత్ రాబోతోంది
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో