MLC C Ramachandraiah: అరాచక పాలనలో భాగస్వామ్యం కాకూడదనే రాజీనామా చేశా: ఎమ్మెల్సీ రామచంద్రయ్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వైసీపీ ఎమ్మెల్సీ పదవికి సీ రామచంద్రయ్య రాజీనామా చేశారు. అరాచక పాలనలో భాగస్వామ్యం కాకూడదనే తాను రాజీనామా చేశానని రామచంద్రయ్య తెలిపారు. ఎమ్మెల్సీగా ఇంకా 3సంవత్సరాల పదవీకాలం ఉన్నా.. రాజీనామా చేస్తున్నా అని, ప్రజా జీవితంలో రాజీపడకుండా బ్రతుకున్నా అని అన్నారు. ఏపీలో ప్రజాస్వామ్యం, రాజ్యాంగ వ్యవస్థలు చిన్నాభిన్నం అయ్యాయని.. రాష్ట్రంలో ఏం జరుగుతుందో సీఎం వైఎస్ జగన్ చూసుకోవాలన్నారు. తప్పిదాలను జగన్కు చెప్పే అవకాశం రావడం లేదని, క్యాడర్ సలహాలు తీసుకోకుండానే నిర్ణయాలు తీసుకుంటున్నారని రామచంద్రయ్య చెప్పారు.
వైసీపీ ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన అనంతరం సీ రామచంద్రయ్య మాట్లాడుతూ… ‘రాష్ట్రంలో ప్రజాస్వామ్య, రాజ్యాంగ వ్యవస్థలు చిన్నాభిన్నమయ్యాయి. అరాచక పాలనలో భాగస్వామ్యం కాకూడదనే రాజీనామా చేశా. ఎమ్మెల్సీగా ఇంకా 3సంవత్సరాల పదవీకాలం ఉన్నా.. రాజీనామా చేస్తున్నా. ప్రజాజీవితంలో రాజీపడకుండా బ్రతుకున్నా. ఇప్పటివరకు రాజకీయ విలువలు కాపాడుకుంటూ వచ్చా. వైసీపీలో ఉన్నందుకు చాలాకాలం నుంచి అంతర్మధనం చెందా. కొంతకాలం నుంచి మీడియాకు దూరంగా ఉన్నా. ప్రజల ఆస్తులను కాపాడుకోలేకపోయాం. తప్పిదాలను సీఎం జగన్కు చెప్పడానికి అవకాశం రాలేదు. జగన్తో మనసు విప్పి మాట్లాడే అవకాశం రాలేదు. రాష్ట్రంలో ఏం జరుగుతుందో జగన్ చూసుకోవాలి’ అని అన్నారు.
Also Read
- Train Ticket Booking: ప్రయాణికులకు శుభవార్త.. మరింత ఈజీగా బుకింగ్లు.. ఎప్పటి నుంచంటే..!
- Israel-Iran: ఇరాన్ సీజ్ఫైర్పై ఇజ్రాయెల్ మౌనం.. సర్వత్రా ఉత్కంఠ!
- Vaibhav: 15 ఏళ్ల వండర్ కిడ్ ‘వైభవ్ సూర్యవంశీ’పైనే అందరి కళ్ళు.. లంక పిచ్లపై భారత్ 'ఎ' ట్రై-సిరీస్ పోరు..
- Mahua Moitra: అమిత్ షా పిలవగానే వెళ్తావా సిగ్గు లేదా.? యూసుఫ్ పఠాన్పై మహువా మోయిత్రా ఫైర్..
Also Read: Shaik Mastan Vali: వైఎస్ఆర్ కలను నిజం చేయటానికి షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరారు!
‘పార్టీలో నుంచి బయటకు వచ్చామని స్క్రాప్ అంటున్నారు. పార్టీలో చేరమని మా ఇంటిచుట్టూ తిరిగినప్పుడు స్క్రాప్ అని తెలియదా?. వైసీపీలో రాజకీయంగా ప్రజాస్వామ్యం కనిపించలేదు. సలహాదారులైనా సరైన సలహాలు ఇచ్చి జగన్ను మారిస్తే బాగుంటుంది. క్యాడర్ సలహాలు తీసుకోకుండా నిర్ణయాలు తీసుకుంటున్నారు. వందల కోట్లు ప్రజాధనం కోర్టులో కేసులకు దుర్వినియోగం చేస్తున్నారు. కేసుల కోసం కేంద్రంతో రాజీపడి రాష్ట్రానికి రావాల్సిన ప్రాజెక్టులు వదులుకున్నారు. సాధికారత సభల వల్ల ఎలాంటి ఉపయోగం లేదు’ అని సీ రామచంద్రయ్య చెప్పుకొచ్చారు.
- Tags
తాజావార్తలు
-
Train Ticket Booking: ప్రయాణికులకు శుభవార్త.. మరింత ఈజీగా బుకింగ్లు.. ఎప్పటి నుంచంటే..!
-
Israel-Iran: ఇరాన్ సీజ్ఫైర్పై ఇజ్రాయెల్ మౌనం.. సర్వత్రా ఉత్కంఠ!
-
Vaibhav: 15 ఏళ్ల వండర్ కిడ్ ‘వైభవ్ సూర్యవంశీ’పైనే అందరి కళ్ళు.. లంక పిచ్లపై భారత్ ‘ఎ’ ట్రై-సిరీస్ పోరు..
-
Mahua Moitra: అమిత్ షా పిలవగానే వెళ్తావా సిగ్గు లేదా.? యూసుఫ్ పఠాన్పై మహువా మోయిత్రా ఫైర్..
-
Kitchen Hacks: వంటగదిలో ఈ చిన్న ట్రిక్స్ తెలిస్తే.. మీ పని సగం తగ్గుతుంది!
ట్రెండింగ్
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!